Ayodhya Ram Mandir Scam: అయోధ్య రామ్ నమూనా మందిరం వివాదం కేసులో ట్విస్ట్
- అయోధ్య రామ్ నమూనా మందిరం వివాదం కేసులో ట్విస్ట్..
- దేవుడి పేరుతో వ్యాపారమే లక్ష్యంగా రెచ్చిపోయిన నిర్వాహకుడు దుర్గా ప్రసాద్..
- బుద్ధ గణేష్ అనే యువడితో రూ. 32 లక్షలు ఖర్చు పెట్టించిన దుర్గా ప్రసాద్..
Ayodhya Ram Mandir Scam: విశాఖపట్నంలో అయోధ్య రామ్ నమూనా మందిరం వివాదం కేసులో బిగ్ ట్విస్ట్. ఒక్కోక్కటిగా నిర్వాహకుల అరాచకాలు వెలుగులోకి వస్తున్నాయి. దేవుడి పేరుతో వ్యాపారమే లక్ష్యంగా నిర్వాహకుడు దుర్గా ప్రసాద్ రెచ్చిపోయాడు. దేవుడి పేరుతో బిజినెస్ చేసేందుకు అమాయకులకు ఎరా వేసినట్లు గుర్తించారు. పెట్టుబడి పెడితే రెట్టింపు ఆదాయం వస్తుందని మోసాలకు పాల్పడుతున్న నిర్వాహకుడు. ఒక్కొక్కరిగా బాధితులు బయటకు వస్తున్నారు. నిర్వాహకుడు వంగలపూడి దుర్గాప్రసాద్ తనను ఏ విధంగా మోసం చేశాడో సెల్ఫీ వీడియా ద్వారా తెలిపిన కాకినాడకు చెందిన బుద్ధ గణేష్ అనే యువకుడు. అయోధ్య రామ్ నమూనా సెట్ లో పెట్టుబడి పెడితే రెట్టింపు లాభాలు ఇస్తానని దుర్గా ప్రసాద్ నమ్మబలికాడు అని చెప్పుకొచ్చాడు. అయితే, బుద్ధ గణేష్ దగ్గర నుంచి దుర్గా ప్రసాద్ రూ. 32 లక్షలు ఖర్చు పెట్టించారు. కాకినాడ జిల్లా ఎస్పీ ఆఫీస్ లో గ్రీవెన్స్ లో బాధితుడు ఫిర్యాదు చేశాడు.
Read Also: Investopia Global-AP: నేడు విజయవాడలో ఇన్వెస్టోపియా గ్లోబల్-ఏపీ సదస్సు.. పాల్గొననున్న సీఎం చంద్రబాబు
Also Read
- Weather Updates in Regional Languages: రైతులకు గుడ్న్యూస్.. ఇక ప్రాంతీయ భాషల్లోనే వాతావరణ సమాచారం..
- Vizag Stock Market Scam: ఫ్యామిలీ మొత్తం కంత్రీ..! స్టాక్ మార్కెట్లో పెట్టుబడుల పేరుతో రూ.6.5 కోట్లు నొక్కేశారు..
- CM Chandrababu: ఏపీ చరిత్రలో ఇది మరిచిపోలేని రోజు.. గూగుల్ రాక గేమ్ ఛేంజర్..
- Ashwini Vaishnaw: విశాఖపట్నం ఇక ఏఐ పట్నం.. దక్షిణాది రాష్ట్రాలకు పూర్తి న్యాయం.. అమరావతి నుంచి త్వరలోనే బుల్లెట్ ట్రైన్..
మరోవైపు, గరుడ అయోధ్య రామ మందిరం సెట్ వివాదంలో దేవుడి పేరుతో వ్యాపారం చేయడంపై ధార్మిక, హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. నేడు నమూనా దేవాలయం దగ్గరకు సాధువులు, హిందూ సంఘాల ప్రతినిధులు వెళ్లనున్నారు. భారీగా వసూళ్లకు కారణమైన సెట్ ను తక్షణం తొలగించాలని డిమాండ్ చేశారు. భద్రాచలం అర్చకుల సమక్షంలో కళ్యాణం ప్రకటనతో నిర్వహకుల బండారం బయటపడింది. నిర్వాహకులపై ఇప్పటికే పోలీసులు కేసులు నమోదు చేశారు. భక్తులు ఫిర్యాదు చేస్తే విచారించి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
తాజావార్తలు
-
Peddi: చరణ్ ‘పెద్ది’ పంజా.. మహేష్ బాబు నిర్మిస్తున్న ‘రావు బహదూర్’కు థియేటర్ల సెగ!
-
B.Tech Student: పాపం ఏం కష్టమొచ్చిందో.. డీజిల్ పోసుకొని బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య..
-
PEDDI : పాన్ ఇండియా స్థాయిలో పెద్ది ‘పెయిడ్ ప్రీమియర్స్’ ప్లానింగ్
-
Vishwambhara : ‘పెద్ది’ అడ్డంకి తొలగింది.. విశ్వంభర రిలీజ్ కు లైన్ క్లియర్ అయింది
-
Devara 2: దేవర 2 నుండి.. నందమూరి ఫ్యాన్స్కు కొరటాల అదిరిపోయే ప్రామిస్!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!