AP Liquor Sscam Case: లిక్కర్ స్కాం కేసులో సిట్ దూకుడు..
- ఛార్జిషీట్పై అభ్యంతరాలు లేవనెత్తిన ఏసీబీ కోర్టు..
- కౌంటర్ దాఖలు చేసిన సిట్ అధికారులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Liquor Sscam Case: ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన లిక్కర్ స్కామ్ కేసులో సిట్ దూకుడు చూపిస్తోంది.. ఈ కేసులో ఏసీబీ కోర్టులో ఇప్పటికే ఛార్జిషీట్ దాఖలు చేసింది సిట్.. అయితే, ఛార్జిషీట్పై ఏసీబీ కోర్టు పలు అభ్యంతరాలను లేవనెత్తుతూ.. కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది.. దీంతో, ఛార్జిషీట్లో ఏసీబీ కోర్టు లేవనెత్తిన అభ్యంతరాలపై ఈ రోజు కౌంటర్ దాఖలు చేసింది సిట్.. ప్రైమరీ ఛార్జ్షీట్, రెండో అదనపు ఛార్జిషీట్ లో మొత్తం 20కి పైగా అభ్యంతరాలు లేవనెత్తి.. నివృత్తి చేయాలని సిట్కు ఏసీబీ కోర్టు ఆదేశాలు జారీ చేయగా.. వీటిని నివృత్తి చేస్తూ కోర్టులో కౌంటర్ దాఖలు చేసింది సిట్.. సీల్డ్ కవర్ లో రెండు ఛార్జిషీట్లలో అభ్యంతరాలపై విడివిడిగా కౌంటర్లు కోర్టుకు సమర్పించింది సిట్..
Read Also: Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డికి హైకోర్టులో ఊరట!
Also Read
- Vijayawada Municipal Corporation: బెజవాడ కార్పొరేషన్లో డివిజన్ల పెంపు.. 64 నుంచి 86కు విస్తరణ.. నోటిఫికేషన్ విడుదల
- Fake Liquor Case: నకిలీ మద్యం కేసులో భారీ చార్జ్షీట్ దాఖలు.. 25 మందిపై అభియోగాలు
- Vizag, Vijayawada Metro Projects: విశాఖ, విజయవాడ మెట్రోరైల్పై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు..
- Andhra Pradesh Fuel Crisis: ఏపీలో పెట్రోల్, డీజిల్ కొరత.. బంకుల్లో ‘నో స్టాక్’ బోర్డులు.. వాహనదారుల ఇక్కట్లు..
కాగా, లిక్కర్ స్కాం కేసులో సిట్ దాఖలు చేసిన చార్జిషీట్ల మీద ఏసీబీ కోర్టు అభ్యంతరాలు వ్యక్తం చేసిన విషయం విదితమే.. రెండు ఛార్జ్షీట్లలో 21కి పైగా అభ్యంతరాలు తెలిపారు న్యాయమూర్తి. నిందితులు అందరికీ ముద్దాయి కాపీలు అందజేశారా..? అని ప్రశ్నించారు. ఈ కేసుకు అవినీతి నిరోధక చట్టం ఎలా అప్లయ్ అవుతుందో చెప్పాలని అడిగారు. ఈ కేసులో సిట్ ఎంత మందిని సాక్షులుగా విచారించిందో వివరాలు ఇవ్వాలని కోరారు. ఎంత మంది సాక్షుల దగ్గర 164 స్టేట్మెంట్ రికార్డు చేశారని ప్రశ్నించింది ఏసీబీ కోర్టు. మధ్యవర్తుల రిపోర్టులు, సీజర్ రిపోర్టులు సమర్పించాలంది. లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్లో FIR, రిమాండ్ రిపోర్ట్, ఛార్జ్షీట్ చూపించాలని కోరింది. సాక్షులు, డాక్యుమెంట్లను తగిన విధంగా సమర్పించాలని.. ఛార్జ్షీట్ల ఓచూపించిన డాక్యుమెంట్లకు CF నంబర్లు చూపించాలని కోర్టు ఆదేశించింది. రెండు చార్జిషీట్లలో ప్రిలిమినరీ లేదా ఫైనల్ చార్జీషీట్ అని చెప్పలేదన్నారు న్యాయమూర్తి. FSL రిపోర్టులు ఇంకా ఫైల్ చేయకుండా ఛార్జ్షీట్ ఎలా అర్హత పొందుతుందని ప్రశ్నించారు. లిక్కర్ స్కామ్లో 3500 కోట్లు ఎలా ట్రాన్స్ఫర్ అయ్యాయో టేబుల్ రూపంలో చూపాలన్నారు. కేసులో ఏడు నుంచి 15 వరకు ఉన్న నిందితులను ఇంకా ఎందుకు అరెస్ట్ చేయలేదని కూడా ప్రశ్నించారు. స్కామ్లో వారి పాత్రను స్పష్టం చేయాలన్నారు. ప్రతి ముద్దాయికి ఏ సెక్షన్ వర్తిస్తుందో స్పష్టంగా చెప్పాలన్నారు. ఈ కేసులో ఎంత మంది అరెస్ట్ అయ్యారు… ఎన్ని రోజులు జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారనే వివరాలు ఇవ్వాలన్నారు. అభ్యంతరాలపై మూడు రోజుల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలు ఇచ్చింది కోర్టు.. దీంతో, ఈ రో జు కౌంటర్ దాఖలు చేసింది సిట్..
తాజావార్తలు
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
Marco Rubio: భారత్ టూర్కు మార్కో రూబియో.. వెనిజులా ట్విస్ట్తో పర్యటనపై సర్వత్రా ఆసక్తి
-
New IPL Team: ఐపీఎల్ అభిమానులకు శుభవార్త.. కొత్తగా ఆ రాష్ట్రం పేరుతో మరో ఐపీఎల్ టీం..
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!
-
Supreme Court: ‘న్యాయవ్యవస్థలో అవినీతి’ 8వ తరగతి పాఠంపై సుప్రీంకోర్టు యూటర్న్.. తాజా ఆదేశాలివే!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!