AP Liquor Scam Case: లిక్కర్ కేసులో మరిన్ని ఆధారాలు సేకరించిన సిట్.. కీలక డాక్యుమెంట్లు స్వాధీనం..!
- లిక్కర్ కేసులో మరిన్ని కీలకమైన ఆధారాలు సేకరించిన సిట్..
- చెవిరెడ్డి, విజయనందా రెడ్డి కంపెనీల్లో సోదాలు..
- కీలకమైన డాక్యుమెంట్లు స్వాధీనం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Liquor Scam Case: సంచలనం సృష్టిస్తోన్న ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో సిట్ దూకుడు చూపిస్తోంది.. లిక్కర్ కేసులో మరిన్ని కీలకమైన ఆధారాలు సేకరించింది సిట్.. చెవిరెడ్డి, విజయనందా రెడ్డి కంపెనీల సోదాల్లో లావాదేవీలకు సంబంధించిన మరింత కీలకమైన డాక్యుమెంట్లు లభ్యమయ్యాయి.. నిన్న తిరుపతి, హైదరాబాద్, చిత్తూరులో సోదాలు నిర్వహించిన విషయం విదితమే కాగా.. హైదరాబాద్ లో ఇషా ఇన్ఫ్రా కంపెనీ ఏర్పాటు.. కంపెనీలో సజ్జల భార్గవ్, మోహిత్ రెడ్డి, ప్రద్యుమ్న భాగస్వాముగా ఉన్నట్టుగా గుర్తించింది.. తిరుపతిలో పలు కంపెనీల పేర్లతో చెవిరెడ్డి లావాదేవీలు నిర్వహించినట్టుగా సిట్ అధికారులు చెబుతున్నారు.. మోహిత్ రెడ్డి 600 కోట్ల రూపాయల రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసినట్లు సిట్ గుర్తించింది.. చిత్తూరులో విజయానందరెడ్డి కార్యాలయాల్లోనూ సోదాలు నిర్వహించి.. మోహిత్ రెడ్డితో ఆయన భాగస్వామ్యంపై ఆధారాలు గుర్తించింది సిట్.. ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్ దొరికినా ఆధారాలతో కలిపి మిగిలిన సమాచారం ఇవ్వాలని సిట్ నిర్ణయం తీసుకుంది.. తుమ్మల గుంటలో చెవిరెడ్డి ఇంటి తాళం వేసి ఉండటంతో రాత్రి వరకు చూసి వెనుతిరిగారు సిట్ అధికారులు.
Read Also: Wobble Maximus: అతిపెద్ద స్మార్ట్ టీవీ.. 116.5-అంగుళాల డిస్ప్లేతో.. థియేటర్ లాంటి ఎక్స్పీరియన్స్
Also Read
- Narayana: త్రేతాయుగంలో రావణుడు విలన్.. కలియుగంలో రావణ్ను హీరో చేశారు..
- NIA Raids: విజయవాడలో ఎన్ఐఏ విస్తృత సోదాలు.. టెర్రర్ లింక్స్ కేసులో మూడు ప్రాంతాల్లో తనిఖీలు
- Chinta Mohan: అయోధ్య అవినీతిపై సీబీఐ విచారణ జరపాలి.. కేంద్ర మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు
- Saikrishna Mother Vijayalakshmi: "నా కొడుకు పవన్ కళ్యాణ్ అభిమాని.. క్రిమినల్ అని ఎలా అంటారు?".. సాయికృష్ణ తల్లి ఆగ్రహం..
మరోవైపు, లిక్కర్ స్కాం కేసుకు సంబంధించి సిట్ అధికారులు మరో ఛార్జ్ షీటును వేయాలని నిర్ణయించారు.. ఇప్పటికే ఈ కేసు కు సంబంధించి రెండు ఛార్జిషీట్లను అధికారులు ఏసీబీ కోర్టులో దాఖలు చేశారు. జూన్ 19న ప్రైమరీఛార్జ్ ఆగస్టు 10వ తేదీన రెండవ అదనపు ఛార్జ్షీట్ దాఖలు చేశారు. ఈ రెండు ఛార్జిషీట్లలో అధికారులు ఇప్పటికే అరెస్టు చేసిన నిందితులు రాజ్ కేసు రెడ్డి, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప, సజ్జల శ్రీధర్ రెడ్డి, చాణక్య పాత్ర గురించి వివరించారు.. కొన్నిసార్లు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేరు కూడా ప్రస్తావించారు. అయితే జగన్ పేరు ఇప్పటివరకు నిందితుడిగా సిట్ అధికారులు పేర్కొనలేదు.. ఈ రెండు ఛార్జిషీట్ల మీద ఏసీబీ కోర్టు 20కి పైగా అభ్యంతరాలను కూడా లేవనెత్తింది.. ఈ అభ్యంతరాలు అన్నింటి మీద నివృత్తి చేస్తూ సీల్డ్ కవర్లో వివరణను కూడా సిట్ అధికారులు ఏసీబీ కోర్టుకు అందజేశారు..
ఇక ప్రస్తుతం కేసు విచారణ తుది దశకు చేరుకుంది.. సెప్టెంబర్ నెలాఖరు నాటికి కేసు విచారణ ముగించే దిశగా అధికారులకు విచారణ చేపట్టారు.. అందులో భాగంగానే కేసులో నిందితులుగా ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుటుంబ సభ్యుల ఇళ్లల్లో కూడా పెద్ద ఎత్తున సోదాలు చేపట్టారు.. దీంతోపాటు నిందితుల ఆస్తులను కూడా భారీగా అటాచ్ చేయటానికి ప్రభుత్వం అనుమతి రావడంతో కోర్టు అనుమతి కోసం సిద్ధమవుతున్నారు. అయితే, కేసులో ఇప్పటికే అరెస్టై రిమాండ్ లో ఉన్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అండ్ టీం ఎవరైతే ఉన్నారో వాళ్లందరూ అరెస్టే 90 రోజులు పూర్తవుతున్న నేపథ్యంలో వారికి బెయిల్ రాకుండా ఉండాలంటే కచ్చితంగా సిట్ అధికారులు చార్జిషీట్లు దాఖలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో సెప్టెంబర్ 15వ తేదీన మూడవ అదనపు ఛార్జిషీట్ను ఈ కేసులో దాఖలు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఇప్పటికే ఈ కేసులో 12 మంది అరెస్ట్ అవ్వగా మరికొందరిని అరెస్టు చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో మూడవ అదనపు చార్జిషీట్ దాఖలు చేసే అంశం కీలకంగా మారింది.
తాజావార్తలు
-
TMC Crisis: మమతా బెనర్జీకి మరో షాక్.. రాజ్యసభకు కోయెల్ మల్లిక్ రాజీనామా
-
OnePlus: ఇండియాను వదిలి వెళ్లి పోతున్న వన్ ప్లస్..? క్లారిటీ..
-
Delimitation Bill: డీలిమిటేషన్ బిల్లు.. మిషన్ 360పై మోడీ సర్కార్ ఫోకస్..
-
Hair Growth Tips: జుట్టు గుత్తులు గుత్తులుగా రాలిపోతోందా?.. ఈ చిట్కాలు చాలు..
-
Sujeeth: సైలెంట్గా పని కానిచ్చేస్తున్న స్టార్ డైరెక్టర్..
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!