Vijayawada Floods: ఎవరి నోట విన్నా వెహికల్ రిపేర్ టాపికే..! ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ కోసం వరద బాధితుల క్యూ..
- వరదలతో దెబ్బతిన్న వేలాది వాహనాలు..
- వాహనాలకు ఇన్సూరెన్స్ క్లెయిమ్స్పై దృష్టిసారించిన ఐఆర్డీఏ..
- వారం రోజుల్లోగా స్టేటస్ రిపోర్ట్ పంపించాలని సూచన..
- లేట్ కాకుండా చూడాలని బీమా కంపెనీలకు ఐఆర్డీఏ ఆదేశం..
- బుడమేరు వరదల్లో మునిగిపోయిన 30 వేలకుపైగా కార్లు..
- బురదలో కూరుకుపోయిన లక్షకుపైగా వాహనాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vijayawada Floods: తెలుగు రాష్ట్రాల్లో వరదలు పూడ్చలేని నష్టాన్ని మిగిల్చాయి. కొంపాగోడు తుడిచిపెట్టుకుపోయాయి. మూగజీవాలు కళ్లముందే జలసమాధయ్యాయి. ఇక వాహనాల సంగతి సరేసరి. బురదలో కూరుకుపోయి.. వరదకు కొట్టుకుపోయి.. నీళ్లలో నానిపోయి.. బయటపడుతున్న బండ్లను చూస్తుంటే ఉసూరుమంటోంది. వందల కార్లు, వేల బైక్లు, ఆటోలు, ట్రాలీలు వారం రోజులుగా ముంపులోనే ఉండిపోయాయి. వరద నీరు నెమ్మదిగా వెళ్లిపోవడంతో బురదలోంచి బయటపడ్డాయి. నొక్కులుపోయి.. రంగుపోయి…అద్దాలు పగిలిపోయి..డోర్లు బిగుసుకుపోయి.. ముఖ్యంగా ఇంజిన్లలోకి నీళ్లు వెళ్లి.. పనికొస్తాయా లేదా అన్నమానంతో ఉన్నారు బాధితులు. కొన్ని వాహనాలు కంటికి కనిపించకుండా పోయాయి. వరద ప్రవాహం ఎటు వెళ్లిందో ఆ అంచనాను బట్టి వెళ్లి వెతుక్కుంటున్నారు కొందరు.
విజయవాడలో లక్షకు పైగా బైక్లు.. 30వేల పైచిలుకు కార్లు.. 5 వేల పైబడి ఆటోలు, ఇతరాత్ర వాహనాలు నీటమునిగాయి. ఇది కేవలం ఇప్పుటి వరకున్న అంచనా మాత్రమే. ప్రస్తుతం ఇవేవీ పనికొచ్చేలా కనపించడం లేదు. రిపేర్ చేసినా ఏం నడుస్తాయో అన్న అనుమానం ఉంది. చివరి ప్రయత్నంగా వాహనాలను బురదలోంచి లాగి మెకానిక్ దగ్గరకు తీసుకెళ్తున్నారు. ప్రస్తుతం విజయవాడలోని ఏ మెకానిక్ షెడ్ చూసినా ఫ్లడ్ ఎఫెక్టెడ్ వెహకిల్సే. ముంపు ప్రాంతాలకు సమీపంలో ఉన్న షాపులన్నీ రద్దీగా మారాయి. ప్రతి షెడ్ దగ్గర వందలాది వాహనాలు నిలిచిపోయాయి. రోజుల సమయం పడుతుందని చెప్పినా బండి నడవడకపోదా అనే ఆశతో రిపేర్ చేయండని చెబుతున్నారు!
Also Read
- Vijayawada: భక్తులకు సువర్ణావకాశం.. ఇంద్రకీలాద్రిపై రేపటి నుంచి ఉచిత యోగా శిక్షణ
- Left Parties Protest: పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలపై వామపక్షాల పోరాటం.. ఉద్యమ కార్యాచరణ ప్రకటన..
- Vijayawada Municipal Corporation: బెజవాడ కార్పొరేషన్లో డివిజన్ల పెంపు.. 64 నుంచి 86కు విస్తరణ.. నోటిఫికేషన్ విడుదల
- Fake Liquor Case: నకిలీ మద్యం కేసులో భారీ చార్జ్షీట్ దాఖలు.. 25 మందిపై అభియోగాలు
అయితే బైక్లకు మోపెడ్లకు పెద్దగా ప్రాబ్లమ్స్ రావని మెకానిక్ నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ కొత్త బండ్లయితే టెన్షన్ పడొద్దని అంటున్నారు. కారు ఇంజిన్లోకి నీళ్లుపోతే బండిని స్టార్ట్ చేయొద్దని సూచిస్తున్నారు. పెట్రోల్ ట్యాంక్ సహా మునిగితే బడ్జెట్ ఎక్కువ అవుతుందని అంటున్నారు. వారంటీలో ఉంటే షో రూం వాళ్లే రిపేర్ చేసే అవకాశం ఉంది. చేసుకున్న ఇన్షూరెన్స్లో వరదలు, భూకంపాల కవరేజీ ఉందో లేదో చెక్ చేసుకుని ఆ ప్రకారం బండిని బాగు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. బైక్లు, కార్లు, ఆటోలు, ఇలా వాహనాలన్నింటినీ శుభ్రం చేసే బాధ్యత కూడా తామే తీసుకుంటామని ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు. వాటికి రిపేర్లు చేయించే బాధ్యత కూడా తమదేనన్నారు. ఆయా వాహనాల ఇన్సూరెన్సు క్లెయిమ్స్ సైతం 15 రోజుల్లో సెటిల్ అయ్యేలా చూసేందుకు బ్యాంకర్లు, ఇన్సూరెన్స్ కంపెనీ ప్రతినిధులతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. ముంపు ప్రాంతాల్లో ఉన్నవారంతా పేద, మధ్యతరగతి ప్రజలే కాబట్టి వారి పట్ల మానవీయ కోణంలో స్పందించాలని అన్నారు. ఈఎంఐల విషయంలో కూడా ఒత్తిడి చేయొద్దని కోరారు చంద్రబాబు.
తాజావార్తలు
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్… సబ్బులు, బాడీ వాష్లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
-
OTR : బండి ఎందుకు దూరమవుతున్నారు.?
-
Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
-
SIPRI 2026: తొలిసారి అణ్వాయుధాలు మోహరించిన భారత్.. వణుకుతున్న శత్రు దేశాలు! సిప్రి షాకింగ్ నివేదిక..
ట్రెండింగ్
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!