Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News International Drug Racket Again On The Screen In Vizag

Vizag Drugs Case: మళ్లీ తెరపైకి వైజాగ్‌.. ఇంటర్నేషనల్‌ డ్రగ్స్‌ రాకెట్..

Published Date :July 29, 2024 , 8:08 am
By Sudhakar Ravula
  • విశాఖలో వెలుగు చూసిన ఇంటర్నేషనల్ డ్రగ్స్ రాకెట్..
  • మళ్లీ తెరపైకి డ్రగ్స్‌ కేసు..
Vizag Drugs Case: మళ్లీ తెరపైకి వైజాగ్‌.. ఇంటర్నేషనల్‌ డ్రగ్స్‌ రాకెట్..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Vizag Drugs Case: విశాఖలో వెలుగు చూసిన ఇంటర్నేషనల్ డ్రగ్స్ రాకెట్ మళ్లీ తెరపైకి వచ్చింది. కోట్ల రూపాయలు విలువైన 25 వేల కేజీల మాదక ద్రవ్యాల అక్రమ రవాణా కేసు పురోగతి పై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సీబీఐ దర్యాప్తు చేస్తున్న ఈ కేసులో సూత్రధారులు ఎవరో బహిర్గతం చేయాలని పొలిటికల్ డిమాండ్ ఊపందుకుంది. 2024 మార్చి 19న సార్వత్రిక ఎన్నికలకు సరిగ్గా 45 రోజులు ముందు… ఏపీ రాజకీయాలను దేశం అంతా ఉత్కంఠతో చూస్తున్న వేళ.. సీబీఐ బాంబు పేల్చింది. విశాఖపట్నం పోర్టుకు నిషేధిత మాదకద్రవ్యాల అక్రమ రవాణా చేస్తున్నట్టు కేసు నమోదు చేసింది. ఇంటర్ పోల్ సమాచారం ఆధారంగా కంటైనర్ టెర్మినల్ – VCTPLలో తనిఖీలు చేసి 25 వేల కేజీల డ్రైఈస్ట్ ను స్వాధీనం చేసుకుంది. ఆక్వా ఫీడ్ తయారీలో వాడే ఈస్ట్ కంటైనర్ ద్వారా మాదక ద్రవ్యాల అక్రమ రవాణా వెనుక పకడ్బందీ వ్యూహం వుందని అనుమానం కలిగింది. ప్రత్యేక బృందాలు కంటైనర్ తెరవగా డ్రగ్స్ అవశేషాలు వున్నట్టు తేలింది. ఈ కన్సైన్ మెంట్ ను సంధ్యా ఆక్వా బుక్ చేసింది. పరిశ్రమ అవసరాల కోసం బ్రెజిల్ లోని శాంటోస్ పోర్టు నుంచి డ్రైఈస్ట్ దిగుమతి చేసుకుంది సంధ్యా ఆక్వా. మొత్తం కంటైనర్లో వచ్చిన వెయ్యి బ్యాగుల్లో 70 శాతం నిషేధిత ఉత్ప్రేరకాల ఆనవాళ్లు, అనుమానిత పదార్థాలు గుర్తించినట్టు ప్రాథమికంగా నిర్ధారించింది.

అయితే ఒక్కో బ్యాగ్‌లో ఎంత మొత్తం డ్రగ్స్ ఉన్నాయి.. ఏఏ డ్రగ్స్ ఎంత మేర ఉన్నాయన్న అంశంపై సమగ్ర నివేదిక కోసం ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ (ఎఫ్ఎస్ఎల్)కి పంపించింది. తూర్పు తీరంలో ఈ స్థాయిలో నిషేధిత డ్రగ్స్ పట్టుబడ్డం దేశవ్యాప్త సంచలమైంది. ఐతే, కంటైనర్‌లో డ్రగ్స్ ఎలా వచ్చాయో తమకు తెలియదని ఎటువంటి విచారణ కైన సిద్ధమేనని సంధ్యా అక్వా ప్రకటించింది. ఈ నేపథ్యంలో డ్రగ్స్ కేసు విచారణ మందగమనం ఆరోపణలు చేస్తూ వైసీపీ పలు అనుమానాలు లేవనెత్తింది. విశాఖపట్నం ఔన్నత్యానికి మచ్చ తీసుకొచ్చిన డ్రగ్స్ వ్యవహారంలో విచారణ వేగవంతం చేసేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చే బాధ్యత ఉత్తరాంధ్ర ఎంపీలదే అంటున్నారు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ. రాజకీయ కోణం లేదంటూనే మాదకద్రవ్యాల కేసులో రాష్ట్ర ప్రభుత్వం నిర్లప్తంగా వ్యవహరిస్తుందన్న బలమైన ఆరోపణ బొత్స చేశారు. దీనిపై ప్రధానమంత్రికి లేఖ రాయాలని ఆయన ఎంపీలకు సూచిస్తున్నారు.

మరోవైపు డ్రగ్స్ మూలాలు ఎక్కడ ఉన్నాయనే కోణంలో దర్యాప్తు చేస్తు న్న సీబీఐ శాంటోస్ పోర్టుకు, డ్రైఈస్ట్ తరలించిన ఓషన్ నెట్వర్క్ ఎక్స్ప్రెస్ సంస్థతో పాటు కార్గో షిప్ వచ్చిన మార్గంలో షిప్ ఆగిన పోర్టుల్లో ఆధారాలు సేకరించాలని నిర్ణయించింది. దాదాపు నాలుగు నెలలు కావస్తున్నా ఇంత వరకూ ఎటువంటి పురోగతి ఉందనేది బహిర్గతం కాలేదు. ఎన్నికల ముందు విశాఖ డ్రగ్స్ వ్యవహారం రాజకీయ ఆరోపణలు ప్రత్యారోపణలకు దారి తీసింది. సీబీఐ విచారణ పరిధిలో ఉన్న అంశం కావడంతో అప్పటి ప్రభుత్వం ఈ వ్యవహారంపై సీరియస్ గా దృష్టి సారించలేదన్న అభిప్రాయం ఉంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గంజాయి సాగు అక్రమ రవాణాపై ఉక్కు పాదం మోపుతామని ప్రకటించింది. అదిశగా చేస్తున్న ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. అయితే, డ్రగ్స్ కేసులో ఏపీ ప్రభుత్వం వైఖరిని వైసీపీ ప్రశ్నిస్తుండటం చర్చనీయాంశంగా మారింది. వీలైనంత త్వరగా డ్రగ్స్ దోషులను శిక్షించాలని డిమాండ్ చేస్తుండగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అనిత దృష్టిసారించారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • CBI
  • International Drug Racket
  • tdp
  • Vizag

తాజావార్తలు

  • Gaddar Film Awards 2026: సినీ అవార్డులు కొన్నాళ్లు నిర్లక్ష్యానికి గురయ్యాయి.. మెగాస్టార్ ఆవేదన..

  • Off The Record: గుంటూరు నియోజకవర్గంలో పెరిగిపోతున్న అసమ్మతి సెగలు

  • War Effect: భారత్ గ్యాస్ దిగుమతులపై యుద్ధం దెబ్బ.. ఇంధన పొదుపు తప్పదా..?

  • Bhatti Vikramarka : సినిమా అంటే కేవలం వినోదం మాత్రమే కాదు.. అది ప్రజల కోసం ఉండాలి

  • Lets Her Go With Lover: తన భార్యను ప్రియుడితో వెళ్లేందుకు అంగీకరించిన భర్త..

ట్రెండింగ్‌

  • Virat Kohli-IPL 2026: ‘కింగ్’ కోహ్లీ వచ్చేశాడు.. ఇక ప్రత్యర్థులకు డబిడదిబిడే!

  • 100W ఫాస్ట్ చార్జింగ్, 165Hz హై రిఫ్రెష్ రేట్ తో వచ్చేస్తున్న OnePlus 15T..!

  • Suresh Raina-CSK: ఇతర ఫ్రాంచైజీల నుంచి కెప్టెన్సీ ఆఫర్‌లు వచ్చాయి.. అయినా సీఎస్కేలోనే ఎందుకున్నానంటే?

  • Taurus Horoscope: ఖర్చులు అదుపులో ఉంచుకోవాల్సిందే.. వృషభ రాశి వారికి కొత్త ఏడాది ఎలా ఉండబోతుందంటే..!

  • Aries Horoscope: కొత్త ఏడాదిలో ‘మేషరాశి’ ఫలితాలు.. అనుకోని మార్గాల్లో ధనలాభం.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions