Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News The Dream Of Vizag Railway Zone Will Come True

Vizag Railway Zone: దశాబ్దాల పోరాటం, నిరీక్షణకు తెర… రేపే ప్రధాని మోడీ శ్రీకారం..

Published Date :January 7, 2025 , 10:56 am
By Sudhakar Ravula
  • నెరవేరబోతోన్న రాష్ట్ర ప్రజల చిరకాల వాంఛ..
  • దక్షిణ కోస్తా రైల్వేజోన్ ఏర్పాటుకు కీలక ముందడుగు..
  • విశాఖ కేంద్రంగా జోన్ కార్యాలయం నిర్మాణం..
  • శంకుస్థాపన చేయనున్న భారత ప్రధాని నరేంద్ర మోడీ..
Vizag Railway Zone: దశాబ్దాల పోరాటం, నిరీక్షణకు తెర… రేపే ప్రధాని మోడీ శ్రీకారం..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Vizag Railway Zone: రైల్వే శాఖకు సంబంధించి రాష్ట్ర ప్రజల చిరకాల వాంఛ నెరవేరబోతోంది. ఏళ్లుగా ఊరిస్తున్న దక్షిణ కోస్తా రైల్వేజోన్ ఏర్పాటుకు కీలక ముందడుగు పడింది. విశాఖ కేంద్రంగా జోన్ కార్యాలయం నిర్మాణానికి భారత ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేయనున్నారు. విశాఖలోని ముడసర్లోవ దగ్గర రైల్వేకు కేటాయించిన భూముల్లో జోనల్ హెడ్ క్వార్టర్ సముదాయం రూపుదిద్దుకోనుంది. ఇక్కడ రైల్వేశాఖకు 52 ఎకరాల స్థలం ఉండగా, సుమారు పదెకరాల్లో కొత్త భవనాలు వస్తాయి. 149 కోట్లతో 9 అంతస్తుల్లో భవనాలు నిర్మాణం కోసం టెండర్ల ప్రక్రియను ప్రారంభించింది రైల్వేశాఖ. వాస్తవానికి దక్షిణ కోస్తా జోన్ ప్రక్రియ వైసీపీ ప్రభుత్వ హయంలోనే ప్రారంభమైనప్పటికీ భూ కేటాయింపుల్లో జాప్యం జరిగిందని రైల్వే వర్గాలు చెబుతున్నాయి. ముడసర్లోవలో ప్రతిపాదించిన భూములు రిజర్వాయర్ క్యాచ్ మెంట్ ఏరియాకు దగ్గరగా వుండటం, సాగు చేసుకుంటున్న రైతుల నుంచి అభ్యతరాలు రావడం కారణం.

Read Also: Gold Rate Today: గోల్డ్ లవర్స్‌కి గుడ్‌న్యూస్.. భారీగా పెరిగిన వెండి!

కూటమి ప్రభుత్వం అధికారంలో కి వచ్చిన తర్వాత జోన్ భూములపై వున్న అడ్డంకులను తొలగించేందుకు చర్యలు చేపట్టింది. చినగదిలి మండలం ముడసర్లోవలో 52.22 ఎకరాలు కేటాయించింది. గత ఆగస్టులో ఆ భూమిని రైల్వేకు అప్పగిస్తూ ప్రొసీడింగ్స్ ఇచ్చింది. మ్యుటేషన్ ద్వారా రైల్వేశాఖకు భూమి ఇచ్చినట్లు రెవెన్యూ రికార్డుల్లోనూ నమోదైంది. ఉత్తరాంధ్ర అభివృద్ధికి రైల్వేజోన్ మైల్ స్టోన్ అవుతుందని ప్రభుత్వం చెబుతోంది.. రైల్వే జోన్ కోసం భూముల కేటాయింపులో జాప్యం కారణం అవ్వడం పై అధికార, విపక్షాల మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. గత ఏడాది జనవరిలోనే తమ ప్రభుత్వం క్లియరెన్స్ ఇచ్చిందని.. అదే భూముల్లో జోనల్ కార్యాలయం నిర్మాణం చేస్తూ విమర్శలు చేయడం కరెక్ట్ కాదంటోంది వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ.. ఈ వ్యవహారం పక్కన పెడితే.. తూర్పు కోస్తా రైల్వే జోన్ లో వాల్తేర్ డివిజన్ ప్రస్థానంపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

Read Also: CM Chandrababu Kuppam Tour: కుప్పంలో సీఎం చంద్రబాబు బిజీ బిజీ.. రెండో రోజు షెడ్యూల్‌ ఇదే..

వందేళ్ల చరిత్ర కలిగిన విశాఖ కేంద్రంగా వాల్తేర్ డివిజన్ తో కూడిన జోన్ ఏర్పాటు అనేది డిమాండ్. విభజన చట్టం 13వ షెడ్యూల్లో ఇచ్చిన హామీ మేరకు 2019 ఫిబ్రవరిలో కేంద్ర ప్రభుత్వం దక్షిణకోస్తా రైల్వేజోన్ ప్రకటన చేసింది. ప్రస్తుతం ఉన్న గుంతకల్లు, గుంటూరు, విజయవాడ డివిజన్లతో కలిపి జోన్ ను ఏర్పాటు చేయబోతున్నట్లు వెల్లడించింది. వాల్తేర్ డివిజన్ ను రెండు భాగాలుగా విభజించి విజయవాడ డివిజన్‌లో విలీనం చేయాలని.. మిగిలిన భాగాన్ని తూర్పు కోస్తా రైల్వేజోన్ పరిధిలోని రాయగడ కేంద్రం కొత్త డివిజన్ ఏర్పాటుకు నిర్ణయించింది. ఈ ప్రక్రియలో రాయగడ డివిజన్ రూపుదిద్దుకోగా వాల్తేర్ మనుగడ మీద క్లారిటీ లేదు. జోన్, డివిజన్ కొనసాగించడం ద్వారానే ఆశించిన ప్రయోజనాలు సాధ్యం అంటున్నాయి రైల్వే యూనియన్ లు. మొత్తంగా ఎట్టకేలకు రైల్వేజోన్ కల సాకారం అవుతుండగా.. ప్రధాని మోడీ చేతులు మీదుగా శంకుస్థాపన జరుగుతుండటం రాజకీయ వర్గాల ఆసక్తిని రెట్టింపు చేసింది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • cm chandrababu
  • PM Modi
  • Visakha railway zone
  • Vizag Railway Zone

తాజావార్తలు

  • US: రద్దీ రోడ్డుపై విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్.. వీడియో వైరల్

  • Kala Bhairava : కీరవాణి కొడుకు కాలభైరవ హీరోయిన్ ని పెళ్లి చేసుకోబోతున్నారా?

  • YS Jagan: మేం ఐదేళ్లలో 3.30 లక్షల కోట్ల అప్పులు చేస్తే.. కూటమి ప్రభుత్వం ఇప్పటికే 3.80 లక్షల కోట్లు చేసింది!

  • Rahul Gandhi: ప్రతిపక్ష నేతకు మాట్లాడే అవకాశమే ఇవ్వలేదన్న రాహుల్ గాంధీ.. తిప్పికొట్టిన కేంద్రం

  • Hyderabad: మిడిల్ ఈస్ట్ యుద్ధం ఎఫెక్ట్.. హైదరాబాద్ హాస్టల్స్‌పై ప్రభావం.. ఫుడ్ ఐటమ్స్ తగ్గింపు

ట్రెండింగ్‌

  • 200MP టెలిఫోటో కెమెరా, 6000mAh బ్యాటరీతో Xiaomi 17 Ultra లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!

  • 80W ఫాస్ట్ ఛార్జింగ్, 100x జూమ్ కెమెరాతో HONOR Magic V6 ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!

  • Spinach Dosa Recipe: రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. కొత్తగా ‘పాలకూర దోశ’ చేసుకొని తినండి ఇలా..!

  • Soft Idli Tips : దూది లాంటి మెత్తటి ఇడ్లీల కోసం చిట్కాలు.. పప్పు, బియ్యం ఎంతసేపు నానబెట్టాలో తెలుసా.?

  • Save Your Food: వేసవిలో అన్నం పాడవకుండా ఉండేలా సింపుల్‌ చిట్కా..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions