AP Liquor Scam Case: లిక్కర్ కేసులో కీలక పరిణామం.. తెరపైకి కొత్త పేర్లు..!
- ఏపీ లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం..
- కేసులో కొత్త నిందితుల పేర్లపై చర్చ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Liquor Scam Case: ఆంధ్రప్రదేశ్లో సంచలనంగా మారిన లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం చోటు చేసుకోబోతోంది.. ఈ కేసులో కొత్తగా నిందితుల పేర్లు సిట్ చేర్చనుందా అనే చర్చ మొదలైంది. గత 15 రోజుల కాలంలో సిట్ విచారణలో భాగంగా సేకరించిన ఆధారాలు సహాయంతో మరికొందరి పేర్లు కేసులో చేర్చే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే ఈ కేసుకి సంబంధించి 48 మంది మీద కేసు నమోదు అయింది. ఇందులో 29 మంది వ్యక్తులు 19 సంస్థలు ఉన్నాయి. కేసులో నిందితులుగా ఉన్న వారిలో 12 మందిని సీట్ అరెస్టు చేయగా.. అందులో నలుగురు బెయిల్ పై విడుదలయ్యారు. ఇంకా ఎనిమిది మంది రిమాండ్లో కొనసాగుతున్నారు. ఇదే సమయంలో మరి కొంతమంది అరెస్టులు చేసేందుకు సిట్ సిద్ధం అవుతోంది అని ప్రచారం జరిగినా అది జరగలేదు. అయితే, కేసు విచారణ తుది దశకు వచ్చింది అని చిట్ అధికారులు చెబుతున్న నేపథ్యంలో విశాఖ, తిరుపతి, హైదరాబాద్ ప్రాంతాల్లో వరసగా చేపట్టిన సోదాలు కొత్త నిందితుల పేర్లు చేరనున్నాయి అనే అంశానికి బలాన్ని చేకూరుస్తున్నాయి.
Read Also: Brahmanandam : పొలిటికల్ ఎంట్రీపై బ్రహ్మానందం సంచలన ప్రకటన..
Also Read
- Vizag, Vijayawada Metro Projects: విశాఖ, విజయవాడ మెట్రోరైల్పై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు..
- Andhra Pradesh Fuel Crisis: ఏపీలో పెట్రోల్, డీజిల్ కొరత.. బంకుల్లో ‘నో స్టాక్’ బోర్డులు.. వాహనదారుల ఇక్కట్లు..
- V Srinivasa Rao: డీలిమిటేషన్పై చంద్రబాబు తప్పుడు ప్రచారం.. విభజన హామీల ప్రకారం ఇప్పటికే మనకు 225 సీట్లు పెరగాలి..
- YS Jagan Former CPRO Srihari Arrested: వైఎస్ జగన్ మాజీ సీపీఆర్వో శ్రీహరి అరెస్ట్..
ఈ కేసుకు సంబంధించి చిత్తూరులో వైసీపీ నేతగా ఉన్న విజయానంద రెడ్డిని ఇప్పటికే పోలీసులు విజయవాడ సిట్ కార్యాలయానికి పిలిపించి విచారించారు. మద్యం స్కాం కేసుకి సంబంధించి లిక్కర్ సరఫరా వ్యవహారాలు అన్ని చక్కబెట్టినట్టుగా విజయానంద రెడ్డి మీద వచ్చిన ఫిర్యాదుల అంశంగా కేసులో ఇతని పాత్ర ఎంతవరకు ఉందనే అంశంపై సిట్ విచారణ చేపట్టింది. మరోవైపు జగన్ సోదరుడు అనిల్ రెడ్డి పీఏ దేవరాజులును కూడా సెట్ అధికారులు విచారించారు. ఇంకోవైపు సునీల్ రెడ్డి పాత్ర ఉంది అనే దాని మీద కూడా విస్తృత ప్రచారం జరుగుతుంది. ఈ సమయంలో విశాఖలో హైదరాబాద్లో చేపట్టిన సోదలలో కూడా కొని కీలక ఆధారాలు సిట్ సేకరించిందని ఈ ఆధారాల సహాయంతో మరికొందరిపై కేసు నమోదు చేసే అవకాశాలు ఉన్నట్టు చర్చ జరుగుతోంది. ఇక చెవిరెడ్డి సన్నిహితులు చెవిరెడ్డికి సంబంధించిన కార్యాలయాల్లో చేపట్టిన సోదాలు కూడా చర్చగా మారాయి. అయితే, కొత్తగా నిందితుల పేర్లను కేసులో చేర్చే అంశంపై సిట్ మాత్రం గుంభనంగా వ్యవహరిస్తోంది. ఇటీవల కేసుకు సంబంధించి వరస షాకులు సిట్కి తగలడంతో ప్రతి విషయంపై లీకులు బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు పడకుండా విచారణ చేపడతున్న సిట్ ఏం చేయబోతుందనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది..
తాజావార్తలు
-
Ponguleti Srinvias Reddy : తెలంగాణలో ఇళ్లు లేని వారికి గుడ్న్యూస్ చెప్పిన మంత్రి పొంగులేటి..
-
CJI Surya Kant: ‘‘నకిలీ డిగ్రీలతో వ్యవస్థను చెడగొడుతున్నారు’’.. కాక్రోచ్ వ్యాఖ్యలపై సీజేఐ క్లారిటీ
-
Navakanth : రామ్ చరణ్ కంటికి గాయం కావడంతో నాకు ఏడుపు వచ్చేసింది!
-
Jayam Ravi: 14 ఏళ్లు బానిసలా బతికా.. నాపై క్షుద్ర పూజలు.. ఆ ‘ఇడ్లీ నటి’ వల్లే నా బతుకు ఇలా.. జయం రవి కన్నీరు
-
Trump China Visit: చైనాను అస్సలు నమ్మని ట్రంప్.. చెత్త బుట్టలోకి చైనీస్ గిఫ్ట్స్..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..