టాలీవుడ్ హీరో ఆది సాయికుమార్ కెరీర్లో చాలా కాలం తర్వాత ‘శంబాల’తో ఒక భారీ హిట్ అందుకున్నాడు. ఆయన నటించిన ఈ లేటెస్ట్ మిస్టరీ థ్రిల్లర్ థియేటర్లలో ఊహించని రేస్పాండ్ అందుకుంది. మౌత్ టాక్ తోనే మంచి కలెక్షన్ లు రాబట్టింది. యుగంధర్ ముని దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా, ఆద్యంతం ఉత్కంఠ రేకెత్తించే కథనంతో ప్రేక్షకులను కట్టిపడేస్తోంది. ఆది నటనకు తోడు శ్రీచరణ్ పాకాల అందించిన నేపథ్య సంగీతం ఈ థ్రిల్లర్ను మరో స్థాయికి తీసుకెళ్లింది. ఈ చిత్రంలో అర్చన అయ్యర్, మధునందన్, రవి వర్మ కీలక పాత్రల్లో నటించగా, మహిధర్ రెడ్డి, రాజశేఖర్ అన్నభిమోజు సంయుక్తంగా నిర్మించారు. ఇక తాజా సమాచారం ప్రకారం.. ఓటీటీలోనూ ఈ మూవీ రికార్డులు తిరగరాస్తోంది.
Also Read : Brahmanandam : నేను ఈ స్థాయిలో ఉండటానికి కారణం వాళ్లే”: పుట్టినరోజు వేళ ఎమోషనల్ అయిన బ్రహ్మానందం!
ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫార్మ్ ఆహాలో విడుదలైన ఈ చిత్రం, కేవలం 11 రోజుల్లోనే 100 మిలియన్ స్ట్రీమింగ్ నిమిషాలను నమోదు చేసి ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచింది. ప్రస్తుతం తెలుగులో దూసుకుపోతున్న ఈ చిత్రం త్వరలోనే హిందీ ప్రేక్షకులను కూడా పలకరించనుంది. ‘శంబాల’ హిందీ వెర్షన్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకున్నట్లు సమాచారం. త్వరలోనే హిందీలో కూడా స్ట్రీమింగ్ ప్రారంభం కానుండటంతో, ఈ వ్యూవర్షిప్ లెక్కలు మరింత పెరిగే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఒక మంచి కమర్షియల్ హిట్ ఆది ఖాతాలో పడటంతో మెగా అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.