Indrakiladri: ఇంద్రకీలాద్రిపై ముగిసిన దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు.. కాసేపట్లో తెప్పోత్సవం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు పూర్ణాహుతితో ముగిశాయి. తొమ్మిది రోజుల పాటు పది అలంకారాలలో దుర్గమ్మ దర్శనమిచ్చింది. పూర్ణాహుతి కార్యక్రమంలో మంత్రి కొట్టు సత్యనారాయణ, చైర్మన్ కర్నాటి రాంబాబు, ఎండోమెంట్ కమిషనర్, ఈవో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తొమ్మిది రోజుల పాటు వైభోవోపేతంగా దసరా ఉత్సవాలు జరిగాయని అన్నారు. ఏపీ ప్రజలకు మంత్రి కొట్టు సత్యనారాయణ దసరా శుభాకాంక్షలు తెలిపారు.
Read Also: Samsung Neo QLED 4K Tv : అదిరిపోయే ఫీచర్స్ తో మరో కొత్త టీవీని లాంచ్ చేసిన శాంసంగ్..
Also Read
- Sai Krishna Death Case: సాయికృష్ణ డెత్ కేసులో కీలక మలుపు.. లొంగిపోయిన హెడ్ కానిస్టేబుళ్లు అశోక్, నాని.!
- Chicken and Egg Prices: నాన్వెజ్ ప్రియులకు ధరల షాక్.. భారీగా పెరిగిన చికెన్, గుడ్ల ధరలు
- CM Chandrababu Naidu: యోగాతో హెల్తీ, వెల్తీ ఆంధ్రప్రదేశ్ నిర్మాణం.!
- Sai Krishna Missing Case: సాయికృష్ణ కేసులో కొత్త ట్విస్ట్.. నవీన్రెడ్డి హత్యతో లింకులపై ఫోకస్
మధ్యాహ్నం నుంచి అమ్మవారు రాజరాజేశ్వరి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారని మంత్రి కొట్టు సత్యనారాయణ పేర్కొన్నారు. రేపు కూడా రాజరాజేశ్వరి దేవి అలంకారం కొనసాగుతుందన్నారు. భవానీ దీక్షా పరులు లక్షలాదిగా వస్తారని అంచనా వేస్తున్నాం.. అందుకు తగ్గ ఏర్పాట్లు చేశామని తెలిపారు. సాయంత్రం కృష్ణానదిలో శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల తెప్పోత్సవం నిర్వహిస్తున్నాం.. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశామన్నారు.
Read Also: Karnataka: కర్ణాటకలో విద్యుత్తు కొరత.. కాంగ్రెస్ సర్కార్ పై కుమారస్వామి ఆరోపణలు
ఇదిలా ఉంటే.. కృష్ణానదిలో తెప్పోత్సవానికి సర్వం సిద్ధం చేశారు. మరికాసేపట్లో శ్రీ గంగా పార్వతి సమేత మల్లేశ్వర స్వామి వార్ల ఉత్సవ మూర్తులు కృష్ణానదిలో విహరించనున్నారు. తొలుత శివాలయం మెట్ల మార్గం నుంచి ఊరేగింపుగా ఉత్సవ మూర్తులు దుర్గాఘాట్ కు చేరుకోనున్నట్లు మంత్రి తెలిపారు. దుర్గాఘాట్ వద్ద శ్రీ గంగా పార్వతి సమేత మల్లేశ్వర స్వామి వార్ల ఉత్సవ మూర్తులకు వైదిక కమిటీ సభ్యులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అనంతరం కృష్ణానదిలో స్వామి వార్లు మూడు రౌండ్లు విహరించనున్నారు. అయితే ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు పాస్ లు ఉన్న వారిని మాత్రమే అనుమతించనున్నారు అధికారులు. మరోవైపు పున్నమి ఘాట్, ప్రకాశం బ్యారేజి, దుర్గగుడి ఫ్లై ఓవర్ పైనుంచి తెప్పోత్సవాన్ని వీక్షించేందుకు ఏర్పాట్లు చేశారు. భక్తులు తెప్పోత్సవాన్ని వీక్షించేందుకు అత్యధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉండడంతో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: బుడ్డోడికి మళ్లీ నిరాశే.. ఇంగ్లండ్తో తొలి టీ20లోనూ ‘నో ఛాన్స్’.!
-
ENG vs IND 1st T20: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్! ప్లేయింగ్ XI లో ఎవరెవరంటే?
-
Kayadu Lohar: అందుకే హిట్లున్నా లేకున్నా వరుస ఆఫర్లు!
-
Pawan Kalyan: సోషల్ మీడియా దుర్వినియోగంపై ఉక్కుపాదం మోపుతాం.. ‘ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్’ పేరుతో దూషణలు ఇక కుదరవు.!
-
US: అమెరికాలో విషాదం.. ఆకస్మిక వరదల్లో ఏపీ యువకుడు మృతి
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!