Nadendla Manohar: తమ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు దీపం పథకం అమలు చేస్తున్నాం..
- కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేస్తోంది..
- ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికి ఏడాదికి రూ. 2600కోట్లతో ఉచిత గ్యాస్ పథకం..
- చంద్రబాబు- పవన్ కళ్యాణ్ వల్లే ఇతర దేశాల నుంచి పెట్టుబడులు వస్తున్నాయి: మత్రి నాదెండ్ల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nadendla Manohar: విజయవాడ గన్నవరం నుంచి ఇండిగో విమానంలో విశాఖపట్నం ఎయిర్ పోర్టుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెళ్లారు. ఈ సందర్భంగా కూటమి నాయకులు, అభిమానులు, కార్యకర్తలు, మహిళా నాయకులు మంత్రికి హారతి ఇచ్చి ఘన స్వాగతం పలికారు. విశాఖ విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గాన్న నగరంలోని సన్ రే రిసార్ట్ కు వెళ్ళారు మంత్రి నాదెండ్ల. ఇక, విశాఖ నుంచి రోడ్డు మార్గాన రేపు (గురువారం) శ్రీకాకుళం జిల్లా ఈడు పురం గ్రామం వెళ్లనున్నారు. నవంబర్ ఒకటో తారీఖున శ్రీకాకుళం జిల్లా ఈడు పురం గ్రామంలో జరగబోయే ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం కార్యక్రమాన్ని పర్యవేక్షించనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రీకాకుళం జిల్లా ఈడుపురం గ్రామంలో దీపం పథకం అమలు చేయనున్నారు.
Read Also: Delhi: పావురాల దాణా నిషేధానికి ఢిల్లీ సర్కార్ ఫ్లాన్! కారణమిదే!
Also Read
- Floodlight Collapse: విశాఖ స్టేడియంలో తృటిలో తప్పిన పెను ప్రమాదం.. కూలిన ఫ్లడ్ లైట్..
- Godavari Floods: గోదావరి వరదలపై ప్రభుత్వం అలర్ట్.. ప్రభావిత జిల్లాలకు హోంమంత్రి కీలక ఆదేశాలు
- Botsa Satyanarayana: జగన్ పర్యటనను విజయవంతం చేశాం.. కూటమి ప్రభుత్వంపై బొత్స తీవ్ర ఆరోపణలు
- Rajnath Singh: భారత నౌకాదళం ఆర్థిక ప్రయోజనాలకు రక్షకుడు
ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో హామీ ఇచ్చినట్టుగా దీపం పథకం అమలు చేయనున్నాము.. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా కూటమి ప్రభుత్వం నిలబడి సంవత్సరానికి 2,600 కోట్ల రూపాయలతో ఉచిత గ్యాస్ పథకం అమలు చేస్తుంది అన్నారు. ప్రతి మహిళకి ఆరోగ్య సమస్య రాకుండా సుమారు కోటి 50 లక్షలు కుటుంబాలు ఈ పథకం ద్వారా లబ్ది పొందుతారు.. గ్యాస్ బుక్ చేసుకున్న సుమారు 24 గంటల నుంచి 48 గంటలలోపు డబ్బులు వారి అకౌంట్ లో జమ అయ్యే విధంగా ప్రణాళిక సిద్ధం చేశాం.. అడ్వాన్స్ రూపంలో చెక్కులను గ్యాస్ కంపెనీలకు అందజేశాం.. గ్యాస్ కార్డు, రేషన్ కార్డు, ఆధార్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికీ ఈ పథకం వర్తిస్తుందన్నారు. గత ప్రభుత్వం లక్షల కోట్లు అప్పు చేసి పోయింది.. ఆర్థిక వ్యవస్థని నాశనం చేసిందన్నారు. ధైర్యంగా చక్కటి నాయకత్వం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చేస్తున్నారు కాబట్టి ఇతర దేశాలు నుంచి పెట్టుబడులు వస్తున్నాయని నాదెండ్ల మనోహర్ తెలిపారు.
తాజావార్తలు
-
GDN : సైలెంటుగా తెలుగులోకి మాధవన్ G D నాయుడు
-
Sheikh Hasina: “నరహంతకురాలు”.. షేక్ హసీనా స్పీచ్పై బంగ్లాదేశ్ ఆగ్రహం..
-
Retirement Age: ఆ ఉద్యోగులకు గుడ్న్యూస్.. పదవీ విరమణ వయస్సు పెంపు..
-
Iran: సుప్రీం లీడర్తో మాట్లాడటం కష్టమే.. ఇరాన్ అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు
-
Uttar Pradesh: గ్యాంగ్ స్టర్ అతీక్ అహ్మద్ కుమారుడు మృతి.. జైలులో ఉన్న అన్నను కలిసేందుకు వెళ్తూ..
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!