Nadendla Manohar: తమ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు దీపం పథకం అమలు చేస్తున్నాం..
- కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేస్తోంది..
- ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికి ఏడాదికి రూ. 2600కోట్లతో ఉచిత గ్యాస్ పథకం..
- చంద్రబాబు- పవన్ కళ్యాణ్ వల్లే ఇతర దేశాల నుంచి పెట్టుబడులు వస్తున్నాయి: మత్రి నాదెండ్ల
Nadendla Manohar: విజయవాడ గన్నవరం నుంచి ఇండిగో విమానంలో విశాఖపట్నం ఎయిర్ పోర్టుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెళ్లారు. ఈ సందర్భంగా కూటమి నాయకులు, అభిమానులు, కార్యకర్తలు, మహిళా నాయకులు మంత్రికి హారతి ఇచ్చి ఘన స్వాగతం పలికారు. విశాఖ విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గాన్న నగరంలోని సన్ రే రిసార్ట్ కు వెళ్ళారు మంత్రి నాదెండ్ల. ఇక, విశాఖ నుంచి రోడ్డు మార్గాన రేపు (గురువారం) శ్రీకాకుళం జిల్లా ఈడు పురం గ్రామం వెళ్లనున్నారు. నవంబర్ ఒకటో తారీఖున శ్రీకాకుళం జిల్లా ఈడు పురం గ్రామంలో జరగబోయే ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం కార్యక్రమాన్ని పర్యవేక్షించనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రీకాకుళం జిల్లా ఈడుపురం గ్రామంలో దీపం పథకం అమలు చేయనున్నారు.
Read Also: Delhi: పావురాల దాణా నిషేధానికి ఢిల్లీ సర్కార్ ఫ్లాన్! కారణమిదే!
Also Read
- Simhachalam Chandanotsavam Tickets Row: సింహాచలం చందనోత్సవం టిక్కెట్లపై గందరగోళం
- Land Dispute Turns Violent: స్థల వివాదం.. ఐదుగురు మహిళలపై విచక్షణారహితంగా దాడి..
- Home Minister Vangalapudi Anitha: ఆపరేషన్ ట్రేస్లో 900 పిల్లలను రక్షించాం..
- Vizag Crime: విశాఖలో యువతి దారుణ హత్య.. శరీరాన్ని ముక్కలుగా చేసి ఫ్రిజ్లో పెట్టిన ఘటనలో బిగ్ ట్విస్ట్..
ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో హామీ ఇచ్చినట్టుగా దీపం పథకం అమలు చేయనున్నాము.. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా కూటమి ప్రభుత్వం నిలబడి సంవత్సరానికి 2,600 కోట్ల రూపాయలతో ఉచిత గ్యాస్ పథకం అమలు చేస్తుంది అన్నారు. ప్రతి మహిళకి ఆరోగ్య సమస్య రాకుండా సుమారు కోటి 50 లక్షలు కుటుంబాలు ఈ పథకం ద్వారా లబ్ది పొందుతారు.. గ్యాస్ బుక్ చేసుకున్న సుమారు 24 గంటల నుంచి 48 గంటలలోపు డబ్బులు వారి అకౌంట్ లో జమ అయ్యే విధంగా ప్రణాళిక సిద్ధం చేశాం.. అడ్వాన్స్ రూపంలో చెక్కులను గ్యాస్ కంపెనీలకు అందజేశాం.. గ్యాస్ కార్డు, రేషన్ కార్డు, ఆధార్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికీ ఈ పథకం వర్తిస్తుందన్నారు. గత ప్రభుత్వం లక్షల కోట్లు అప్పు చేసి పోయింది.. ఆర్థిక వ్యవస్థని నాశనం చేసిందన్నారు. ధైర్యంగా చక్కటి నాయకత్వం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చేస్తున్నారు కాబట్టి ఇతర దేశాలు నుంచి పెట్టుబడులు వస్తున్నాయని నాదెండ్ల మనోహర్ తెలిపారు.
తాజావార్తలు
-
Storyboard : తమిళనాడు రాజకీయం ఎలా ఉంది..? టీవీకే తో విజయ్ ఏం చేయబోతున్నారు..?
-
Amazon Great India Summer Sale: అమెజాన్ సమ్మర్ సేల్లో.. ల్యాప్టాప్లు, స్మార్ట్ఫోన్లు సగం కంటే తక్కువ ధరకే!
-
RTC Conductor Jobs: ఆర్టీసీ కండక్టర్, డ్రైవర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం..
-
Ukraine: ట్రంప్ను ప్రసన్నం చేసుకునేందుకు ఉక్రెయిన్ మాస్టర్ ప్లాన్!
-
Vaibhav Sooryavanshi: లక్నోపై చేసిన పరుగులు 8.. అయినా అరుదైన రికార్డు సాధించిన వైభవ్ సూర్యవంశీ..
ట్రెండింగ్
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?