CM Chandrababu: రాజముద్ర వేసి ఇళ్ల పట్టాలు ఇస్తున్నాం.. మిగిలిన వారికి కూడా ఇస్తాం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు విశాఖపట్నంలో నిర్వహించిన ‘పేదలకు పట్టాభిషేకం’ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని ప్రజలను ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా ఆయన సభా ప్రాంగణానికి చేరుకోగానే లబ్ధిదారులు, సభికులు పెద్ద ఎత్తున హర్షధ్వానాలు చేస్తూ తమ స్థానాల్లో నిలబడి చేతులు ఊపుతూ ఘన స్వాగతం పలికారు. ప్రజల ఉత్సాహానికి ప్రతిగా సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ర్యాంప్ మీద నడుస్తూ అందరికీ అభివాదం చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట మంత్రి నాదెండ్ల మనోహర్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ తదితరులు ఉన్నారు.
ఈ బహిరంగ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ.. పేదల సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని స్పష్టం చేశారు. పేదలు ఎవరిపైనా ఆధారపడకుండా స్వేచ్ఛగా, గౌరవప్రదంగా బతకాలనే ఉద్దేశంతోనే రాజముద్ర వేసి మరీ ఇళ్ల పట్టాలు అందజేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ శాశ్వత చిరునామా కల్పించే పూర్తి బాధ్యత తమ కూటమి ప్రభుత్వానిదేనని భరోసా ఇచ్చేశారు.
Also Read
- Greenland Deal: ట్రంప్ ఆశ నెరవేరింది.. గ్రీన్ల్యాండ్పై డెన్మార్క్తో డీల్..
- Trump-Jinping: 24న వైట్హౌస్లో జిన్పింగ్కు విందు.. మస్క్, సుందర్ పిచాయ్, టిమ్ కుక్కు ఆహ్వానం
- Punjab: అమృత్సర్లో దారుణం.. డ్యూటీలో ఉన్న ఏఎస్సైను కాల్చి చంపిన దుండగులు
- Heart Attack: డోన్లో విషాదం.. వినాయక ఊరేగింపులో పాల్గొన్న యువకుడు మృతి..
అంతే కాకుండా.. మిగిలిన లబ్ధిదారులకు కూడా త్వరలోనే పట్టాలు అందజేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. ప్రస్తుతం మరో 35 కాలనీల్లో పది వేల మంది ఇళ్ల పట్టాలు కోరుతున్నారని, అలాగే దేవస్థానానికి చెందిన పంచగ్రామాల్లో మొత్తం 12,149 మందికి చట్టబద్ధంగా పట్టాలు ఇవ్వాల్సిన అవసరం ఉందని గుర్తుచేశారు. ఈ ప్రక్రియను వేగవంతం చేసి అర్హులందరికీ త్వరలోనే ఇళ్ల స్థలాలు దక్కేలా చూడాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
ఉత్తరాంధ్ర అభివృద్ధిపై సీఎం చంద్రబాబు విశాఖపట్నంలో కీలక ప్రకటనలు చేశారు. ఈ ప్రాంతానికి రెండేళ్లలో 91 కొత్త ప్రాజెక్టుల ద్వారా ఐదు లక్షల ముప్పై ఏడు వేల కోట్ల భారీ పెట్టుబడులు వచ్చాయని తెలిపారు. పోలవరం లెఫ్ట్ కెనాల్ పూర్తి చేసి అనకాపల్లికి నీళ్లు తీసుకువచ్చామని, త్వరలోనే విశాఖకు గోదావరి జలాలు అందిస్తామని స్పష్టం చేశారు. అల్లూరి విమానాశ్రయంతో ఉత్తరాంధ్ర ప్రజల కలలు నెరవేరాయన్నారు. విశాఖకు కొత్తగా హైవేలు, పోర్టులు, విమానాశ్రయాలు వచ్చాయని, భవిష్యత్తులో ఇది అగ్రగామి టూరిజం, లాజిస్టిక్స్ హబ్గా మారుతుందని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
CM Chandrababu: రాజముద్ర వేసి ఇళ్ల పట్టాలు ఇస్తున్నాం.. మిగిలిన వారికి కూడా ఇస్తాం..
-
Greenland Deal: ట్రంప్ ఆశ నెరవేరింది.. గ్రీన్ల్యాండ్పై డెన్మార్క్తో డీల్..
-
Ajit Doval: సినిమాను మించిన థ్రిల్లర్! అజిత్ డోవల్ పంచుకున్న అత్యంత ప్రమాదకరమైన సీక్రెట్ మిషన్..
-
Trump-Jinping: 24న వైట్హౌస్లో జిన్పింగ్కు విందు.. మస్క్, సుందర్ పిచాయ్, టిమ్ కుక్కు ఆహ్వానం
-
Explainers: భూమి గుండెల్లో దాగిన నీటి రహస్యం.. ఏకంగా 660 కిలోమీటర్ల లోతులో..
ట్రెండింగ్
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!