ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు పూర్ణాహుతితో ముగిశాయి. తొమ్మిది రోజుల పాటు పది అలంకారాలలో దుర్గమ్మ దర్శనమిచ్చింది. కృష్ణానదిలో తెప్పోత్సవానికి సర్వం సిద్ధం చేశారు. మరికాసేపట్లో శ్రీ గంగా పార్వతి సమేత మల్లేశ్వర స్వామి వార్ల ఉత్సవ మూర్తులు కృష్ణానదిలో విహరించనున్నారు.
Medak: దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు కన్నుల పండువగా కొనసాగుతున్నాయి. నవరాత్రులలో, తొమ్మిది రోజుల పాటు, దుర్గా దేవి యొక్క తొమ్మిది విభిన్న రూపాలను పూజిస్తారు. ఇందులో భాగంగా మెదక్ జిల్లా ఏడు పాయలలో వన దుర్గా మాత దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శరన్నవరాత్రి ఉత్సవాల్లో ఐదవరోజు భాగంగా మహాలక్ష్మి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనిమస్తున్నారు. 5 లక్షల 11 వేల నగదుతో అమ్మవారిని అర్చకులు అలంకరించారు. ఉదయం నుంచే భక్తులు అమ్మవారిని చూసేందుకు పెద్ద…