Loan App: లోన్ యాప్ వేధింపులకు మరో యువకుడు బలి.. రుణం తిరిగి ఇవ్వలేదని..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vizag Boy Hemanth Commits Suicide Due To Loan Apps Harassment: అధికారులు ఎంత హెచ్చరిస్తున్నా.. లోన్ యాప్ వేధింపులు మాత్రం తగ్గడం లేదు. తమ వద్ద నుంచి తీసుకున్న రుణాలు తిరిగి ఇవ్వడం లేదని.. వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకొని, మార్ఫింగ్ ఫోటోలతో బెదిరింపులకు పాల్పడుతూనే ఉన్నారు. దీంతో.. బాధితులు అవమానంతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇప్పుడు తాజాగా వైజాగ్కి చెందిన మరో యువకుడు ఈ వేధింపులు తాళలేక సూసైడ్ చేసుకున్నాడు.
Isha Foundation: 10 వేల మంది సైనికులకు క్లాసికల్ హఠ యోగా శిక్షణ: ఈశా ఫౌండేషన్
Also Read
- Sai Krishna Lockup Dea*th Case : సాయికృష్ణ మృతి కేసు.. ఏపీ పోలీసులపై NHRC ఆగ్రహం.. నోటీసులు జారీ
- Tobacco Farmers: పొగాకు రైతులకు ప్రభుత్వం అండ.. కిలో రూ.200 కంటే తక్కువకు కొనొద్దు..
- IAS Krishna Teja: పంచాయతీ నిధుల గోల్మాల్.. వైరల్గా మారిన కమిషనర్ కృష్ణతేజ వార్నింగ్..
- Saikrishna Lockup Death: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ దూకుడు.. మరో ఇద్దరు పోలీసుల కోసం గాలింపు!
ఆ వివరాల్లోకి వెళ్తే.. కంచరపాలెం కప్పరాడ ప్రాంతానికి చెందిన గున్న హేమంత్(30) అనే యువకుడు ఒక ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్నాడు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా కొంతకాలం క్రితం లోన్ యాప్స్ నుంచి కొంత రుణం తీసుకున్నాడు. అయితే.. సమయానికి డబ్బులు కట్టలేక పోయాడు. కొంతమొత్తమే తిరిగి చెల్లించగలిగాడు. డబ్బులు వచ్చాక మిగిలిన మొత్తాన్ని చెల్లించాలని అనుకున్నాడు. కానీ.. ఇంతలోనే లోన్ యాప్ నిర్వాహకులు అతడ్ని వేధించడం మొదలుపెట్టారు. వెంటనే బాకీ చెల్లించాలని, లేదంటే తమ వద్దనున్న మార్ఫింగ్ ఫోటోలను నెట్లో పెడతామని, అలాగే కుటుంబ సభ్యులకు కూడా తెలియజేస్తామని బెదిరించారు. తనకు కొంత సమయం ఇవ్వాలని ప్రాధేయపడినా.. వాళ్లు వినిపించుకోలేదు. ఇంకా ఎక్కువగా వేధించడం స్టార్ట్ చేశారు.
Adani Group: మరింత పెరగనున్న అదానీ ‘పవర్’.. 2బిలియన్ల పెట్టుబడి పెట్టనున్న అబుదాబి కంపెనీ
దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన హేమంత్.. ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నాడు. బుధవారం ఇంట్లో చెప్పి, బిర్లాకూడలి ప్రాంతంలో ఉన్న తన స్నేహితుని ఇంటికి వెళ్లాడు. అక్కడ స్నేహితులతో కలిసి మద్యం సేవించాడు. రాత్రి స్నేహితులు ఎవ్వరూ లేని సమయంలో ఇంట్లో సీలింగ్ ఫ్యాన్కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. స్నేహితుల ద్వారా తన తనయుడు మృతి చెందాడన్న విషయం తెలుసుకున్న తండ్రి గున్న శ్రీనివాసరావు.. తన కొడుకు మృతిపై కంచరపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తాజావార్తలు
-
Ireland: ఐర్లాండ్ చేతిలో ఓడిన 8వ దేశంగా భారత్.. ఇక మిగిలింది ఆ మూడే..
-
Off The Record: కందుకూరు టీడీపీలో సిట్టింగ్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే
-
Shreyas Iyer: ఐర్లాండ్ చేతిలో ఓటమికి కారణం ఇదే.. నిజాన్ని అంగీకరించిన శ్రేయాస్ అయ్యర్..
-
Pulse Polio: 28న పల్స్ పోలియోకు తెలంగాణ రెడీ.!
-
India Lose: ప్రపంచ ఛాంపియన్ల పరువు ఐర్లాండ్ వీధుల్లో పారేశారు.. శ్రేయాస్ అయ్యర్పై ఆగ్రహం..
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!