Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Sit Aggressive In Ap Liquor Scam Case

AP Liquor Scam Case: లిక్కర్ కేసులో మరిన్ని ఆధారాలు సేకరించిన సిట్.. కీలక డాక్యుమెంట్లు స్వాధీనం..!

Published Date :September 4, 2025 , 8:59 am
By Sudhakar Ravula
  • లిక్కర్ కేసులో మరిన్ని కీలకమైన ఆధారాలు సేకరించిన సిట్..
  • చెవిరెడ్డి, విజయనందా రెడ్డి కంపెనీల్లో సోదాలు..
  • కీలకమైన డాక్యుమెంట్లు స్వాధీనం..
AP Liquor Scam Case: లిక్కర్ కేసులో మరిన్ని ఆధారాలు సేకరించిన సిట్.. కీలక డాక్యుమెంట్లు స్వాధీనం..!
  • Follow Us :
  • google news
  • dailyhunt

AP Liquor Scam Case: సంచలనం సృష్టిస్తోన్న ఏపీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో సిట్‌ దూకుడు చూపిస్తోంది.. లిక్కర్ కేసులో మరిన్ని కీలకమైన ఆధారాలు సేకరించింది సిట్.. చెవిరెడ్డి, విజయనందా రెడ్డి కంపెనీల సోదాల్లో లావాదేవీలకు సంబంధించిన మరింత కీలకమైన డాక్యుమెంట్లు లభ్యమయ్యాయి.. నిన్న తిరుపతి, హైదరాబాద్, చిత్తూరులో సోదాలు నిర్వహించిన విషయం విదితమే కాగా.. హైదరాబాద్ లో ఇషా ఇన్ఫ్రా కంపెనీ ఏర్పాటు.. కంపెనీలో సజ్జల భార్గవ్, మోహిత్ రెడ్డి, ప్రద్యుమ్న భాగస్వాముగా ఉన్నట్టుగా గుర్తించింది.. తిరుపతిలో పలు కంపెనీల పేర్లతో చెవిరెడ్డి లావాదేవీలు నిర్వహించినట్టుగా సిట్‌ అధికారులు చెబుతున్నారు.. మోహిత్ రెడ్డి 600 కోట్ల రూపాయల రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసినట్లు సిట్‌ గుర్తించింది.. చిత్తూరులో విజయానందరెడ్డి కార్యాలయాల్లోనూ సోదాలు నిర్వహించి.. మోహిత్ రెడ్డితో ఆయన భాగస్వామ్యంపై ఆధారాలు గుర్తించింది సిట్‌.. ఈడీ, ఇన్‌కమ్‌ ట్యాక్స్ దొరికినా ఆధారాలతో కలిపి మిగిలిన సమాచారం ఇవ్వాలని సిట్ నిర్ణయం తీసుకుంది.. తుమ్మల గుంటలో చెవిరెడ్డి ఇంటి తాళం వేసి ఉండటంతో రాత్రి వరకు చూసి వెనుతిరిగారు సిట్ అధికారులు.

Read Also: Wobble Maximus: అతిపెద్ద స్మార్ట్ టీవీ.. 116.5-అంగుళాల డిస్‌ప్లేతో.. థియేటర్ లాంటి ఎక్స్‌పీరియన్స్‌

మరోవైపు, లిక్కర్ స్కాం కేసుకు సంబంధించి సిట్ అధికారులు మరో ఛార్జ్ షీటును వేయాలని నిర్ణయించారు.. ఇప్పటికే ఈ కేసు కు సంబంధించి రెండు ఛార్జిషీట్లను అధికారులు ఏసీబీ కోర్టులో దాఖలు చేశారు. జూన్ 19న ప్రైమరీఛార్జ్‌ ఆగస్టు 10వ తేదీన రెండవ అదనపు ఛార్జ్‌షీట్‌ దాఖలు చేశారు. ఈ రెండు ఛార్జిషీట్లలో అధికారులు ఇప్పటికే అరెస్టు చేసిన నిందితులు రాజ్ కేసు రెడ్డి, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప, సజ్జల శ్రీధర్ రెడ్డి, చాణక్య పాత్ర గురించి వివరించారు.. కొన్నిసార్లు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేరు కూడా ప్రస్తావించారు. అయితే జగన్ పేరు ఇప్పటివరకు నిందితుడిగా సిట్ అధికారులు పేర్కొనలేదు.. ఈ రెండు ఛార్జిషీట్ల మీద ఏసీబీ కోర్టు 20కి పైగా అభ్యంతరాలను కూడా లేవనెత్తింది.. ఈ అభ్యంతరాలు అన్నింటి మీద నివృత్తి చేస్తూ సీల్డ్ కవర్‌లో వివరణను కూడా సిట్‌ అధికారులు ఏసీబీ కోర్టుకు అందజేశారు..

Read Also: Jio Anniversary celebration: 9 ఏళ్లు పూర్తి చేసుకున్న జియో.. యూజర్ల కోసం బంపరాఫర్లు.. ఫ్రీ అన్ లిమిటెడ్ 5G డేటా!

ఇక ప్రస్తుతం కేసు విచారణ తుది దశకు చేరుకుంది.. సెప్టెంబర్ నెలాఖరు నాటికి కేసు విచారణ ముగించే దిశగా అధికారులకు విచారణ చేపట్టారు.. అందులో భాగంగానే కేసులో నిందితులుగా ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుటుంబ సభ్యుల ఇళ్లల్లో కూడా పెద్ద ఎత్తున సోదాలు చేపట్టారు.. దీంతోపాటు నిందితుల ఆస్తులను కూడా భారీగా అటాచ్‌ చేయటానికి ప్రభుత్వం అనుమతి రావడంతో కోర్టు అనుమతి కోసం సిద్ధమవుతున్నారు. అయితే, కేసులో ఇప్పటికే అరెస్టై రిమాండ్ లో ఉన్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అండ్ టీం ఎవరైతే ఉన్నారో వాళ్లందరూ అరెస్టే 90 రోజులు పూర్తవుతున్న నేపథ్యంలో వారికి బెయిల్ రాకుండా ఉండాలంటే కచ్చితంగా సిట్ అధికారులు చార్జిషీట్లు దాఖలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో సెప్టెంబర్ 15వ తేదీన మూడవ అదనపు ఛార్జిషీట్‌ను ఈ కేసులో దాఖలు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఇప్పటికే ఈ కేసులో 12 మంది అరెస్ట్ అవ్వగా మరికొందరిని అరెస్టు చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో మూడవ అదనపు చార్జిషీట్ దాఖలు చేసే అంశం కీలకంగా మారింది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • AP Liquor Scam Case
  • liquor scam case
  • SIT

తాజావార్తలు

  • OTR: అడుగడుగునా ఫ్లెక్సీల ఏర్పాటు.. ఎంపీ పుట్టా కవరింగ్ కలర్!

  • Spoiled Meat: నాన్‌ వెజ్‌ ప్రియుల్లారా, తస్మాత్‌ జాగ్రత్త.. 14 వేల కిలోల కుళ్లిన మాంసం..

  • MBNR CHINNARI MURDER: బసిరెడ్డిపల్లిలో విషాదం.. కేవలం ఐదేళ్ల వయసున్న చిన్నారిని అత్యంత దారుణంగా..

  • Bank Account: అంతా మ్యూల్ మాయ.. 3 నెలల్లోనే రూ.31 కోట్లు..

  • HYD AIRPORT GANJAI: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో రూ. 9 కోట్ల గంజాయి సీజ్!

ట్రెండింగ్‌

  • Poha Bisibele Bath Recipe : అటుకులతో బిసిబేళా బాత్..! బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఎంతో రుచికరమైన రెసిపీ మీ కోసం

  • Relationship Tips : జీవిత భాగస్వామిలో కెమిస్ట్రీ సరిపోదు.. ఈ 5 ఉంటేనే సెట్.!

  • Pure Ghee Tips : మీరు తినే నెయ్యి ఓరిజినలేనా..? లేక.. నకిలీనా..? 2 నిమిషాల్లో చెక్..!

  • Mooli Raita Recipe : ముల్లంగితో ఇలా ‘రైతా’ చేసి చూడండి.. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.!

  • Summer Skin Itching Remedies : వేసవిలో చెమట దురదకు సింపుల్ సొల్యూషన్.! 2 నిమిషాల్లో రిలీఫ్.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions