Heavy to Very Heavy Rains: ఏపీలో భారీ నుంచి అతిభారీ వర్షాలు.. ఈ రెండు జిల్లాలకు రెడ్ అలర్ట్..
- తీవ్ర వాయుగుండ ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాలో వర్షాలు..
- రాగల 24 గంటల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు నమోదయ్యే అవకాశం..
- తిరుపతి, నెల్లూరు జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ..
- అన్నమయ్య, చిత్తూరు జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ జారీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Heavy to Very Heavy Rains: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండ ప్రభావంతో.. ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి.. ఇక, తీవ్ర వాయుగుండం ప్రభావంతో రాగల 24 గంటల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం అంచనా వేసింది.. నైరుతి బంగాళాఖాతంలో ట్రింకోమలీకి తూర్పు ఈశాన్యంగా 110 కిలో మీటర్లు.. నాగపట్టణానికి ఆగ్నేయంగా 310 కి.మీ.. పుదుచ్చేరికి ఆగ్నేయంగా 410 కి.మీ… చెన్నైకి దక్షిణ ఆగ్నేయంగా 480 కి.మీ దూరంలో తీవ్ర వాయుగుండం కొనసాగుతోంది.. ఇది రాగల 12 గంటల్లో శ్రీలంక తీరాన్ని తాకుతూ ఉత్తర వాయువ్య దిశగా ప్రయాణించే అవకాశం ఉందని.. తీవ్రవాయుగుండం ఈరోజు సాయంత్రానికి లేదా రేపు ఉదయానికి తుఫాన్ గా బలపడే అవకాశం ఉందని పేర్కొంది.
Also Read
- Vizag Tragedy: రాఖీ పండుగ రోజే విషాదం.. భార్య, ఇద్దరు చిన్నారులతో సహా ఆటో డ్రైవర్ ఆత్మహత్య
- Minister Narayana: మున్సిపల్ ఎన్నికలపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు.. ఆ తర్వాతే ప్రక్రియ
- Vizag School Tragedy: విశాఖలో దారుణం.. టీచర్ దెబ్బలకు ఆగిన పసి గుండే..! యూకేజీ విద్యార్థి మృతి..
- Vizag Crime: మట్టి కుప్పలో 4 మృతదేహాలు, 9 పుర్రెలు.. విశాఖలో తీవ్ర కలకలం
ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి తీరాలలో కరైకల్, మహాబలిపురం మధ్య ఈ నెల 30వ తేదీ ఉదయం తీవ్ర వాయుగుండంగా తీరం దాటే అవకాశం ఉందని తుఫాన్ హెచ్చరికల కేంద్రం అంచనా వేస్తోంది.. దీని ప్రభావంతో దక్షిణ కోస్తా ,రాయలసీమ జిల్లాలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.. ఇక, తిరుపతి, నెల్లూరు జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేశారు అధికారులు.. అన్నమయ్య, చిత్తూరు జిల్లాలో కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్న నేపథ్యంలో ఆరెంజ్ అలర్ట్ జారీ అయ్యింది.. ప్రకాశం, సత్యసాయి, వైఎస్ఆర్ కడప జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎల్లో అలర్ట్ జారీ అయ్యింది.. దక్షిణ కోస్తా తీరం వెంబడి 45 నుంచి 55 వరకు గరిష్టంగా 65 కిలోమీటర్లు వేగంతో గాలులు వీస్తాయని.. కోస్తా తీరంలో మత్య్సకారులు చేపలువేటకు వెళ్లరాదని స్పష్టం చేసింది.. ఏపీలో ఉన్న అన్ని పోర్టులలో ఒకటివ నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు.. వ్యవసాయ పనులు చేసుకునే రైతులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం.
తాజావార్తలు
-
Nepal Floods: నేపాల్లో భారీ వరదలు.. 16 మంది హైదరాబాద్ ఎన్ఆర్ఐలు గల్లంతు..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
Vizag Tragedy: రాఖీ పండుగ రోజే విషాదం.. భార్య, ఇద్దరు చిన్నారులతో సహా ఆటో డ్రైవర్ ఆత్మహత్య
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!
-
Road Accident: టైరు పేలి అదుపుతప్పిన కారు.. నలుగురు విద్యార్థులు మృతి
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!