Minister Sandhya Rani: వైసీపీ మళ్లీ అధికారంలోకి రావాలంటే.. యుగాంతం అయిపోవాలి..!
- వైసీపీ మరలా అధికారంలోకి రావాలంటే... యుగాంతం అయిపోవాలి..
- మంత్రి గుమ్మడి సంధ్యారాణి హాట్ కామెంట్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Sandhya Rani: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరలా అధికారంలోకి రావాలంటే… యుగాంతం అయిపోవాలి అంటూ ఎద్దేవా చేశారు మంత్రి గుమ్మడి సంధ్యారాణి.. విజయనగరం జిల్లా మెంటాడ మండల కేంద్రంలోని టీడీపీ కార్యాలయంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆమె.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పోలీసులపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఫైర్ అయ్యారు.. ఓ మాజీ సీఎం.. పోలీసుల బట్టలు ఊడదీస్తాననడం ఎంతవరకు కరెక్ట్? అని నిలదీశారు.. జగన్ సభ్యత సంస్కారం లేని వారిలా మాట్లాడుతున్నారు అని ఫైర్ అయ్యారు.. గొడ్డలి పోటుకు.. గుండె పోటుకి తేడా తెలియని వారు.. కోడి కొత్తి డ్రామాలు చేసినవారు.. పదవులు కోసం.. సొంత తల్లినే ఇంటి నుండి గెంటశారు.. ఆస్థి కోసం చెల్లిని బయటకు నెట్టేసినవారు అంటూ కామెంట్ చేశారు.
Read Also: Tahawwur Rana: కసబ్కి కాంగ్రెస్ బిర్యానీ పెట్టింది.. తహవూర్ రాణా అప్పగింతపై కేంద్రమంత్రి..
Also Read
- AP Horror: మాఫియాలో చేరాలని ప్లాన్.. స్నేహితుడితో కలిసి తల్లిని హత్య చేసిన కొడుకు.. బంగారంతో పరారీ
- Vizianagaram Road Accident: విజయనగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆగిఉన్న లారీని ఢీకొన్న కారు, నలుగురు మృతి
- Ramateertham incident: రామతీర్థం ఘటనలో కీలక పరిణామం.. ధ్వంసమైన విగ్రహాలు నేడు నిమజ్జనం..
- Travels Bus Caught Fire: మరో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో అకస్మాత్తుగా మంటలు.. పూర్తిగా దగ్ధం..
ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న జగన్ మోహన్ రెడ్డికి వన్ ప్లెస్.. వన్ భద్రత ఇవ్వాలి.. మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంచి వారు కాబట్టి , జగన్ మోహన్ రెడ్డి.. నీకు అంత సెక్యూరీటీ ఇచ్చారు.. నీకు 200 మంది పోలీసులు ఎందుకు, నీ డ్రామాలు వినడానికి ఎవరూ రెడీగా లేరన్నారు సంధ్యారాణి.. నీ వద్దకు జనాలు రావడం లేదు.. 100 మందిని డబ్బులు ఇచ్చి తెప్పించుకొని.. మీద.. మీద పడేసుకొని, ఇది పోలీసులు వైఫల్యం అని చెబుతున్నావు.. పోలీసులు యూనిఫామ్ నువ్వు తీసేస్తావా..? పోలీస్ యూనిఫామ్… అరటి తొక్క అనుకుంటున్నావా..? తీసి పారేయడానికి.. అని ఒక పోలీసు సోదరుడు బాగా అడిగాడు..? సెటైర్లు వేశారు.. ఇక, వైసీపీ మరలా అధికారంలోకి రావాలంటే.. యుగాంతం అయిపోవాలి అని జోస్యం చెప్పారు.. రెడ్ బుక్ అంటే.. ఒక్కొక్కరికి షర్ట్ లు తడిసిపోతున్నాయిన అని వ్యాఖ్యానించారు మంత్రి గుమ్మడి సంధ్యారాణి.
తాజావార్తలు
-
Story Board : తెలంగాణలో బెంగాల్ తరహా రాజకీయం సాధ్యమా..?
-
Shreyas Iyer: మళ్లీ అదే తప్పు.. ఎంత చెప్పినా.. ఎవరు చెప్పినా మారని శ్రేయాస్ అయ్యర్ తీరు..
-
T20 Team: సంజూ శాంసన్, తిలక్ వర్మకు దక్కని చోటు.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఎంట్రీ..
-
Harish Rao : రేవంత్ రెడ్డికి హరీష్ రావు కౌంటర్.. అసెంబ్లీలోనే కాదు ఎక్కడైనా చర్చకు సిద్ధం
-
Europe Heatwave: బాబోయ్ ఎండలు.. కరిగిపోతున్న రహదారులు
ట్రెండింగ్
-
Farmer Job Offer: జాబ్ ఆఫర్ చేసిన మహిళా రైతు.. ఉదయం 6 నుంచి 2 గంటల వరకు పని.. టీ, బ్రేక్ఫాస్ట్ ఫ్రీ..
-
Bread Pakoda Recipe: కరకరలాడే స్ట్రీట్ స్టైల్ ‘బ్రెడ్ పకోడా’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Kitchen Tips: ఫ్రిజ్ శబ్దం పెరిగిందా.? టెక్నీషియన్ను పిలవకుండా ఇంట్లోనే ఇలా చేయండి.!
-
Income Tax Returns: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు అలెర్ట్.. జూలైలో మిస్ కాకూడని ముఖ్యమైన డెడ్లైన్లు ఇవే.!
-
Spider Control : వర్షాకాలంలో సాలీళ్ల బెడదా.? ఈ సహజమైన స్ప్రేలతో చెక్ పెట్టండి.!