CPI Narayana: సెబీ అంశంపై దేశవ్యాప్తంగా ఆందోళనలు
- ప్రధాని నరేంద్ర మోడీ కుడిభుజంగా అదానీ..
- అదానీ ఇనుప కవచంలాగా మోడీ ఉన్నారు..
- విమర్శలు గుప్పించిన సీపీఐ నారాయణ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CPI Narayana: భారతదేశంలో గవర్నర్, లెఫ్టినెంట్ గవర్నర్ల వ్యవస్థ.. వారి పాత్ర చాలా దారుణంగా ఉంది అని మండిపడ్డారు సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ.. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ప్రధాని నరేంద్ర మోడీ కుడిభుజంగా అదానీ.. మరోవైపు అదానీ ఇనుప కవచంలాగా మోడీ ఉన్నారని ఆరోపించారు.. సెబీ అనేది ఒక పవర్ ఫుల్ సంస్ధ.. అలాంటి సంస్థ కూడా అదానీకి కొమ్ముకాయడం ఏంటి? అంటూ విమర్శలు గుప్పించారు.. ఇక, ప్రమాదకర స్ధాయికి భారతదేశాన్ని తీసుకెళ్లారని ఆరోపణలు గుప్పించారు.. సెబీ అంశం పై దేశవ్యాప్తంగా ఆందోళనలు చేయడానికి సీపీఐ సిద్ధంమైనట్టు వెల్లడించారు.. అవినీతి, అహంభావం పెరిగిపోయాయి.. ప్రజాస్వామ్యాన్ని లెక్కచేయడం లేదు.. భారతదేశంలో గవర్నర్, లెఫ్టినెంట్ గవర్నర్ ల పాత్ర చాలా దారుణంగా ఉందన్నారు..
Read Also: Saina Nehwal: కామెంట్లు చేయడం ఈజీ.. గేమ్స్ ఆడటం చాలా కష్టం! ఇచ్చిపడేసిన సైనా
Also Read
- Vijayawada Municipal Corporation: బెజవాడ కార్పొరేషన్లో డివిజన్ల పెంపు.. 64 నుంచి 86కు విస్తరణ.. నోటిఫికేషన్ విడుదల
- Fake Liquor Case: నకిలీ మద్యం కేసులో భారీ చార్జ్షీట్ దాఖలు.. 25 మందిపై అభియోగాలు
- Vizag, Vijayawada Metro Projects: విశాఖ, విజయవాడ మెట్రోరైల్పై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు..
- Andhra Pradesh Fuel Crisis: ఏపీలో పెట్రోల్, డీజిల్ కొరత.. బంకుల్లో ‘నో స్టాక్’ బోర్డులు.. వాహనదారుల ఇక్కట్లు..
మరోవైపు.. రైతుల విషయంలో ఈ ప్రభుత్వం పట్టీ పట్టనట్టు ఉంటోందని విమర్శించారు సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ.. ప్రకాశం జిల్లాలో వర్షాభావ పరిస్థితులలో రైతులు నష్టపోయారు.. రాష్ట్రం ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నా.. అందరికీ ఏదోలా ఇస్తూ… అధికారం ఇచ్చిన రైతులను పట్టించుకోవడం లేదన్నారు.. సీఎం చంద్రబాబుకు ఇరిగేషన్ ప్రాజెక్టులు అంటే పోలవరం మాత్రమే కనిపిస్తోంది… తుంగభద్ర ప్రాజెక్టే కాదు రాష్ట్రంలో ప్రాజెక్టులు అన్నీ దుస్ధితిలో ఉన్నాయన్నారు.. ప్రతీ ప్రాజెక్టు మెయింటెనెన్స్ పై ఒక నివేదిక తెప్పించి, నిర్వహణ కోసం నిధులు వెచ్చించాలని సూచించారు సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ.. కాగా, అదానీతో వ్యాపార సంబంధాలు ఉన్నట్లు హిండెన్బర్గ్ ఆరోపించిన నేపథ్యంలో.. సెబీ చీఫ్ మాధురి పురీ బుచ్ రాజీనామా చేయాలనే డిమాండ్ వినిపిస్తోంది.. అదానీ వ్యవహారంపై సంయుక్త పార్లమెంటరీ సంఘం (జేపీసీ) వేయాలని డిమాండ్ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ.. ఈ నెల 22వ తేదీన దేశవ్యాప్తంగా ప్రజాచైతన్య ఉద్యమం ధర్నాలు చేపట్టాలని నిర్ణయించిన విషయం విదితమే.
తాజావార్తలు
-
Dragon Glimpse: ‘డ్రాగన్’ బాక్సాఫీస్ ఊచకోత ఖాయం.. ప్రశాంత్ నీల్ మైండ్ బ్లాకింగ్ గ్లింప్స్!
-
CI: సహాయం కోరితే సహజీవనం చేశాడు.. మహిళ జీవితంతో ఆడుకున్న సీఐ..
-
Hyderabad: పెళ్లికి ముందే తల్లయింది.. చివరికి ప్రియుడిని పెళ్లాడేందుకు కన్నింగ్ ప్లాన్
-
Trump Warning: ‘వాళ్లకు మరో భారీ దెబ్బ ఇవ్వాల్సి రావచ్చు’.. ఇరాన్కు ట్రంప్ తాజా వార్నింగ్
-
Mitchell Marsh: సెంచరీ మిస్.. బ్యాటింగ్ ‘టార్చర్’ అనిపించింది.. మిచెల్ మార్ష్ ఆవేదన..
ట్రెండింగ్
-
Thotakura Masala Vada Recipe: కరకరలాడే తోటకూర మసాలా వడలు.. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచి.!
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!