Ayodhya Ram Mandir Scam: అయోధ్య రామ్ నమూనా మందిరం వివాదం కేసులో ట్విస్ట్
- అయోధ్య రామ్ నమూనా మందిరం వివాదం కేసులో ట్విస్ట్..
- దేవుడి పేరుతో వ్యాపారమే లక్ష్యంగా రెచ్చిపోయిన నిర్వాహకుడు దుర్గా ప్రసాద్..
- బుద్ధ గణేష్ అనే యువడితో రూ. 32 లక్షలు ఖర్చు పెట్టించిన దుర్గా ప్రసాద్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ayodhya Ram Mandir Scam: విశాఖపట్నంలో అయోధ్య రామ్ నమూనా మందిరం వివాదం కేసులో బిగ్ ట్విస్ట్. ఒక్కోక్కటిగా నిర్వాహకుల అరాచకాలు వెలుగులోకి వస్తున్నాయి. దేవుడి పేరుతో వ్యాపారమే లక్ష్యంగా నిర్వాహకుడు దుర్గా ప్రసాద్ రెచ్చిపోయాడు. దేవుడి పేరుతో బిజినెస్ చేసేందుకు అమాయకులకు ఎరా వేసినట్లు గుర్తించారు. పెట్టుబడి పెడితే రెట్టింపు ఆదాయం వస్తుందని మోసాలకు పాల్పడుతున్న నిర్వాహకుడు. ఒక్కొక్కరిగా బాధితులు బయటకు వస్తున్నారు. నిర్వాహకుడు వంగలపూడి దుర్గాప్రసాద్ తనను ఏ విధంగా మోసం చేశాడో సెల్ఫీ వీడియా ద్వారా తెలిపిన కాకినాడకు చెందిన బుద్ధ గణేష్ అనే యువకుడు. అయోధ్య రామ్ నమూనా సెట్ లో పెట్టుబడి పెడితే రెట్టింపు లాభాలు ఇస్తానని దుర్గా ప్రసాద్ నమ్మబలికాడు అని చెప్పుకొచ్చాడు. అయితే, బుద్ధ గణేష్ దగ్గర నుంచి దుర్గా ప్రసాద్ రూ. 32 లక్షలు ఖర్చు పెట్టించారు. కాకినాడ జిల్లా ఎస్పీ ఆఫీస్ లో గ్రీవెన్స్ లో బాధితుడు ఫిర్యాదు చేశాడు.
Read Also: Investopia Global-AP: నేడు విజయవాడలో ఇన్వెస్టోపియా గ్లోబల్-ఏపీ సదస్సు.. పాల్గొననున్న సీఎం చంద్రబాబు
Also Read
- Botsa Satyanarayana: డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలి.. మంత్రి లోకేష్ రాజీనామా చేయాలి..
- Floodlight Collapse: విశాఖ స్టేడియంలో తృటిలో తప్పిన పెను ప్రమాదం.. కూలిన ఫ్లడ్ లైట్..
- Godavari Floods: గోదావరి వరదలపై ప్రభుత్వం అలర్ట్.. ప్రభావిత జిల్లాలకు హోంమంత్రి కీలక ఆదేశాలు
- Botsa Satyanarayana: జగన్ పర్యటనను విజయవంతం చేశాం.. కూటమి ప్రభుత్వంపై బొత్స తీవ్ర ఆరోపణలు
మరోవైపు, గరుడ అయోధ్య రామ మందిరం సెట్ వివాదంలో దేవుడి పేరుతో వ్యాపారం చేయడంపై ధార్మిక, హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. నేడు నమూనా దేవాలయం దగ్గరకు సాధువులు, హిందూ సంఘాల ప్రతినిధులు వెళ్లనున్నారు. భారీగా వసూళ్లకు కారణమైన సెట్ ను తక్షణం తొలగించాలని డిమాండ్ చేశారు. భద్రాచలం అర్చకుల సమక్షంలో కళ్యాణం ప్రకటనతో నిర్వహకుల బండారం బయటపడింది. నిర్వాహకులపై ఇప్పటికే పోలీసులు కేసులు నమోదు చేశారు. భక్తులు ఫిర్యాదు చేస్తే విచారించి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..