Minister Bosta: మేము ఉద్యోగస్తులకు వ్యతిరేకం కాదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తాము ఉద్యోగస్తులకు వ్యతిరేకం కాదని అన్నారు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అంగన్వాడీ అయినా.. మున్సిపల్ కార్మికుడు అయినా ఉపాధ్యాయుడు అయినా అందరూ ఒక్కటేనని తెలిపారు. ఐదో తేదీ నుండి గర్భిణీలకు, బాలింతలకు వైయస్సార్ కిట్లును ప్రభుత్వమే ఇస్తుందని చెప్పారు. అంగన్వాడీలు 11 సమస్యలు తమ ముందు ఉంచారని.. అందులో 10 సమస్యలకు ఒప్పుకున్నామని తెలిపారు. మిగతా ఒకటి జీతాన్ని పెంపుదల చేయాలని అన్నారు. ఎన్నికల ముందు పెంపుదల చేయడం భావ్యం కాదని చెప్పామన్నారు. నాలుగు నెలలు తర్వాత తమ ప్రభుత్వం వస్తుందనీ తమకు నమ్మకం ఉందన్నారు. జగన్ మోహన్ రెడ్డిని మరలా ముఖ్యమంత్రిని చేస్తామని బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు.
Bhatti Vikramarka : తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ రుణాన్ని ఈ విధంగా తీర్చుకోవాలి
Also Read
- AP Horror: మాఫియాలో చేరాలని ప్లాన్.. స్నేహితుడితో కలిసి తల్లిని హత్య చేసిన కొడుకు.. బంగారంతో పరారీ
- Vizianagaram Road Accident: విజయనగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆగిఉన్న లారీని ఢీకొన్న కారు, నలుగురు మృతి
- Ramateertham incident: రామతీర్థం ఘటనలో కీలక పరిణామం.. ధ్వంసమైన విగ్రహాలు నేడు నిమజ్జనం..
- Travels Bus Caught Fire: మరో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో అకస్మాత్తుగా మంటలు.. పూర్తిగా దగ్ధం..
ఆ తరవాత కూర్చుని చర్చించి మీకు ఏది కావాల్సితే అది చేస్తామని చెప్పామన్నారు మంత్రి. కాదు.. మాకు ఇప్పుడే చేయాలి అంటే అది చాలా తప్పు అని అన్నారు. ఐదేళ్ల ప్రభుత్వంలో జీతాలు పెంపు గురించి ఒకసారి మాత్రమే చూస్తది అని తెలిపారు. ప్రతి రెండు ఏళ్లు, మూడు ఏళ్లకు చూడాలి అంటే అది ధర్మం కాదని పేర్కొన్నారు. ఎంత ఇచ్చినా సరిపోదు.. కానీ మానవతా దృక్పథంతో ఆలోచన చేయాలని కోరామన్నారు. తామేమీ వ్యతిరేకం కాదు.. చట్టం తన పని తాను చేసుకుని పోతుందని మంత్రి చెప్పారు.
మున్సిపల్ కార్మికులు చెప్పిందల్లా చేశాం.. స్కవెంజర్స్ కి రూ.21 వేలు చేశామన్నారు మంత్రి బొత్స. తాము చెప్పింది వారు చేయాలని అన్నారు. అంతేగాని ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి.. ప్రతిపక్ష, కమ్యునిస్ట్ పార్టీలు చెప్పినట్టు చేస్తాం అంటే అది భావ్యం కాదని తెలిపారు. సిద్ధాంతాలు, రాజకీయాలు తర్వాత చూసుకుందాం.. కానీ ప్రజలు తాలూకా ఆరోగ్యంతో, ప్రజా కార్యక్రమాలు మీద ఇలా చేయడం భావ్యం కాదని చెప్పారు. ఇలా చేస్తే ప్రజలు భావించరు కాబట్టి వెంటనే నిరసనలు విరమించుకుని విధుల్లో చేరండి అని చెప్పామన్నారు. ఎన్నికలు అయినా తర్వాత కుర్చుని మాట్లాడుకుందామని చెప్పినట్లు మంత్రి పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Syria New Parliament: సిరియాలో ‘కొత్త శకం’.. అసద్ పతనం తర్వాత తొలి పార్లమెంట్ ఇదే!
-
IND vs ENG 1st T20I: టీమిండియా విజయాన్ని అడ్డుకున్న వరుణుడు.. అభిషేక్, శ్రేయస్, దూబె మెరుపులు వృధా!
-
Small Savings Schemes: స్మాల్ సేవింగ్ స్కీమ్స్ లో ఇన్వెస్ట్ చేసేవారికి గుడ్ న్యూస్.. వడ్డీ రేట్లను ప్రకటించిన కేంద్రం
-
Kajal Aggarwal: కాజల్ కెరీర్లోనే మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. ఆ స్టార్ డైరెక్టర్తోనేనా?
-
Joseph Vijay: టైమ్ టు టైమ్..ఫైల్ తర్వాత ఫైల్.. దళపతి మార్క్ రూలింగ్!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!