Kanaka Durga Temple: నేటితో ముగియనున్న శరన్నవరాత్రులు.. రాజరాజేశ్వరి దేవిగా కనకదుర్గమ్మ..
- ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తులు..
- తెల్లవారుజాము నుంచి క్యూ లైన్లలో బారులు తీరిన భక్తులు..
- రాజరాజేశ్వరి దేవి అలంకారంలో దర్శనమిస్తున్న కనకదుర్గ..
- పెద్ద ఎత్తున తరలివచ్చిన భవానీలు..
- నేటితో ముగియనున్న దసరా శరన్నవరాత్రులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kanaka Durga Temple: విజయవాడ ఇంద్రకీలాద్రికి భక్తులు పోటెత్తారు. విజయదశమి కావడంతో కనకదుర్గ అమ్మవారిని దర్శించుకోవడానికి తెల్లవారుజామునుంచే భక్తులు క్యూ లైన్లలో బారులు తీరారు. దసరా శరన్నవరాత్రులు చివరి రోజు రాజరాజేశ్వరి దేవి అలంకారంలో దుర్గమ్మ భక్తులకు దర్శనం ఇస్తున్నారు. మరోవైపు భవానీలు పెద్ద ఎత్తున ఇంద్రకీలాద్రికి తరలివచ్చారు. ఈసారి భవానీలు ముందుగానే ఇంద్రకీలాద్రికి చేరుకుంటుండటంతో కొండ దిగువ నుంచే భక్తులి కిటకిటలాడుతున్నారు.. క్యూలైన్లు మొత్తం జై దుర్గ.. జై జై దుర్గ నామ స్మరణలతో మారు మ్రోగుతున్నాయి.. భక్తులు, భవానీల రద్దీ కొనసాగుతోన్న నేపథ్యంలో.. మజ్జిగ, మంచినీళ్లు, పాలు క్యూలైన్లలో యథావిథిగా పంపిణీ చేస్తున్నారు అధికారులు.. ఇక, రాత్రి 11 గంటల వరకూ అమ్మవారి దర్శనం కల్పించనున్నారు..
Read Also: Heavy Rains: తుఫాన్పై వాతావరణ శాఖ హెచ్చరిక.. ఏపీతోపాటు తెలంగాణకు భారీ వర్షాలు
Also Read
- Tirupati - Vijayawada Flight: తిరుపతి-విజయవాడ మధ్య కొత్త విమాన సర్వీసులు ప్రారంభం..
- NTR Health University: విద్యార్థులు భయపడాల్సిన అవసరం లేదు.. జీవో 102పై హెల్త్ యూనివర్సిటీ క్లారిటీ
- Sai Krishna Lockup Death Case: సాయి కృష్ణ కేసులో మరో కీలక పరిణామం.. హెడ్ కానిస్టేబుళ్లపై సిట్ ఫోకస్
- Vijay Sai Reddy: కొత్త పార్టీ పెడతా.. నేను సీఎం అభ్యర్థిని కాదు.. విజయసాయిరెడ్డి సంచలన ప్రకటన
మరోవైపు, కనకదుర్గమ్మను రాజరాజేశ్వరీ దేవి అలంకారంలో దర్శనం చేసుకున్నారు ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత.. హోంమంత్రికి కనకదుర్గమ్మ దర్శనం కల్పించారు ఆలయ అధికారులు, అర్చకులు.. దర్శనతరం హోంమంత్రికి వేదాశీర్వచనం చేసి ప్రసాదం, శేషవస్త్రం అందించారు వేదపండితులు.. ఇక, ఇంద్రకీలాద్రి పై భక్తుల రద్దీ అధికంగా ఉంది.. భవానీలు అధికంగా రావడంతో మరింతగా రద్దీ పెరిగింది.. కనకదుర్గమ్మ దర్శనానికి వచ్చే భక్తులతో ఆలయం లోపల సైతం భక్తులతో రద్దీగా మారిపోయింది.. అమ్మవారి దర్శనం చాలా అద్భుతంగా జరిగిందని, రాజరాజేశ్వరీ దేవి అవతారంలో దర్శించుకోవడం సంతోషం గా ఉందని అంటున్నారు భక్తులు.. క్యూలైన్ల లో నాలుగైదు గంటల సమయం పడుతున్నా సౌకర్యాలు బాగున్నాయని చెబుతున్నారు.
తాజావార్తలు
-
OTR : నెల్లిమర్ల నగర పంచాయతీలో ఛైర్మన్ సీటు పంచాయితీ
-
Pothireddypadu : పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద భారీ ప్రమాదం.. తెగిపడిన 9వ గేటు
-
Gyanesh Kumar: ‘సర్’ ఫిర్యాదులు వచ్చే ఎన్నికల నాటికి పరిష్కరిస్తాం.. సీఈసీ కీలక వ్యాఖ్యలు
-
OTR: చిన్నారెడ్డి ఏం చేయబోతున్నాడు..?
-
Story Board : ఉద్యోగ నియామకాల్లో ఎక్కడ తేడా కొడుతోంది ? అన్ని రాష్ట్రాల్లో ఇంతేనా ?
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్లో 350 పరుగులు.. తొలి బ్యాటర్గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?