Kanaka Durga Temple: నేటితో ముగియనున్న శరన్నవరాత్రులు.. రాజరాజేశ్వరి దేవిగా కనకదుర్గమ్మ..
- ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తులు..
- తెల్లవారుజాము నుంచి క్యూ లైన్లలో బారులు తీరిన భక్తులు..
- రాజరాజేశ్వరి దేవి అలంకారంలో దర్శనమిస్తున్న కనకదుర్గ..
- పెద్ద ఎత్తున తరలివచ్చిన భవానీలు..
- నేటితో ముగియనున్న దసరా శరన్నవరాత్రులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kanaka Durga Temple: విజయవాడ ఇంద్రకీలాద్రికి భక్తులు పోటెత్తారు. విజయదశమి కావడంతో కనకదుర్గ అమ్మవారిని దర్శించుకోవడానికి తెల్లవారుజామునుంచే భక్తులు క్యూ లైన్లలో బారులు తీరారు. దసరా శరన్నవరాత్రులు చివరి రోజు రాజరాజేశ్వరి దేవి అలంకారంలో దుర్గమ్మ భక్తులకు దర్శనం ఇస్తున్నారు. మరోవైపు భవానీలు పెద్ద ఎత్తున ఇంద్రకీలాద్రికి తరలివచ్చారు. ఈసారి భవానీలు ముందుగానే ఇంద్రకీలాద్రికి చేరుకుంటుండటంతో కొండ దిగువ నుంచే భక్తులి కిటకిటలాడుతున్నారు.. క్యూలైన్లు మొత్తం జై దుర్గ.. జై జై దుర్గ నామ స్మరణలతో మారు మ్రోగుతున్నాయి.. భక్తులు, భవానీల రద్దీ కొనసాగుతోన్న నేపథ్యంలో.. మజ్జిగ, మంచినీళ్లు, పాలు క్యూలైన్లలో యథావిథిగా పంపిణీ చేస్తున్నారు అధికారులు.. ఇక, రాత్రి 11 గంటల వరకూ అమ్మవారి దర్శనం కల్పించనున్నారు..
Read Also: Heavy Rains: తుఫాన్పై వాతావరణ శాఖ హెచ్చరిక.. ఏపీతోపాటు తెలంగాణకు భారీ వర్షాలు
Also Read
- Vizag, Vijayawada Metro Projects: విశాఖ, విజయవాడ మెట్రోరైల్పై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు..
- Andhra Pradesh Fuel Crisis: ఏపీలో పెట్రోల్, డీజిల్ కొరత.. బంకుల్లో ‘నో స్టాక్’ బోర్డులు.. వాహనదారుల ఇక్కట్లు..
- V Srinivasa Rao: డీలిమిటేషన్పై చంద్రబాబు తప్పుడు ప్రచారం.. విభజన హామీల ప్రకారం ఇప్పటికే మనకు 225 సీట్లు పెరగాలి..
- YS Jagan Former CPRO Srihari Arrested: వైఎస్ జగన్ మాజీ సీపీఆర్వో శ్రీహరి అరెస్ట్..
మరోవైపు, కనకదుర్గమ్మను రాజరాజేశ్వరీ దేవి అలంకారంలో దర్శనం చేసుకున్నారు ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత.. హోంమంత్రికి కనకదుర్గమ్మ దర్శనం కల్పించారు ఆలయ అధికారులు, అర్చకులు.. దర్శనతరం హోంమంత్రికి వేదాశీర్వచనం చేసి ప్రసాదం, శేషవస్త్రం అందించారు వేదపండితులు.. ఇక, ఇంద్రకీలాద్రి పై భక్తుల రద్దీ అధికంగా ఉంది.. భవానీలు అధికంగా రావడంతో మరింతగా రద్దీ పెరిగింది.. కనకదుర్గమ్మ దర్శనానికి వచ్చే భక్తులతో ఆలయం లోపల సైతం భక్తులతో రద్దీగా మారిపోయింది.. అమ్మవారి దర్శనం చాలా అద్భుతంగా జరిగిందని, రాజరాజేశ్వరీ దేవి అవతారంలో దర్శించుకోవడం సంతోషం గా ఉందని అంటున్నారు భక్తులు.. క్యూలైన్ల లో నాలుగైదు గంటల సమయం పడుతున్నా సౌకర్యాలు బాగున్నాయని చెబుతున్నారు.
తాజావార్తలు
-
Off The Record : విచ్చలవిడిగా ఇసుక అక్రమాలు.. మైనింగ్ ఏడీ ఫణిభూషణ్ పై తీవ్ర ఆరోపణలు
-
Story Board : నిర్లక్ష్యానికి శిక్షల్లేవా? పిల్లల మానసిక వేదన పట్టించుకోరా?
-
Arshdeep Singh: వివాదంలో చిక్కుకున్న అర్ష్దీప్ సింగ్.. తిలక్ వర్మ చర్మ రంగుపై అసభ్యకర వ్యాఖ్యలు..
-
DGP CV Anand: ఉగ్ర ముప్పుపై తెలంగాణ అప్రమత్తం.. OCTOPUS యాక్షన్ ప్లాన్..!
-
Russia Oil: ముంచుకొస్తున్న సంక్షోభం.. భారత్కు నిలిచిపోనున్న రష్యా చమురు..
ట్రెండింగ్
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!