CPI Narayana: సెబీ అంశంపై దేశవ్యాప్తంగా ఆందోళనలు
- ప్రధాని నరేంద్ర మోడీ కుడిభుజంగా అదానీ..
- అదానీ ఇనుప కవచంలాగా మోడీ ఉన్నారు..
- విమర్శలు గుప్పించిన సీపీఐ నారాయణ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CPI Narayana: భారతదేశంలో గవర్నర్, లెఫ్టినెంట్ గవర్నర్ల వ్యవస్థ.. వారి పాత్ర చాలా దారుణంగా ఉంది అని మండిపడ్డారు సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ.. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ప్రధాని నరేంద్ర మోడీ కుడిభుజంగా అదానీ.. మరోవైపు అదానీ ఇనుప కవచంలాగా మోడీ ఉన్నారని ఆరోపించారు.. సెబీ అనేది ఒక పవర్ ఫుల్ సంస్ధ.. అలాంటి సంస్థ కూడా అదానీకి కొమ్ముకాయడం ఏంటి? అంటూ విమర్శలు గుప్పించారు.. ఇక, ప్రమాదకర స్ధాయికి భారతదేశాన్ని తీసుకెళ్లారని ఆరోపణలు గుప్పించారు.. సెబీ అంశం పై దేశవ్యాప్తంగా ఆందోళనలు చేయడానికి సీపీఐ సిద్ధంమైనట్టు వెల్లడించారు.. అవినీతి, అహంభావం పెరిగిపోయాయి.. ప్రజాస్వామ్యాన్ని లెక్కచేయడం లేదు.. భారతదేశంలో గవర్నర్, లెఫ్టినెంట్ గవర్నర్ ల పాత్ర చాలా దారుణంగా ఉందన్నారు..
Read Also: Saina Nehwal: కామెంట్లు చేయడం ఈజీ.. గేమ్స్ ఆడటం చాలా కష్టం! ఇచ్చిపడేసిన సైనా
Also Read
- Vijaya Dairy Chairman Post: విజయ డైరీ ఛైర్మన్ ఎంపికకు బ్రేక్.. వారం రోజులు వాయిదా..
- Bonda Uma: శాంతియుత ఆందోళనలకు అభ్యంతరం లేదు.. లేదంటే మా స్టైల్లో బుద్ధి చెబుతాం..!
- Perni Nani: డీఎస్సీ నియామకాలపై కొత్త వివాదం.. బహిరంగ చర్చకు రావాలన్న పేర్ని నాని
- Sai Krishna Custodial Death Case: సాయికృష్ణ కేసులో కీలక మలుపు.. హత్య కేసు కొట్టేయాలంటూ హైకోర్టుకు సీఐ నాగరాజు
మరోవైపు.. రైతుల విషయంలో ఈ ప్రభుత్వం పట్టీ పట్టనట్టు ఉంటోందని విమర్శించారు సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ.. ప్రకాశం జిల్లాలో వర్షాభావ పరిస్థితులలో రైతులు నష్టపోయారు.. రాష్ట్రం ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నా.. అందరికీ ఏదోలా ఇస్తూ… అధికారం ఇచ్చిన రైతులను పట్టించుకోవడం లేదన్నారు.. సీఎం చంద్రబాబుకు ఇరిగేషన్ ప్రాజెక్టులు అంటే పోలవరం మాత్రమే కనిపిస్తోంది… తుంగభద్ర ప్రాజెక్టే కాదు రాష్ట్రంలో ప్రాజెక్టులు అన్నీ దుస్ధితిలో ఉన్నాయన్నారు.. ప్రతీ ప్రాజెక్టు మెయింటెనెన్స్ పై ఒక నివేదిక తెప్పించి, నిర్వహణ కోసం నిధులు వెచ్చించాలని సూచించారు సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ.. కాగా, అదానీతో వ్యాపార సంబంధాలు ఉన్నట్లు హిండెన్బర్గ్ ఆరోపించిన నేపథ్యంలో.. సెబీ చీఫ్ మాధురి పురీ బుచ్ రాజీనామా చేయాలనే డిమాండ్ వినిపిస్తోంది.. అదానీ వ్యవహారంపై సంయుక్త పార్లమెంటరీ సంఘం (జేపీసీ) వేయాలని డిమాండ్ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ.. ఈ నెల 22వ తేదీన దేశవ్యాప్తంగా ప్రజాచైతన్య ఉద్యమం ధర్నాలు చేపట్టాలని నిర్ణయించిన విషయం విదితమే.
తాజావార్తలు
-
Toxic Business : డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి యష్.. భారీ ధర పలికిన తెలుగు రైట్స్
-
Shakeel Noorani: నటిపై లైంగిక దాడి ఆరోపణలు.. 73 ఏళ్ల దర్శకుడి అరెస్ట్తో బాలీవుడ్లో కలకలం
-
Motorola Edge 70 Neo: మోటరోలా ఎడ్జ్ 70 నియో.. 200MP ట్రిపుల్ కెమెరాతో మోటరోలా కొత్త ఫోన్.. డిజైన్ లీక్
-
Tragedy: నార్సింగిలో ఘోర రోడ్డు ప్రమాదం.. రాంగ్ రూట్లో దూసుకొచ్చిన కారు, ఆర్మీ జవాన్ మృతి
-
Iran and US Tensions: ఇరాన్పై మారిన ట్రంప్ వ్యూహం..? ఇక సైనిక దాడులు ఉండవు..! కానీ..
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!