Vizag Railway Zone: దశాబ్దాల పోరాటం, నిరీక్షణకు తెర… రేపే ప్రధాని మోడీ శ్రీకారం..
- నెరవేరబోతోన్న రాష్ట్ర ప్రజల చిరకాల వాంఛ..
- దక్షిణ కోస్తా రైల్వేజోన్ ఏర్పాటుకు కీలక ముందడుగు..
- విశాఖ కేంద్రంగా జోన్ కార్యాలయం నిర్మాణం..
- శంకుస్థాపన చేయనున్న భారత ప్రధాని నరేంద్ర మోడీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vizag Railway Zone: రైల్వే శాఖకు సంబంధించి రాష్ట్ర ప్రజల చిరకాల వాంఛ నెరవేరబోతోంది. ఏళ్లుగా ఊరిస్తున్న దక్షిణ కోస్తా రైల్వేజోన్ ఏర్పాటుకు కీలక ముందడుగు పడింది. విశాఖ కేంద్రంగా జోన్ కార్యాలయం నిర్మాణానికి భారత ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేయనున్నారు. విశాఖలోని ముడసర్లోవ దగ్గర రైల్వేకు కేటాయించిన భూముల్లో జోనల్ హెడ్ క్వార్టర్ సముదాయం రూపుదిద్దుకోనుంది. ఇక్కడ రైల్వేశాఖకు 52 ఎకరాల స్థలం ఉండగా, సుమారు పదెకరాల్లో కొత్త భవనాలు వస్తాయి. 149 కోట్లతో 9 అంతస్తుల్లో భవనాలు నిర్మాణం కోసం టెండర్ల ప్రక్రియను ప్రారంభించింది రైల్వేశాఖ. వాస్తవానికి దక్షిణ కోస్తా జోన్ ప్రక్రియ వైసీపీ ప్రభుత్వ హయంలోనే ప్రారంభమైనప్పటికీ భూ కేటాయింపుల్లో జాప్యం జరిగిందని రైల్వే వర్గాలు చెబుతున్నాయి. ముడసర్లోవలో ప్రతిపాదించిన భూములు రిజర్వాయర్ క్యాచ్ మెంట్ ఏరియాకు దగ్గరగా వుండటం, సాగు చేసుకుంటున్న రైతుల నుంచి అభ్యతరాలు రావడం కారణం.
Read Also: Gold Rate Today: గోల్డ్ లవర్స్కి గుడ్న్యూస్.. భారీగా పెరిగిన వెండి!
Also Read
కూటమి ప్రభుత్వం అధికారంలో కి వచ్చిన తర్వాత జోన్ భూములపై వున్న అడ్డంకులను తొలగించేందుకు చర్యలు చేపట్టింది. చినగదిలి మండలం ముడసర్లోవలో 52.22 ఎకరాలు కేటాయించింది. గత ఆగస్టులో ఆ భూమిని రైల్వేకు అప్పగిస్తూ ప్రొసీడింగ్స్ ఇచ్చింది. మ్యుటేషన్ ద్వారా రైల్వేశాఖకు భూమి ఇచ్చినట్లు రెవెన్యూ రికార్డుల్లోనూ నమోదైంది. ఉత్తరాంధ్ర అభివృద్ధికి రైల్వేజోన్ మైల్ స్టోన్ అవుతుందని ప్రభుత్వం చెబుతోంది.. రైల్వే జోన్ కోసం భూముల కేటాయింపులో జాప్యం కారణం అవ్వడం పై అధికార, విపక్షాల మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. గత ఏడాది జనవరిలోనే తమ ప్రభుత్వం క్లియరెన్స్ ఇచ్చిందని.. అదే భూముల్లో జోనల్ కార్యాలయం నిర్మాణం చేస్తూ విమర్శలు చేయడం కరెక్ట్ కాదంటోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. ఈ వ్యవహారం పక్కన పెడితే.. తూర్పు కోస్తా రైల్వే జోన్ లో వాల్తేర్ డివిజన్ ప్రస్థానంపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
Read Also: CM Chandrababu Kuppam Tour: కుప్పంలో సీఎం చంద్రబాబు బిజీ బిజీ.. రెండో రోజు షెడ్యూల్ ఇదే..
వందేళ్ల చరిత్ర కలిగిన విశాఖ కేంద్రంగా వాల్తేర్ డివిజన్ తో కూడిన జోన్ ఏర్పాటు అనేది డిమాండ్. విభజన చట్టం 13వ షెడ్యూల్లో ఇచ్చిన హామీ మేరకు 2019 ఫిబ్రవరిలో కేంద్ర ప్రభుత్వం దక్షిణకోస్తా రైల్వేజోన్ ప్రకటన చేసింది. ప్రస్తుతం ఉన్న గుంతకల్లు, గుంటూరు, విజయవాడ డివిజన్లతో కలిపి జోన్ ను ఏర్పాటు చేయబోతున్నట్లు వెల్లడించింది. వాల్తేర్ డివిజన్ ను రెండు భాగాలుగా విభజించి విజయవాడ డివిజన్లో విలీనం చేయాలని.. మిగిలిన భాగాన్ని తూర్పు కోస్తా రైల్వేజోన్ పరిధిలోని రాయగడ కేంద్రం కొత్త డివిజన్ ఏర్పాటుకు నిర్ణయించింది. ఈ ప్రక్రియలో రాయగడ డివిజన్ రూపుదిద్దుకోగా వాల్తేర్ మనుగడ మీద క్లారిటీ లేదు. జోన్, డివిజన్ కొనసాగించడం ద్వారానే ఆశించిన ప్రయోజనాలు సాధ్యం అంటున్నాయి రైల్వే యూనియన్ లు. మొత్తంగా ఎట్టకేలకు రైల్వేజోన్ కల సాకారం అవుతుండగా.. ప్రధాని మోడీ చేతులు మీదుగా శంకుస్థాపన జరుగుతుండటం రాజకీయ వర్గాల ఆసక్తిని రెట్టింపు చేసింది.
తాజావార్తలు
-
India Vs Ireland: మళ్లీ మారిన టీ20 కెప్టెన్.. ఐర్లాండ్తో తలపడే ప్రతి టీ-20 సిరీస్లోనూ కొత్త కెప్టెనే..
-
Anantha Sriram : రివ్యూస్ రాసేవాళ్ళకు ఏం అర్హత ఉంది?
-
India-Bangladesh: బంగ్లాదేశ్ పౌరులకు గుడ్న్యూస్.. టూరిస్ట్ వీసాల జారీకి భారత్ గ్రీన్ సిగ్నల్
-
AP Government Schools: ప్రైవేట్ స్కూళ్లకు షాక్.. ప్రభుత్వ పాఠశాలల్లో భారీగా విద్యార్థుల చేరిక
-
Ayodhya Ram mandir: రామ మందిర విరాళాలు చోరీ.. 8 మందిపై ఎఫ్ఐఆర్..
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!