Gudivada Amarnath: మహిళా కమిషన్ ఎదుట నేడు విచారణకు మాజీ మంత్రి.. ‘నా వ్యాఖ్యల్లో తప్పు లేదు’..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gudivada Amarnath: ఏపీ హోంశాఖ మంత్రి వంగలపూడి అనితపై చేసిన వ్యాఖ్యలను సుమోటోగా స్వీకరించిన మహిళా కమిషన్ ఎదుట నేడు విచారణకు హాజరుకానున్నారు మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గుడివాడ అమర్నాథ్.. విచారణకు హాజరయ్యేందుకు గతంలో రెండుసార్లు గడువు కోరిన ఆయన, తాజాగా విజయవాడలో మహిళా కమిషన్ ఎదుట తన వివరణ ఇవ్వనున్నారు. ఈ సందర్భంగా విశాఖపట్నం నుంచి విజయవాడ బయలుదేరారు గుడివాడ అమర్నాథ్, లీగల్ కౌన్సిల్ సభ్యులతో కలిసి కమిషన్ ఎదుట హాజరవుతున్నట్లు తెలిపారు. రాజ్యాంగబద్ధమైన వ్యవస్థలపై తనకు పూర్తి గౌరవం ఉందని, అందుకే మహిళా కమిషన్ విచారణకు హాజరవుతున్నానని చెప్పారు.
విచారణకు ముందు మీడియాతో మాట్లాడిన అమర్నాథ్.. హోం మంత్రి అనితపై తాను చేసిన వ్యాఖ్యల్లో ఎలాంటి తప్పు లేదని స్పష్టం చేశారు. తాను ఎక్కడా మహిళలను ఉద్దేశించి అనుచితంగా మాట్లాడలేదని, రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సహజమేనని పేర్కొన్నారు. అనితపై తాను చేసింది కేవలం రాజకీయ విమర్శ మాత్రమేనని, దానిని వక్రీకరించి తెలుగుదేశం పార్టీ కృత్రిమ ఆందోళనలు చేపట్టిందని ఆరోపించారు. మహిళా కమిషన్ ఎదుట తన వాదనను బలంగా వినిపిస్తానని అమర్నాథ్ తెలిపారు. గతంలో హోం మంత్రి తనపై, అలాగే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ఫుటేజ్ను కమిషన్కు సమర్పించే అవకాశముందని సమాచారం.
Also Read
- Botsa Satyanarayana: డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలి.. మంత్రి లోకేష్ రాజీనామా చేయాలి..
- Floodlight Collapse: విశాఖ స్టేడియంలో తృటిలో తప్పిన పెను ప్రమాదం.. కూలిన ఫ్లడ్ లైట్..
- Godavari Floods: గోదావరి వరదలపై ప్రభుత్వం అలర్ట్.. ప్రభావిత జిల్లాలకు హోంమంత్రి కీలక ఆదేశాలు
- Botsa Satyanarayana: జగన్ పర్యటనను విజయవంతం చేశాం.. కూటమి ప్రభుత్వంపై బొత్స తీవ్ర ఆరోపణలు
అదే సమయంలో రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న ఘటనలను కూడా అమర్నాథ్ ప్రస్తావించారు. రాష్ట్రవ్యాప్తంగా మహిళలపై అనేక దాడులు జరుగుతున్నాయని, సాయికృష్ణ తల్లి వ్యక్తం చేసిన ఆవేదన మహిళా కమిషన్కు కనిపించలేదా అని ప్రశ్నించారు. అలాగే నడిరోడ్డుపై ఓ మహిళపై జనసేన నేతలు దాడి చేసిన ఘటనపైనా మహిళా కమిషన్ స్పందించాలని డిమాండ్ చేశారు. తన వ్యాఖ్యలను మహిళలకు ఆపాదించే ప్రయత్నం చేసి టీడీపీ నాయకులు ప్రజల్లో హాస్యాస్పదంగా మారారని అమర్నాథ్ విమర్శించారు. మహిళా కమిషన్ విచారణ అనంతరం పూర్తి వివరాలను వెల్లడిస్తానని తెలిపారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్..
తాజావార్తలు
-
HMD Touch AI: 1950mAh బ్యాటరీతో.. హెచ్ఎమ్డి టచ్ ఏఐ ఫోన్ గ్లోబల్ మార్కెట్లలో విడుదలకు రెడీ!
-
KCR: స్వర్గీయ పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి కేసీఆర్ అండ.. రూ. 2.25 కోట్ల ఆర్థిక సాయం..
-
Ragi Semiya Payasam: రాగితో కమ్మని పాయసం.. ఐరన్, కాల్షియం, ఫైబర్ పుష్కలం.. రెసిపీ ఇదిగో!
-
Adnan Sami: మూడు పెళ్ళిళ్ళు విఫలమైనా.. పాకిస్తాన్ జనరల్స్ నాపాటకి స్టెప్పులేస్తారు.. అద్నాన్ సమి జీవితంలో ఈ మలుపులేంటి?
-
Trivikram: త్రివిక్రమ్తో మా బంధం అలాంటిది.. ఎలాంటి అగ్రిమెంట్లు లేవు: నాగవంశీ
ట్రెండింగ్
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్కు ముందే ధరలు లీక్.!
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!