Gudivada Amarnath: మహిళా కమిషన్ ఎదుట నేడు విచారణకు మాజీ మంత్రి.. ‘నా వ్యాఖ్యల్లో తప్పు లేదు’..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gudivada Amarnath: ఏపీ హోంశాఖ మంత్రి వంగలపూడి అనితపై చేసిన వ్యాఖ్యలను సుమోటోగా స్వీకరించిన మహిళా కమిషన్ ఎదుట నేడు విచారణకు హాజరుకానున్నారు మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గుడివాడ అమర్నాథ్.. విచారణకు హాజరయ్యేందుకు గతంలో రెండుసార్లు గడువు కోరిన ఆయన, తాజాగా విజయవాడలో మహిళా కమిషన్ ఎదుట తన వివరణ ఇవ్వనున్నారు. ఈ సందర్భంగా విశాఖపట్నం నుంచి విజయవాడ బయలుదేరారు గుడివాడ అమర్నాథ్, లీగల్ కౌన్సిల్ సభ్యులతో కలిసి కమిషన్ ఎదుట హాజరవుతున్నట్లు తెలిపారు. రాజ్యాంగబద్ధమైన వ్యవస్థలపై తనకు పూర్తి గౌరవం ఉందని, అందుకే మహిళా కమిషన్ విచారణకు హాజరవుతున్నానని చెప్పారు.
విచారణకు ముందు మీడియాతో మాట్లాడిన అమర్నాథ్.. హోం మంత్రి అనితపై తాను చేసిన వ్యాఖ్యల్లో ఎలాంటి తప్పు లేదని స్పష్టం చేశారు. తాను ఎక్కడా మహిళలను ఉద్దేశించి అనుచితంగా మాట్లాడలేదని, రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సహజమేనని పేర్కొన్నారు. అనితపై తాను చేసింది కేవలం రాజకీయ విమర్శ మాత్రమేనని, దానిని వక్రీకరించి తెలుగుదేశం పార్టీ కృత్రిమ ఆందోళనలు చేపట్టిందని ఆరోపించారు. మహిళా కమిషన్ ఎదుట తన వాదనను బలంగా వినిపిస్తానని అమర్నాథ్ తెలిపారు. గతంలో హోం మంత్రి తనపై, అలాగే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ఫుటేజ్ను కమిషన్కు సమర్పించే అవకాశముందని సమాచారం.
Also Read
- Minister Narayana: మున్సిపల్ ఎన్నికలపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు.. ఆ తర్వాతే ప్రక్రియ
- Vizag School Tragedy: విశాఖలో దారుణం.. టీచర్ దెబ్బలకు ఆగిన పసి గుండే..! యూకేజీ విద్యార్థి మృతి..
- Vizag Crime: మట్టి కుప్పలో 4 మృతదేహాలు, 9 పుర్రెలు.. విశాఖలో తీవ్ర కలకలం
- Botsa Satyanarayana: డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలి.. మంత్రి లోకేష్ రాజీనామా చేయాలి..
అదే సమయంలో రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న ఘటనలను కూడా అమర్నాథ్ ప్రస్తావించారు. రాష్ట్రవ్యాప్తంగా మహిళలపై అనేక దాడులు జరుగుతున్నాయని, సాయికృష్ణ తల్లి వ్యక్తం చేసిన ఆవేదన మహిళా కమిషన్కు కనిపించలేదా అని ప్రశ్నించారు. అలాగే నడిరోడ్డుపై ఓ మహిళపై జనసేన నేతలు దాడి చేసిన ఘటనపైనా మహిళా కమిషన్ స్పందించాలని డిమాండ్ చేశారు. తన వ్యాఖ్యలను మహిళలకు ఆపాదించే ప్రయత్నం చేసి టీడీపీ నాయకులు ప్రజల్లో హాస్యాస్పదంగా మారారని అమర్నాథ్ విమర్శించారు. మహిళా కమిషన్ విచారణ అనంతరం పూర్తి వివరాలను వెల్లడిస్తానని తెలిపారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్..
తాజావార్తలు
-
Indian Railway: రైళ్లలో టికెట్ లేని ప్రయాణికులకు షాక్.. భారీగా జరిమానాలు..
-
Story Board : నేపాల్ ఆకస్మిక వరదలకు కారణాలేంటి..? చైనా నిర్లక్ష్యం ఎంతవరకు ఉంది..?
-
OTR: ఎమ్మెల్యే, ఎంపీ.. మధ్యలో సూర్యలంక బీచ్!
-
OTR: ఆ నేతకు పీఏ పోట్లు.. ఆ ఎమ్మెల్యే చుట్టూ నడుస్తున్న అసలు డ్రామా!
-
OTR: సొంత పార్టీ నేతలకే టార్గెట్ అవుతున్న తెలంగాణ బీజేపీ సోషల్ మీడియా!
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!