Andhra University: చర్చలు సఫలం.. ఆందోళన విరమించిన ఏయూ విద్యార్థులు..
- ఆంధ్రా యూనివర్సిటీలో చర్చలు సఫలం..
- నిరసనను విరమించిన ఏయూ విద్యార్దులు..
- డిమాండ్లు నెరవేరుస్తామని హామీ ఇచ్చిన వీసీ, జిల్లా అధికారుల బృందం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Andhra University: ఆంధ్రా యూనివర్సిటీలో విద్యార్థులు-అధికారులు మధ్య చర్చలు సఫలం అయ్యారు.. దీంతో, నిరసనను విరమించారు ఏయూ విద్యార్థులు.. విద్యార్థుల హామీలు నెరవేరుస్తామని హామీ ఇచ్చారు ఆంధ్రా యూనివర్సిటీ వీసీ.. జిల్లా అధికారుల బృందం.. దసరా సెలవులులోగా విద్యార్థుల డిమాండ్లను పూర్తి చేస్తామని చెప్పడంతో ఆందోళన విరమించారు.. ఇక, విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం త్రీమెన్ కమిటీ నియమించింది ప్రభుత్వం.. DMHO, KGH సూపరింటెండెంట్, డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ ఈ కమిటీలో సభ్యులుగా ఉండనున్నారు.. మరోవైపు, ఆంధ్రా యూనివర్సిటీకి సెలవులు ప్రకటించింది మేనేజ్మంట్.. రేపటి నుంచి అక్టోబర్ 5 వరకు దసరా సెలవులు ఇవ్వనున్నారు.. యూనివర్సిటీలో విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో ఒక రోజు ముందే నుండే హాలిడేస్ ప్రకటించారు..
Read Also: Ajit Pawar: నిన్ను సీఎంను చేయమంటావా? వరద మహిళపై అజిత్ పవార్ ఆగ్రహం
Also Read
- CM Chandrababu: ఇక ఇంటిపై పూర్తి హక్కు.. విశాఖలో 28,445 కుటుంబాల కల సాకారం
- CM Chandrababu: పేదల సొంతింటి కల సాకారం.. 28,445 కుటుంబాలకు సీఎం గుడ్న్యూస్
- GVMC వార్డుల పునర్విభజనకు ఆమోదం.. 120 వార్డులతో తుది గెజిట్ విడుదల
- Railway Accident: కొవ్వూరు వద్ద పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.. ఎక్కడికక్కడ నిలిచిపోయిన రైళ్లు..
కాగా, ఆంధ్రా యూనివర్సిటీ లో ఉద్రిక్త వాతావరణం నెలకొన్ని విషయం విదితమే.. కనీస వైద్య సదుపాయాలు, ఆక్సిజన్ కల్పించక పోవడం వల్లే BED విద్యార్థి మణికంఠ మృతి చెందాడని తీవ్ర ఆగ్రహ జ్వలలు వెల్లు వెత్తుతున్నాయి.. ఉదయం నుండి కూడా ఏయూ వీసీ ఛాంబర్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి.. స్టూడెంట్ మృతికి బాధ్యత వహిస్తూ వీసి రాజీనామా చేయాలనీ విద్యార్థులంతా డిమాండ్ చేశారు.. పరిస్థితులు చేయి దాటి పోవడంతో భారీగా పోలీసులు మొహరించారు.. అయినప్పటికీ విద్యార్థులు ఆందోళనలో వెనక్కి తగ్గలేదు.. వీసీ ఛాంబర్ ను ముట్టడించి న్యాయం కోసం డిమాండ్ చేశారు.. దీంతో ఆంధ్ర యూనివర్సిటీ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.. మరోవైపు, అసెంబ్లీలో ఏయూ ఇష్యూపై స్పందించిన మంత్రి నారా లోకేష్.. నిన్న ఆంధ్రా యూనివర్సిటీలో ఒక విద్యార్ధి ఫిట్స్ వచ్చి చనిపోయారని తెలిపారు.. అయితే, అంబులెన్స్ లో తీసుకెళ్లినా కాపాడలేకపోయాం అన్నారు.. కానీ, కొందరు ఉద్దేశపూర్వకంగా క్లాస్ లు జరగకుండా అడ్డుకోవడం సరికాదని హితవు చెప్పారు.. విద్యాలయాల్లో రాజకీయ జోక్యం ఉండకూడదన్నారు. ఆంధ్రా యూనివర్సిటీని టాప్ 100 లో ఉంచాలన్నది ప్రభుత్వ లక్ష్యం అన్నారు లోకేష్. ప్రభుత్వం ఎలాంటి చర్చలకైనా సిద్ధంగా ఉందని.. అంతేకానీ వైస్ ఛాన్సలర్ లను ఇబ్బంది పెట్టడం, ఆటంకాలు సృష్టించడం సరికాదన్నారు. అలా కాకుండా రాజకీయం చేస్తామంటే కఠిన చర్యలకు వెనకడబోమాని హెచ్చరించారు.. ఇక, ఈ పరిణామాల తర్వాత.. విద్యార్థులతో వీసీ, జిల్లా అధికారులు జరిపిన చర్చలు సఫలం కావడంతో.. ఆందోళన విరమించారు విద్యార్థులు..
తాజావార్తలు
-
Dishwasher Prices: మహిళలకు గిన్నెలు తోమే తిప్పలు తప్పినట్టే! భారీగా తగ్గిన డిష్వాషర్ల ధరలు..
-
US: అమెరికాస్ గాట్ టాలెంట్ షోలో అదరగొట్టిన చైనా రోబోలు.. వీడియో వైరల్
-
Deepika Padukone: నిన్ననే గుడిలో పూజలు.. మరోసారి ఆడబిడ్డకు జన్మనిచ్చిన దీపికా-రణ్వీర్!
-
Sandeep Reddy Vanga: వరంగల్ ఎయిర్పోర్టుకు ఈ పేర్లు పెట్టండి.. సీఎం రేవంత్కు సందీప్ రెడ్డి వంగా స్పెషల్ రిక్వెస్ట్!
-
KTR : కాంగ్రెస్ హయాంలో కరెంట్ లేదు.. నీళ్లు లేవు.. కేటీఆర్ ఫైర్.!
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!