Minister Bosta: మేము ఉద్యోగస్తులకు వ్యతిరేకం కాదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తాము ఉద్యోగస్తులకు వ్యతిరేకం కాదని అన్నారు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అంగన్వాడీ అయినా.. మున్సిపల్ కార్మికుడు అయినా ఉపాధ్యాయుడు అయినా అందరూ ఒక్కటేనని తెలిపారు. ఐదో తేదీ నుండి గర్భిణీలకు, బాలింతలకు వైయస్సార్ కిట్లును ప్రభుత్వమే ఇస్తుందని చెప్పారు. అంగన్వాడీలు 11 సమస్యలు తమ ముందు ఉంచారని.. అందులో 10 సమస్యలకు ఒప్పుకున్నామని తెలిపారు. మిగతా ఒకటి జీతాన్ని పెంపుదల చేయాలని అన్నారు. ఎన్నికల ముందు పెంపుదల చేయడం భావ్యం కాదని చెప్పామన్నారు. నాలుగు నెలలు తర్వాత తమ ప్రభుత్వం వస్తుందనీ తమకు నమ్మకం ఉందన్నారు. జగన్ మోహన్ రెడ్డిని మరలా ముఖ్యమంత్రిని చేస్తామని బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు.
Bhatti Vikramarka : తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ రుణాన్ని ఈ విధంగా తీర్చుకోవాలి
Also Read
- Pydithalli Ammavari Jatara 2026: విజయనగరం పైడితల్లి జాతర షెడ్యూల్ ఇదే.. సిరిమాను ఉత్సవం ఎప్పుడంటే?
- Botsa Anusha: రాజకీయాల్లోకి బొత్స వారసురాలు.. జెడ్పీ చైర్మన్ రేసులోకి.. క్లారిటీ ఇచ్చిన సత్యనారాయణ
- CM Chandrababu: భోగాపురం ఎయిర్పోర్ట్తో ఉత్తరాంధ్రకు కొత్త చరిత్ర.. దశ, దిశ మారనున్నాయి..
- PM Modi: అల్లూరి నేలపై అభివృద్ధి లాంచ్ప్యాడ్.. భోగాపురం నుంచి ప్రధాని మోడీ కీలక సందేశం
ఆ తరవాత కూర్చుని చర్చించి మీకు ఏది కావాల్సితే అది చేస్తామని చెప్పామన్నారు మంత్రి. కాదు.. మాకు ఇప్పుడే చేయాలి అంటే అది చాలా తప్పు అని అన్నారు. ఐదేళ్ల ప్రభుత్వంలో జీతాలు పెంపు గురించి ఒకసారి మాత్రమే చూస్తది అని తెలిపారు. ప్రతి రెండు ఏళ్లు, మూడు ఏళ్లకు చూడాలి అంటే అది ధర్మం కాదని పేర్కొన్నారు. ఎంత ఇచ్చినా సరిపోదు.. కానీ మానవతా దృక్పథంతో ఆలోచన చేయాలని కోరామన్నారు. తామేమీ వ్యతిరేకం కాదు.. చట్టం తన పని తాను చేసుకుని పోతుందని మంత్రి చెప్పారు.
మున్సిపల్ కార్మికులు చెప్పిందల్లా చేశాం.. స్కవెంజర్స్ కి రూ.21 వేలు చేశామన్నారు మంత్రి బొత్స. తాము చెప్పింది వారు చేయాలని అన్నారు. అంతేగాని ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి.. ప్రతిపక్ష, కమ్యునిస్ట్ పార్టీలు చెప్పినట్టు చేస్తాం అంటే అది భావ్యం కాదని తెలిపారు. సిద్ధాంతాలు, రాజకీయాలు తర్వాత చూసుకుందాం.. కానీ ప్రజలు తాలూకా ఆరోగ్యంతో, ప్రజా కార్యక్రమాలు మీద ఇలా చేయడం భావ్యం కాదని చెప్పారు. ఇలా చేస్తే ప్రజలు భావించరు కాబట్టి వెంటనే నిరసనలు విరమించుకుని విధుల్లో చేరండి అని చెప్పామన్నారు. ఎన్నికలు అయినా తర్వాత కుర్చుని మాట్లాడుకుందామని చెప్పినట్లు మంత్రి పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Mamitha Baiju : రెమ్యునరేషన్ పెంచేసిన మమిత బైజు.. రూ. 3 కోట్లు డిమాండ్?
-
Hanuman Ansh: రూ.2 కోట్ల బడ్జెట్ తో రూ.27 కోట్ల వసూళ్లు.. ఊహించని హిట్ అందుకున్న ‘హనుమాన్ అంశ్’
-
Smartphone Tips: పాత ఫోన్లను మూలన పడేస్తున్నారా?.. వైర్లెస్ మౌస్గా మార్చేసే సింపుల్ ట్రిక్
-
High Court Slams FDA: ‘మీరేమైన దేవుడు అనుకుంటున్నారా..?’ ఎఫ్డీఏకు హైకోర్టు షాక్..!
-
Fit India Ambassador: గౌతమ్ గంభీర్కు భావోద్వేగ క్షణం.. కుమార్తె ఆజీన్కు అరుదైన గౌరవం
ట్రెండింగ్
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!