Minister Nadendla: కేంద్రానికి బియ్యం సరఫరాలో ఏపీకి గోల్డెన్ ఛాన్స్..
- FCIకి బియ్యం సరఫరాలో రైస్ మిల్లర్లకు మంత్రి నాదెండ్ల సూచనలు..
- సరఫరాలో ఆలస్యం జరగకుండా టెస్టింగ్, ప్యాకింగ్, ట్రాన్స్పోర్ట్లో ముందుండాలి..
- బియ్యం సరఫరాలో ఏపీ రైస్ మిల్లర్లు ముందుండాలి: మంత్రి నాదెండ్ల ఆదేశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Nadendla: విజయవాడలోని సివిల్ సప్లయ్ భవనంలో రైస్ మిల్లర్లతో పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక సమావేశం నిర్వహించారు. FCIకు సీఎంఆర్ 10 శాతం బ్రోకెన్ రైస్ సరఫరా చేయాల్సిన కీలక దశలో.. ఆంధ్రప్రదేశ్కు గోల్డెన్ ఛాన్స్ దక్కిందంటున్నారు. ఏపీలోని రైస్ మిల్లర్లు కేంద్రానికి బియ్యం సరఫరాలో కీలక పాత్ర పోషించేందుకు సిద్ధంగా ఉండాలని మంత్రి సూచించారు. కేంద్ర నిబంధనల ప్రకారం బ్రోకెన్ శాతం 10శాతం లోపు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. సరఫరా ప్రక్రియలో ఆలస్యం జరగకుండా టెస్టింగ్, ప్యాకింగ్, ట్రాన్స్పోర్ట్ ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేయాలని మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
Read Also: Pavel Durov: భవిష్యత్పై టెక్ దిగ్గజాల సూచన.. వైరల్ పోస్ట్..!
Also Read
- Vijayawada Municipal Corporation: బెజవాడ కార్పొరేషన్లో డివిజన్ల పెంపు.. 64 నుంచి 86కు విస్తరణ.. నోటిఫికేషన్ విడుదల
- Fake Liquor Case: నకిలీ మద్యం కేసులో భారీ చార్జ్షీట్ దాఖలు.. 25 మందిపై అభియోగాలు
- Vizag, Vijayawada Metro Projects: విశాఖ, విజయవాడ మెట్రోరైల్పై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు..
- Andhra Pradesh Fuel Crisis: ఏపీలో పెట్రోల్, డీజిల్ కొరత.. బంకుల్లో ‘నో స్టాక్’ బోర్డులు.. వాహనదారుల ఇక్కట్లు..
అలాగే, నాణ్యమైన బియ్యంతో పాటు సమయానికి సరఫరా అనే రెండు అంశాల మీద రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది అని మంత్రి మనోహర్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే పైలెట్ ప్రాజెక్ట్ విజయవంతమైంది.. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కోనసీమ, ఏలూరు జిల్లాల్లో 10 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ పూర్తయింది.. ఇది కేంద్రానికి మంచి సిగ్నల్ అన్నారు. దేశవ్యాప్తంగా ఐదు రాష్ట్రాల నుంచి 50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని FCI సేకరించేందుకు సిద్ధమైంది.. ఈ జాబితాలో ఆంధ్రప్రదేశ్తో పాటు పంజాబ్, హర్యానా, ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలు ఉన్నాయి.. ఈ పోటీలో మనం నిలవాలంటే అందరి కంటే ముందు కదలాల్సిందేనన్నారు. నాణ్యమైన బియ్యంతో, సమయానికి సరఫరా చేయడంతో ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ పేరు నిలబెట్టాల్సిందే అని మంత్రి నాదెండ్ల మనోహర్ తేల్చి చెప్పారు.
తాజావార్తలు
-
Jessica Head: అబ్బె.. ఏం చిల్లరగాళ్లు ఉన్నారా మీరు.! కోహ్లితో వాగ్వాదం.. ట్రావిస్ హెడ్ భార్యకు ఆన్లైన్ వేధింపుల సెగ..
-
Maa Inti Bangaram: సమంతకు విజయ్ షాక్?
-
Vaibhav Sooryavanshi: ఏ జట్టు ఇప్పటివరకు టైటిల్ గెలవలేదు.. రాజస్థాన్ రాయల్స్ రాతను వైభవ్ మారుస్తాడా?
-
Kitchen Tips: దోసెలు పెనానికి అంటుకుపోతున్నాయా..? ఈ చిన్న చిట్కా చాలు..
-
Chukkakura Pachadi Recipe: వేడి అన్నంలో నెయ్యితో “చుక్కకూర పచ్చడి” తింటే.. అబ్బా ఆ రుచే వేరప్ప..!
ట్రెండింగ్
-
Lemon Pickle: చేదు రాకుండా, బూజు పట్టకుండా.. సంవత్సరం పొడవునా పాడవకుండా ‘నిమ్మకాయ పచ్చడి’ చేసేయండి ఇలా..!
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!