CPI Narayana: సెబీ అంశంపై దేశవ్యాప్తంగా ఆందోళనలు
- ప్రధాని నరేంద్ర మోడీ కుడిభుజంగా అదానీ..
- అదానీ ఇనుప కవచంలాగా మోడీ ఉన్నారు..
- విమర్శలు గుప్పించిన సీపీఐ నారాయణ..
CPI Narayana: భారతదేశంలో గవర్నర్, లెఫ్టినెంట్ గవర్నర్ల వ్యవస్థ.. వారి పాత్ర చాలా దారుణంగా ఉంది అని మండిపడ్డారు సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ.. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ప్రధాని నరేంద్ర మోడీ కుడిభుజంగా అదానీ.. మరోవైపు అదానీ ఇనుప కవచంలాగా మోడీ ఉన్నారని ఆరోపించారు.. సెబీ అనేది ఒక పవర్ ఫుల్ సంస్ధ.. అలాంటి సంస్థ కూడా అదానీకి కొమ్ముకాయడం ఏంటి? అంటూ విమర్శలు గుప్పించారు.. ఇక, ప్రమాదకర స్ధాయికి భారతదేశాన్ని తీసుకెళ్లారని ఆరోపణలు గుప్పించారు.. సెబీ అంశం పై దేశవ్యాప్తంగా ఆందోళనలు చేయడానికి సీపీఐ సిద్ధంమైనట్టు వెల్లడించారు.. అవినీతి, అహంభావం పెరిగిపోయాయి.. ప్రజాస్వామ్యాన్ని లెక్కచేయడం లేదు.. భారతదేశంలో గవర్నర్, లెఫ్టినెంట్ గవర్నర్ ల పాత్ర చాలా దారుణంగా ఉందన్నారు..
Read Also: Saina Nehwal: కామెంట్లు చేయడం ఈజీ.. గేమ్స్ ఆడటం చాలా కష్టం! ఇచ్చిపడేసిన సైనా
Also Read
- Andhra Pradesh Fuel Crisis: ఏపీలో పెట్రోల్, డీజిల్ కొరత.. బంకుల్లో ‘నో స్టాక్’ బోర్డులు.. వాహనదారుల ఇక్కట్లు..
- V Srinivasa Rao: డీలిమిటేషన్పై చంద్రబాబు తప్పుడు ప్రచారం.. విభజన హామీల ప్రకారం ఇప్పటికే మనకు 225 సీట్లు పెరగాలి..
- YS Jagan Former CPRO Srihari Arrested: వైఎస్ జగన్ మాజీ సీపీఆర్వో శ్రీహరి అరెస్ట్..
- Fire Services Week: అగ్నిమాపక శాఖ వారోత్సవాలకు శ్రీకారం.. నిబంధనలు కఠినంగా అమలు చేయాల్సిందే..
మరోవైపు.. రైతుల విషయంలో ఈ ప్రభుత్వం పట్టీ పట్టనట్టు ఉంటోందని విమర్శించారు సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ.. ప్రకాశం జిల్లాలో వర్షాభావ పరిస్థితులలో రైతులు నష్టపోయారు.. రాష్ట్రం ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నా.. అందరికీ ఏదోలా ఇస్తూ… అధికారం ఇచ్చిన రైతులను పట్టించుకోవడం లేదన్నారు.. సీఎం చంద్రబాబుకు ఇరిగేషన్ ప్రాజెక్టులు అంటే పోలవరం మాత్రమే కనిపిస్తోంది… తుంగభద్ర ప్రాజెక్టే కాదు రాష్ట్రంలో ప్రాజెక్టులు అన్నీ దుస్ధితిలో ఉన్నాయన్నారు.. ప్రతీ ప్రాజెక్టు మెయింటెనెన్స్ పై ఒక నివేదిక తెప్పించి, నిర్వహణ కోసం నిధులు వెచ్చించాలని సూచించారు సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ.. కాగా, అదానీతో వ్యాపార సంబంధాలు ఉన్నట్లు హిండెన్బర్గ్ ఆరోపించిన నేపథ్యంలో.. సెబీ చీఫ్ మాధురి పురీ బుచ్ రాజీనామా చేయాలనే డిమాండ్ వినిపిస్తోంది.. అదానీ వ్యవహారంపై సంయుక్త పార్లమెంటరీ సంఘం (జేపీసీ) వేయాలని డిమాండ్ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ.. ఈ నెల 22వ తేదీన దేశవ్యాప్తంగా ప్రజాచైతన్య ఉద్యమం ధర్నాలు చేపట్టాలని నిర్ణయించిన విషయం విదితమే.
తాజావార్తలు
-
Tollywood : బీస్ట్ మోడ్లోకి స్టార్ బ్యూటీస్.. రియల్ స్టంట్స్ చేస్తోన్న హీరోయిన్స్
-
Iran War: ఇరాన్పై దాడికి అమెరికా సిద్ధం.. ట్రంప్ ముందు 3 ప్రణాళికలు..
-
Tragedy : పాఠశాల ముందు మృత్యువు..! ఐదేళ్ల చిన్నారి ప్రాణం తీసిన నిర్లక్ష్యం
-
IPL 2026: “ఇక 350 కొడితేనే సేఫ్”.. ఐపీఎల్ పరుగుల ప్రవాహంపై ఆ దేశ క్రికెట్ బోర్డు ఆసక్తికర పోస్ట్..
-
Bengal Exit Poll: అంతుచిక్కని బెంగాల్ ఓటర్ నాడి.. ఎగ్జిట్ పోల్స్పై ప్రముఖ సంస్థ మౌనం..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!