CM Chandrababu: ఏపీ చరిత్రలో ఇది మరిచిపోలేని రోజు.. గూగుల్ రాక గేమ్ ఛేంజర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఈరోజు మరిచిపోలేని రోజుగా నిలిచిపోతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. గూగుల్ డేటా సెంటర్కు శంకుస్థాపన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గూగుల్ రాక కేవలం విశాఖకే కాదు, మొత్తం ఆంధ్రప్రదేశ్కు గేమ్ ఛేంజర్గా మారుతుందని పేర్కొన్నారు.
విశాఖకు గూగుల్.. ఏపీకి కొత్త దశ
30 ఏళ్ల క్రితం సైబరాబాద్ను ఐటీ సిటీగా తీర్చిదిద్దితే అది సంపద సృష్టికి కేంద్రంగా మారిందని, ఇప్పుడు విశాఖలో గూగుల్ డేటా సెంటర్తో కొత్త చరిత్ర సృష్టించబోతున్నామని సీఎం తెలిపారు. 2026 ఏప్రిల్ 28 తేదీ భారత టెక్నాలజీ చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతుందని అన్నారు చంద్రబాబు.. భారత్ తూర్పు తీరంలో రెండు సూర్యులు ఉదయించారని, ఒకటి సహజ సూర్యుడు అయితే మరొకటి టెక్ రంగంలో సూర్యుడిలాంటి గూగుల్ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
Also Read
- Vizag : విశాఖ నగరం మీద కాలుష్య మేఘం
- Vizag, Vijayawada Metro Projects: విశాఖ, విజయవాడ మెట్రోరైల్పై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు..
- South Coast Railway Zone: విశాఖ రైల్వే జోన్పై కేంద్రం సర్ప్రైజ్ గెజిట్..
- Weather Updates in Regional Languages: రైతులకు గుడ్న్యూస్.. ఇక ప్రాంతీయ భాషల్లోనే వాతావరణ సమాచారం..
రూ.15 బిలియన్ పెట్టుబడి.. ఆసియాలో అతిపెద్ద డేటా సెంటర్
గూగుల్ రూ.15 బిలియన్ డాలర్ల భారీ పెట్టుబడితో ఏపీ టెక్నాలజీ రంగంలో తలెత్తుకుని నిలబడుతుందని సీఎం చెప్పారు. ఆసియాలోనే అతిపెద్ద డేటా సెంటర్గా ఈ ప్రాజెక్టు నిలుస్తుందని, భారత్కు ఏఐ డేటా గేట్వేగా ఆంధ్రప్రదేశ్ ఎదుగుతుందని పేర్కొన్నారు. సెర్చ్ ఇంజిన్గా ప్రారంభమైన గూగుల్ ఇప్పుడు భారత్ గ్రోత్ ఇంజిన్గా మారుతుందని అన్నారు. ఇప్పటి వరకు ప్రపంచం గూగుల్లో వెతికితే, ఇప్పుడు గూగుల్ విశాఖను వెతుక్కుందని వ్యాఖ్యానించారు.
2028 నాటికి ప్రాజెక్టు పూర్తి చేయాలి
అదానీ గ్రూప్, ఎయిర్టెల్ వంటి దిగ్గజ సంస్థలు ఈ ప్రాజెక్టును వేగంగా పూర్తి చేస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు. 2028 సెప్టెంబర్ నాటికి ఈ ప్రాజెక్టు పూర్తయ్యేలా చూడాలని కోరారు సీఎం చంద్రాబు.. ఇక, ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న “స్పీడ్ ఆఫ్ గవర్నెన్స్”కు గూగుల్ ఏఐ డేటా సెంటర్ సహకారం తీసుకుంటామని సీఎం తెలిపారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి కార్యాలయంలో నలుగురు కార్యదర్శులతో పాటు ఒక కొత్త ఏఐ అసిస్టెంట్ కూడా సుపరిపాలనలో సహకరిస్తోందని వెల్లడించారు.
రైల్వే, బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులు
రాష్ట్రంలో బుల్లెట్ ట్రైన్ వంటి ప్రాజెక్టులతో పాటు అనేక రైల్వే స్టేషన్లను ఆధునీకరిస్తున్నామని చంద్రబాబు చెప్పారు. జూన్ 1 నుంచి సౌత్ కోస్టల్ రైల్వే జోన్కు అధికారిక నోటిఫికేషన్ జారీ చేస్తున్నందుకు కేంద్ర రైల్వే మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.
విశాఖకు గోదావరి నీరు.. పోలవరం పూర్తి
60 రోజుల్లో గోదావరి నీటిని విశాఖకు తీసుకువస్తామని, పోలవరం ప్రాజెక్టును 2027 నాటికి పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని సీఎం ప్రకటించారు.
యువతకు ఉద్యోగాలు.. ఉత్తరాంధ్రకు కొత్త దశ
గూగుల్ రావడంతో విశాఖ యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని చెప్పారు. గతంలో ఉత్తరాంధ్ర అంటే వలసలు, నిరుద్యోగం గుర్తుకు వచ్చేదని, ఇకపై ఉత్తరాంధ్రకే వలసలు వచ్చే రోజులు మొదలవుతాయని అన్నారు. జూలైలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభిస్తామని తెలిపారు. 2028 నాటికి ఆర్సెలార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ నుంచి తొలి ఎగుమతి షిప్మెంట్ వెలువడుతుందని చెప్పారు. డీప్ టెక్నాలజీ, ఏఐ, క్వాంటం టెక్నాలజీలు భారత భవిష్యత్తును మార్చబోతున్నాయని, ఆ మార్పులో ఏపీ ముందుంటుందని చంద్రబాబు స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Crab Biryani Recipe : సీఫుడ్ ప్రియుల కోసం స్పెషల్ ‘పీతల బిర్యానీ’.. హోటల్ స్టైల్లో ఇంట్లోనే ఈజీగా చేసేయండి ఇలా.!
-
TMC Internal Crisis: దీదీ కోటలో చిచ్చు.. టీఎంసీలో సీనియర్ల తిరుగుబాటు! ఇక పార్టీ ముక్కలైనట్లేనా?
-
Petrol-Diesel: పెట్రోల్, డీజిల్ వినియోగం తగ్గించండి.. దేశ పౌరులకు కేంద్రం విజ్ఞప్తి
-
Vizag : విశాఖ నగరం మీద కాలుష్య మేఘం
-
Peddi : ‘పెద్ది’ ట్రైలర్ బ్లాస్ట్.. ఆరోజు నుంచే నేషనల్ వైడ్ విధ్వంసం షురూ!
ట్రెండింగ్
-
204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..
-
Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..
-
8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, యాక్టివ్ కూలింగ్తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!
-
PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..
-
Kathmandu: రన్వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?