Jogi Ramesh: ముగిసిన జోగి రమేష్ సీఐడీ విచారణ.. ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు..
- గంట పాటు మాజీ మంత్రి జోగి రమేష్ ని ప్రశ్నించిన సీఐడీ..
- చంద్రబాబు ఇంటికి నిరసన తెలియజేయానికి మాత్రమే వెళ్లాను..
- ఈ విషయం చంద్రబాబు, లోకేష్ తెలుసుకోవాలన్న రమేష్..
- రెడ్ బుక్ శాశ్వతం కాదు..
- ఒకటి రెండేళ్లు రెడ్ బుక్ నడిచినా తర్వాత మడిచి పెట్టుకోవాల్సిందే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jogi Ramesh: వైసీపీ హయాంలో టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంపై దాడి కేసులో మాజీ మంత్రి జోగి రమేష్తో పాటు 10 మంది నిందితులు సీఐడీ విచారణకు హాజరయ్యారు.. గంటపాటు జోగి రమేష్ను విచారించారు సీఐడీ అధికారులు.. ఇక, విచారణ ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడిన జోగి రమేష్.. చంద్రబాబు ఇంటికి నిరసన తెలియజేయానికి మాత్రమే వెళ్లాను.. ఈ విషయం చంద్రబాబు, లోకేష్ తెలుసుకోవాలని సూచించారు.. రెడ్ బుక్ శాశ్వతం కాదు.. ఒకటి రెండేళ్లు రెడ్ బుక్ నడిచినా తర్వాత రెడ్ బుక్ మడిచి పెట్టుకోవాల్సిందే అంటూ హాట్ కామెంట్లు చేశారు.. మంచి చేస్తేనే ఈ ప్రభుత్వం ఉంటుంది.. లేకపోతే ఉండదు అనే విషయం తెలుసుకోవాలన్న ఆయన.. జగన్ పాలన కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు.. ఎల్లకాలం కూటమి అధికారంలో ఉంటుందని అనుకోవద్దు.. ప్రజలను మోసం చేసిన ఈ ప్రభుత్వం ఎల్లకాలం ఉండదు.. ఇది మోసాల ప్రభుత్వం.. సీఐడీ అధికారులు ఎప్పుడు పిలిచినా విచారణకు సహకరిస్తాను అని స్పష్టం చేశారు.
Read Also: IDBI: ఐడీబీఐలో స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ జాబ్స్.. భారీగా జీతం.. అర్హులు వీరే!
Also Read
- Narayana: త్రేతాయుగంలో రావణుడు విలన్.. కలియుగంలో రావణ్ను హీరో చేశారు..
- NIA Raids: విజయవాడలో ఎన్ఐఏ విస్తృత సోదాలు.. టెర్రర్ లింక్స్ కేసులో మూడు ప్రాంతాల్లో తనిఖీలు
- Chinta Mohan: అయోధ్య అవినీతిపై సీబీఐ విచారణ జరపాలి.. కేంద్ర మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు
- Saikrishna Mother Vijayalakshmi: "నా కొడుకు పవన్ కళ్యాణ్ అభిమాని.. క్రిమినల్ అని ఎలా అంటారు?".. సాయికృష్ణ తల్లి ఆగ్రహం..
సుప్రీం కోర్టు ఉత్తర్వుల మేరకు సీఐడీ అధికారుల ఇచ్చిన నోటీసుపై విచారణకు వచ్చాను.. సీఐడీ అధికారులు అడిగిన అన్ని విషయాలకు సమాధానం చెప్పాను అన్నారు జోగి రమేష్.. నాడు అయ్యన్న పాత్రుడు మాట్లాడిన మాటలకు చంద్రబాబు వద్ద నిరసన కోసమే వెళ్లాను.. నేను దాడి చేయలేదు.. నా కారు అద్దాలు పగలకొట్టి.. మా వాళ్లపై టీడీపీ నేతలు దాడి చేశారు.. మేం ఎవరిపై దాడి చేయలేదు.. నిరసన తెలపడం కోసమే వెళ్లాం.. సీఐడీ నోటీసులతో భయటపెట్టాలని చూస్తున్నారు.. నేను ఎవరికి భయపడను.. వైఎస్సార్ శిష్యుడిని.. నేను నిక్కర్లు వేసిన నాటి నుంచి కృష్ణా జిల్లా రాజకీయాల్లో ఉన్నాను. 10 నెలల కాలంలో అట్టడుగు స్థానానికి టీడీపీ వెళ్లిపోయిందన్నారు..
Read Also: Akkada Ammayi Ikkada Abbayi Review: అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి రివ్యూ
అధికారం ఉందని విర్రవీగి కేసులు పెట్టాలని చూస్తే ఇదంతా తాత్కాలికం అని గుర్తు పెట్టుకోవాలని హెచ్చరించారు జోగి రమేష్.. పరిపాలన చేయమని ఓట్లు వేస్తే రాష్ట్రంలో దోపిడీలు, హత్యలు, మానభంగాలు జరుగుతున్నాయి. అధికారం కోసం కొట్లాటకు దిగుతున్నారు, దోచుకోవడం కోసం ఆరాట పడుతున్నారు.. పీఠంపై కొడుకు ఎక్కాలా..? దత్త పుత్రుడు ఎక్కాలా..? అనేది రాష్ట్రంలో నడుస్తుందన్నారు.. ఇవన్నీ ఎప్పటి కేసులు.. ఎప్పుడు నోటీసులు ఇస్తున్నారు అని ఫైర్ అయ్యారు.. మమ్మల్ని ఏమి చేయలేరు మళ్లీ అధికారంలోకి వస్తాం అనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జోగి రమేష్..
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!