Indrakiladri: ఇంద్రకీలాద్రిపై ముగిసిన దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు.. కాసేపట్లో తెప్పోత్సవం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు పూర్ణాహుతితో ముగిశాయి. తొమ్మిది రోజుల పాటు పది అలంకారాలలో దుర్గమ్మ దర్శనమిచ్చింది. పూర్ణాహుతి కార్యక్రమంలో మంత్రి కొట్టు సత్యనారాయణ, చైర్మన్ కర్నాటి రాంబాబు, ఎండోమెంట్ కమిషనర్, ఈవో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తొమ్మిది రోజుల పాటు వైభోవోపేతంగా దసరా ఉత్సవాలు జరిగాయని అన్నారు. ఏపీ ప్రజలకు మంత్రి కొట్టు సత్యనారాయణ దసరా శుభాకాంక్షలు తెలిపారు.
Read Also: Samsung Neo QLED 4K Tv : అదిరిపోయే ఫీచర్స్ తో మరో కొత్త టీవీని లాంచ్ చేసిన శాంసంగ్..
Also Read
- Vijayawada Municipal Corporation: బెజవాడ కార్పొరేషన్లో డివిజన్ల పెంపు.. 64 నుంచి 86కు విస్తరణ.. నోటిఫికేషన్ విడుదల
- Fake Liquor Case: నకిలీ మద్యం కేసులో భారీ చార్జ్షీట్ దాఖలు.. 25 మందిపై అభియోగాలు
- Vizag, Vijayawada Metro Projects: విశాఖ, విజయవాడ మెట్రోరైల్పై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు..
- Andhra Pradesh Fuel Crisis: ఏపీలో పెట్రోల్, డీజిల్ కొరత.. బంకుల్లో ‘నో స్టాక్’ బోర్డులు.. వాహనదారుల ఇక్కట్లు..
మధ్యాహ్నం నుంచి అమ్మవారు రాజరాజేశ్వరి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారని మంత్రి కొట్టు సత్యనారాయణ పేర్కొన్నారు. రేపు కూడా రాజరాజేశ్వరి దేవి అలంకారం కొనసాగుతుందన్నారు. భవానీ దీక్షా పరులు లక్షలాదిగా వస్తారని అంచనా వేస్తున్నాం.. అందుకు తగ్గ ఏర్పాట్లు చేశామని తెలిపారు. సాయంత్రం కృష్ణానదిలో శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల తెప్పోత్సవం నిర్వహిస్తున్నాం.. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశామన్నారు.
Read Also: Karnataka: కర్ణాటకలో విద్యుత్తు కొరత.. కాంగ్రెస్ సర్కార్ పై కుమారస్వామి ఆరోపణలు
ఇదిలా ఉంటే.. కృష్ణానదిలో తెప్పోత్సవానికి సర్వం సిద్ధం చేశారు. మరికాసేపట్లో శ్రీ గంగా పార్వతి సమేత మల్లేశ్వర స్వామి వార్ల ఉత్సవ మూర్తులు కృష్ణానదిలో విహరించనున్నారు. తొలుత శివాలయం మెట్ల మార్గం నుంచి ఊరేగింపుగా ఉత్సవ మూర్తులు దుర్గాఘాట్ కు చేరుకోనున్నట్లు మంత్రి తెలిపారు. దుర్గాఘాట్ వద్ద శ్రీ గంగా పార్వతి సమేత మల్లేశ్వర స్వామి వార్ల ఉత్సవ మూర్తులకు వైదిక కమిటీ సభ్యులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అనంతరం కృష్ణానదిలో స్వామి వార్లు మూడు రౌండ్లు విహరించనున్నారు. అయితే ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు పాస్ లు ఉన్న వారిని మాత్రమే అనుమతించనున్నారు అధికారులు. మరోవైపు పున్నమి ఘాట్, ప్రకాశం బ్యారేజి, దుర్గగుడి ఫ్లై ఓవర్ పైనుంచి తెప్పోత్సవాన్ని వీక్షించేందుకు ఏర్పాట్లు చేశారు. భక్తులు తెప్పోత్సవాన్ని వీక్షించేందుకు అత్యధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉండడంతో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.
తాజావార్తలు
-
IPL Team: కొత్త ఐపీఎల్ జట్టులో దిగ్గజాలు.. CSK, MI, RCB తట్టుకునేనా..?
-
GPS, 5ATM వాటర్ రెసిస్టెన్స్, 110+ పైగా స్పోర్ట్స్ మోడ్లతో Realme Watch S5 ఎంట్రీ.!
-
Natural Hair Tonic : పలుచటి జుట్టుకు గుడ్బై.. ఇంట్లోనే తయారయ్యే మ్యాజికల్ హెయిర్ టానిక్.!
-
Cabbage Egg Sandwich : కొరియన్ స్ట్రీట్ స్టైల్ ‘క్యాబేజీ ఎగ్ శాండ్విచ్’.. 5 నిమిషాల్లో పిల్లల లంచ్ బాక్స్ కోసం సూపర్ రెసిపీ.!
-
Twisha Sharma: ట్విషా శర్మ మరణానికి ముందు ఎక్కడకెళ్లిందంటే.. వెలుగులోకి వీడియో
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!