Vizag TTD Temple: సాగరతీరాన అద్భుతంగా శ్రీవారి ఆలయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విశాఖ సాగర తీరం తిరుమల వేంకటేశ్వర స్వామి నామస్మరణతో మరింతగా పులకించనుంది. భక్త కోటి ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న శ్రీవారి ఆలయం ప్రారంభోత్సవానికి సమయం ఆసన్నమైంది. ఈ నెల 23 వరకూ మహా సంప్రోక్షణ నిర్వహించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేసింది. ఈ విషయం తెలిసి భక్తులు ఆనందపరవశులవుతున్నారు.
ఆధ్యాత్మిక శోభతో విశాఖ సాగరతీరం మరింత కమనీయంగా మారనుంది. సుప్రభాతం సేవతో మొదలుకొని..పవళింపు సేవ వరకు వెంకటేశ్వరుడి నామస్మరణతో విశాఖ నగరం పులకించనుంది. ఋషికొండ సమీపంలో తిరుమల తిరుపతి దేవస్థానం నిర్మించిన వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. విశాఖ రుషికొండ సమీపంలోని 10 ఎకరాల స్థలంలో దేవాలయాన్ని నిర్మించారు. అద్భుత శిల్పకళా నైపుణ్యంతో ఈ కోవెలను తీర్చిదిద్దారు. ఇందుకోసం సుమారు రూ.28 కోట్లు వెచ్చించారు.
Also Read
- Big Scam: సహకార సొసైటీలో భారీ స్కాం.. ఎరువులు రైతులకు ఇస్తున్నట్లు నమ్మించి రూ.1.60 కోట్లు స్వాహా...
- DSC Notification: నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. డీఎస్సీకి ముహూర్తం ఖరారు..
- Nara Lokesh: గిరిజన ప్రాంతాలకు గుడ్ న్యూస్.. వచ్చే ఏడాదిలోగా పాఠశాలలకు సొంత భవనాలు
- Dharmana Krishnadas: 'ఈరోజు అప్పలరాజు.. రేపు మేమే'.. కూటమి ప్రభుత్వంపై ధర్మాన సంచలన వ్యాఖ్యలు
ప్రధాన దేవాలయాన్ని ఒకటిన్నర ఎకరం స్థలంలో నిర్మించారు. నిత్యం పూజలతో పాటు భక్తుల దర్శనం, ప్రసాదాల విక్రయ కేంద్రం వంటి ఏర్పాట్లు చేశారు. మొదటి అంతస్తులో మహాలక్ష్మి, గోదాదేవి సమేతంగా వెంకటేశ్వర స్వామి కొలువై ఉంటారు. ఇక స్వామి వారికి ఇరువైపులా అమ్మవార్ల ఆలయాలు ఉంటాయి. దిగువ అంతస్తులో ధ్యాన మందిరం, కల్యాణోత్సవ మండపం ఏర్పాటు చేశారు. స్వామి వారికి ఎదురుగా ఆంజనేయ స్వామి ఆలయాన్ని నిర్మించారు.
ఉత్తరాంధ్ర వైకుంఠంగా విశాఖలో వెంకటేశ్వర క్షేత్రం ఉండాలనే సంకల్పంతో 2019లో టీటీడీ ఆలయ నిర్మాణం చేపట్టింది. శ్రీనివాసుడి విగ్రహం 7 ఆడుగుల ఎత్తులో ఉంటుంది. ఈ ఆలయ నిర్మాణం పూర్తయి చాలా కాలమే అయినా… సీఎం జగన్ బిజీగా ఉండడం, సరైన ముహూర్తం కుదరకపోవడంతో ప్రారంభోత్సవం ఆలస్యమైంది. 22న నవకలశ స్నాపనం, బింబ వాస్తు, 23న ప్రధాన దేవతామూర్తులను ఆలయంలోనికి శాస్త్రబద్ధంగా చేర్చడంతో పాటు మహా సంప్రోక్షణ నిర్వహించనున్నారు. సాగర తీరంలో శ్రీవారి ఆలయాన్ని టీటీడీ ప్రారంభిస్తుండటం పట్ల విశాఖ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
తాజావార్తలు
-
Gujarat Floods: గుజరాత్ను ముంచెత్తిన వరదలు.. నీళ్లల్లోనే పలు నగరాలు
-
Bitchat: సీజేపీ నిరసనల్లో ఉపయోగించిన ‘‘బిట్చాట్’’ యాప్పై కేంద్రం చర్యలు..
-
Big Scam: సహకార సొసైటీలో భారీ స్కాం.. ఎరువులు రైతులకు ఇస్తున్నట్లు నమ్మించి రూ.1.60 కోట్లు స్వాహా…
-
CJI Surya kant: సీజేపీ నిరసనల పిటిషన్పై సూర్యకాంత్ కీలక ప్రకటన
-
Paper Leak Bill: పేపర్ లీక్ చేస్తే 10 ఏళ్లు జైలు, రూ. 10 కోట్ల జరిమానా.. ఆమోదించిన కేబినెట్..
ట్రెండింగ్
-
కేవలం రూ. 8,999 లకే120Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీతో Lava Virat V1 5G, Virat V1 స్మార్ట్ఫోన్లు లాంచ్..!
-
రూ. 19,499లకే 50MP సోనీ కెమెరా, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో iQOO Z11 Lite 5G లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సక్సెస్ను తలకెక్కించుకోను.. బుద్దిగా ఉంటా.. వైభవ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Kakarakaya Ulli Karam: చేదు లేకుండా కమ్మటి ‘కాకరకాయ ఉల్లి కారం’.. ఇలా చేస్తే పిల్లలు కూడా వదలకుండా తింటారు!
-
Vaibhav Sooryavanshi: బుడ్డోడి బ్యాటింగ్ మిస్ అయ్యారా?.. వైభవ్ మెరుపు ఇన్నింగ్స్ ఫుల్ వీడియో మీకోసమే!