Indrakiladri: ఇంద్రకీలాద్రిపై ముగిసిన దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు.. కాసేపట్లో తెప్పోత్సవం
ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు పూర్ణాహుతితో ముగిశాయి. తొమ్మిది రోజుల పాటు పది అలంకారాలలో దుర్గమ్మ దర్శనమిచ్చింది. పూర్ణాహుతి కార్యక్రమంలో మంత్రి కొట్టు సత్యనారాయణ, చైర్మన్ కర్నాటి రాంబాబు, ఎండోమెంట్ కమిషనర్, ఈవో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తొమ్మిది రోజుల పాటు వైభోవోపేతంగా దసరా ఉత్సవాలు జరిగాయని అన్నారు. ఏపీ ప్రజలకు మంత్రి కొట్టు సత్యనారాయణ దసరా శుభాకాంక్షలు తెలిపారు.
Read Also: Samsung Neo QLED 4K Tv : అదిరిపోయే ఫీచర్స్ తో మరో కొత్త టీవీని లాంచ్ చేసిన శాంసంగ్..
Also Read
- Andhra Pradesh Fuel Crisis: ఏపీలో పెట్రోల్, డీజిల్ కొరత.. బంకుల్లో ‘నో స్టాక్’ బోర్డులు.. వాహనదారుల ఇక్కట్లు..
- V Srinivasa Rao: డీలిమిటేషన్పై చంద్రబాబు తప్పుడు ప్రచారం.. విభజన హామీల ప్రకారం ఇప్పటికే మనకు 225 సీట్లు పెరగాలి..
- YS Jagan Former CPRO Srihari Arrested: వైఎస్ జగన్ మాజీ సీపీఆర్వో శ్రీహరి అరెస్ట్..
- Fire Services Week: అగ్నిమాపక శాఖ వారోత్సవాలకు శ్రీకారం.. నిబంధనలు కఠినంగా అమలు చేయాల్సిందే..
మధ్యాహ్నం నుంచి అమ్మవారు రాజరాజేశ్వరి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారని మంత్రి కొట్టు సత్యనారాయణ పేర్కొన్నారు. రేపు కూడా రాజరాజేశ్వరి దేవి అలంకారం కొనసాగుతుందన్నారు. భవానీ దీక్షా పరులు లక్షలాదిగా వస్తారని అంచనా వేస్తున్నాం.. అందుకు తగ్గ ఏర్పాట్లు చేశామని తెలిపారు. సాయంత్రం కృష్ణానదిలో శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల తెప్పోత్సవం నిర్వహిస్తున్నాం.. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశామన్నారు.
Read Also: Karnataka: కర్ణాటకలో విద్యుత్తు కొరత.. కాంగ్రెస్ సర్కార్ పై కుమారస్వామి ఆరోపణలు
ఇదిలా ఉంటే.. కృష్ణానదిలో తెప్పోత్సవానికి సర్వం సిద్ధం చేశారు. మరికాసేపట్లో శ్రీ గంగా పార్వతి సమేత మల్లేశ్వర స్వామి వార్ల ఉత్సవ మూర్తులు కృష్ణానదిలో విహరించనున్నారు. తొలుత శివాలయం మెట్ల మార్గం నుంచి ఊరేగింపుగా ఉత్సవ మూర్తులు దుర్గాఘాట్ కు చేరుకోనున్నట్లు మంత్రి తెలిపారు. దుర్గాఘాట్ వద్ద శ్రీ గంగా పార్వతి సమేత మల్లేశ్వర స్వామి వార్ల ఉత్సవ మూర్తులకు వైదిక కమిటీ సభ్యులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అనంతరం కృష్ణానదిలో స్వామి వార్లు మూడు రౌండ్లు విహరించనున్నారు. అయితే ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు పాస్ లు ఉన్న వారిని మాత్రమే అనుమతించనున్నారు అధికారులు. మరోవైపు పున్నమి ఘాట్, ప్రకాశం బ్యారేజి, దుర్గగుడి ఫ్లై ఓవర్ పైనుంచి తెప్పోత్సవాన్ని వీక్షించేందుకు ఏర్పాట్లు చేశారు. భక్తులు తెప్పోత్సవాన్ని వీక్షించేందుకు అత్యధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉండడంతో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.
తాజావార్తలు
-
Screen Time Effects : స్క్రీన్ సమయం పెరగడం వల్ల మైగ్రేన్లు వస్తాయా.?
-
Off The Record : సీఎం సరికొత్త టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారా? బీజేపీ టార్గెట్ గా వ్యూహాలు?
-
AP Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు కీలక నిర్ణయం..
-
Off The Record : ఉమ్మడి కర్నూలులో తమ్ముళ్ల సెగ.. సీనియర్ నేతలు అసంతృప్తితో రగిలిపోవడానికి కారణమేంటి?
-
OnePlus Realme Merger: విలీనం కానున్న వన్ప్లస్, రియల్మీ..!?
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!