Fishermen: బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలై విశాఖ చేరుకున్న మత్స్యకారులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fishermen: బంగ్లాదేశ్ జైలులో 3 నెలల పాటు మగ్గిన మత్స్యకారులు విశాఖకు చేరుకున్నారు.. మూడు నెలల క్రితం సముద్రంలో చేపల వేటకు వెళ్లి బంగ్లాదేశ్ కోస్ట్ గార్డులకు చిక్కిన విజయనగరం జిల్లా మత్స్యకారులు ఎట్టకేలకు స్వదేశానికి చేరుకున్నారు. బంగ్లాదేశ్ జైలులో నిర్బంధంలో ఉన్న 9 మంది మత్స్యకారులు విడుదలై, మూడు రోజుల క్రితం విశాఖ ఫిషింగ్ హార్బర్కు చేరుకున్నారు. భారత ప్రభుత్వ చొరవతో పాటు దౌత్య పరమైన ప్రయత్నాల ఫలితంగా, మత్స్యకారులు మూడు నెలల్లోనే బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలయ్యారు. స్వదేశానికి చేరుకున్న మత్స్యకారులను చూసి వారి కుటుంబ సభ్యులు భావోద్వేగానికి గురయ్యారు.
Read Also: Shambala : ఓటీటీలో ‘శంబాల’ ప్రభంజనం.. కేవలం 11 రోజుల్లోనే 100 మిలియన్ల మార్క్!
Also Read
- GVMC వార్డుల పునర్విభజనకు ఆమోదం.. 120 వార్డులతో తుది గెజిట్ విడుదల
- Railway Accident: కొవ్వూరు వద్ద పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.. ఎక్కడికక్కడ నిలిచిపోయిన రైళ్లు..
- Vizag Tragedy: రాఖీ పండుగ రోజే విషాదం.. భార్య, ఇద్దరు చిన్నారులతో సహా ఆటో డ్రైవర్ ఆత్మహత్య
- Minister Narayana: మున్సిపల్ ఎన్నికలపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు.. ఆ తర్వాతే ప్రక్రియ
ఇక, విశాఖ ఫిషింగ్ హార్బర్ వద్ద మత్స్యకారుల అసోసియేషన్ నాయకులు, కుటుంబ సభ్యులు ఘనంగా స్వాగతం పలికారు. కొడుకులు, భర్తలు క్షేమంగా తిరిగిరావడంతో కుటుంబాల్లో ఆనందం వెల్లివిరిసింది. ఈ సందర్భంగా పలువురు మత్స్యకారులు భారత ప్రభుత్వానికి, అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. సరిహద్దు సముద్ర ప్రాంతాల్లో చేపల వేటకు వెళ్లే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు చేపట్టాలని మత్స్యకార సంఘ నాయకులు కోరారు. ఈ సంఘటనతో మత్స్యకారుల కుటుంబాలు ఊపిరి పీల్చుకున్నాయి.
తాజావార్తలు
-
Udhampur Anti-Terror Operation: ఉధంపూర్లో ఎన్కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం
-
Anakapalli Tragedy: అనకాపల్లిలో విషాదం.. బాలిక, యువకుడి మృతితో విషాదం.. అసలేం జరిగింది?
-
Irummudi Collections: ఒక్క అడుగు దూరంలో ‘ఇరుముడి’.. ఆ మార్క్ సాధ్యమేనా?
-
Rs 50 Lakh Bribe: రూ.50 లక్షల లంచం.. రెడ్హ్యాండెడ్గా దొరికిపోయిన తహసీల్దార్..
-
Mahesh Babu: మహేష్ బాబును కలిసిన స్టార్ డైరెక్టర్.. కథ కూడా చెప్పేశాడు?
ట్రెండింగ్
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!