Prakasam Barrage: ప్రకాశం బ్యారేజీకి తగ్గుతోన్న వరద.. బెజవాడకు ముప్పు తప్పినట్టేనా..?
- బెజవాడకు ముప్పుతగ్గినట్టేనా..?
- ప్రకాశం బ్యారేజీకి గంట గంటకూ తగ్గుతోన్న వరద ఉధృతి..
- మధ్యాహ్నం 12 గంటలకు రికార్డ్ స్థాయిలో 11.43 లక్షల క్యూసెక్కుల వరద..
- రాత్రి 9 గంటల వరకు 11.20 లక్షల క్యూసెక్కులకు తగ్గిన ఇన్ఫ్లో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Prakasam Barrage: కృష్ణాలో నీళ్లు ఎగదన్నితే.. నరకం ఎలా ఉంటుందో బెజవాడ వాసుల ప్రత్యక్షంగా చూస్తున్నారు.. కన్నీటి బాధలను అనుభవిస్తున్నారు. కృష్ణానది, మున్నేరువాగు, బుడమేరు.. ఒకేసారి ఉగ్రరూపం దాల్చడంతో.. బెజవాడ మొత్తం మునిగిపోయింది. ప్రజలు క్షణమొక యుగంలా గడుపుతున్నారు. శాంతించమ్మా కృష్ణమ్మా అంటూ.. వరద నీటిలోనే వేడుకుంటున్నారు. సాగర్ కింద వచ్చే వరద.. కృష్ణానదికి ఇబ్బందికరంగా మారుతోంది. అమావాస్య కారణంగా.. కృష్ణాలోకి నీళ్లు పోవడం లేదు.. వెనక్కి వచ్చేస్తున్నాయి. దీంతో లక్షల మంది నిరాశ్రయులయ్యారు. అన్నమో రామచంద్రా అంటూ వేడుకుంటున్నారు. కాపాడండి మహాప్రభో అంటూ విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే.. బెజవాడ వాసులు క్రమంగా ఊపిరి పీల్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.. ప్రకాశం బ్యారేజీకి గంట గంటకూ వరద తగ్గుతోంది.. మధ్యాహ్నం 3 గంటల నుంచి క్రమంగా వరద తగ్గుతోంది.. మధ్యాహ్నం 12 గంటలకు రికార్డ్ స్థాయిలో ప్రకాశం బ్యారేజీకి 11.43 లక్షల క్యూసెక్కుల వరద రాగా.. రాత్రి 9 గంటల వరకు ప్రకాశం బ్యారేజీకి 11.20 లక్షల క్యూసెక్కులకు తగ్గింది ఇన్ఫ్లో.. ఇక, క్రమంగా వరద మరింత తగ్గే అవకాశం ఉందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.. బుడమేరుకూ ప్రస్తుతం ఇన్ఫ్లో నాలుగు వేల క్యూసెక్కుల మాత్రమే ఉంటుందంటున్నారు ఇరిగేషన్ శాఖ అధికారులు..
Also Read
- Narayana: త్రేతాయుగంలో రావణుడు విలన్.. కలియుగంలో రావణ్ను హీరో చేశారు..
- NIA Raids: విజయవాడలో ఎన్ఐఏ విస్తృత సోదాలు.. టెర్రర్ లింక్స్ కేసులో మూడు ప్రాంతాల్లో తనిఖీలు
- Chinta Mohan: అయోధ్య అవినీతిపై సీబీఐ విచారణ జరపాలి.. కేంద్ర మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు
- Saikrishna Mother Vijayalakshmi: "నా కొడుకు పవన్ కళ్యాణ్ అభిమాని.. క్రిమినల్ అని ఎలా అంటారు?".. సాయికృష్ణ తల్లి ఆగ్రహం..
కాగా, బుడమేరు వాగులో భారీగా వరదనీరు చేరడంతో లోతట్టు ప్రాంతాలకు వరద ఉధృతి పెరిగిన విషయం విదితమే.. దీంతో దిగువన ఉన్న నివాస వీధుల్లోకి భారీగా వర్షపు నీరు చేరింది. అనేక మంది ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్నారు. గుడివాడ నియోజకవర్గం నందివాడ మండలం పుట్టగుంట వద్ద ప్రమాద భరితంగా ప్రవహిస్తోంది. వంతెనకు నాలుగు అడుగుల మేర నీటి ప్రవాహం ఉంది. అధికారుల ఆదేశాలతో గుడివాడ హనుమాన్ జంక్షన్ రహదారిని పోలీసులు మూసివేశారు. మరోవైపు అంబాపురంపైన ఉన్న పాములు కాలువ, వాగులేరు కట్టలు తెగాయి. ఎన్టీఆర్ జిల్లాలో మున్నేరు ఉగ్రరూపం దాల్చింది. పరివాహక గ్రామాల్లో లోతట్టు ప్రాంతాలన్నీ మునిగిపోయాయి. ప్రమాదకర స్థాయిలో పెనుగంచిప్రోలు చెరువు ప్రవహిస్తోంది. లింగాల, పెనుగంచిప్రోలు వంతెనలపై ప్రమాద స్థాయిలో వరద చేరింది. ఈ క్రమంలోనే తిరుపతమ్మ ఆలయాన్ని వరద చుట్టుముట్టడంతో పాటు దుకాణాల్లోకి చేరింది. పలుచోట్ల విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. రహదారులపై గుంతలు పడటంతో పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి.
Read Also: Top Headlines @ 9 PM: టాప్ న్యూస్
బెజవాడ దుఃఖదాయని బుడమేరు నగరంపై విరుచుకుపడింది. అతి భారీ వర్షాలకు తోడు బుడమేరు పొంగడంతో బెజవాడ నగరవాసులు వణికిపోయారు.. బుడమేరుకు నీటిప్రవాహం పెరిగి వరద పోటెత్తింది. విజయవాడ పశ్చిమ, మధ్య నియోజకవర్గాల్లోని చాలా ప్రాంతాలు వరద గుప్పిట్లో చిక్కుకున్నాయి. రెండురోజుల పాటు కురిసిన భారీ వర్షాలకు నగరం నీట మునిగింది. బుడమేరు పొంగడంతో పరిస్థితి మరింత దిగజారింది. దాదాపు 3 లక్షల మంది ఆహారం, తాగునీరు లేక అల్లాడుతున్నారు. వారి ఇళ్లన్నీ ఆరడుగుల మేర నీటిలో మునిగాయి. బుడమేరు ముంపు సమస్య ఇప్పటిది కాదు. దీన్ని నిర్లక్ష్యం చేసిన పాపం ఇప్పుడు నగరాన్ని ముంచెత్తింది అంటున్నారు.. రెండు రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాలకు విజయవాడ నగరం చిగురుటాకులా వణుకుతోంది. ఎక్కడికక్కడ నిలిచిన వరదతో జనజీవనం అస్తవ్యస్తమైంది. నగరంలోని సింగ్నగర్, కానూరులోని కల్పన నగర్, మాణిక్యనగర్, సనత్నగర్తోపాటు పలు కాలనీల్లోని రహదారులు తటాకాల్లా మారాయి. మురుగుకాల్వల వ్యవస్థ సరిగ్గా లేకపోవడంతో ఆ ప్రాంతమంతా జలదిగ్బంధమైంది. ఏరు-దారి ఏకమైపోవడంతో ఇళ్లలోంచి బయటకు రావాలంటేనే ప్రజలు భయపడిపోతున్నారు. అయితే, ప్రకాశం బ్యారేజీకి ఇన్ఫ్లో తగ్గడంతో ఇప్పుడు ఊపిరి పీల్చుకుంటున్నారు బెజవాడ ప్రజలు.. మరోవైపు.. విజయవాడ-హైదరాబాద్ హైవేపై సైతం నీటి ప్రవాహం తగ్గడంతో.. ఏపీ-తెలంగాణ మధ్య రాకపోకలు తిరిగి ప్రారంభించారు.. అయితే, హైవేపై బురద పేరుకుపోవడంతో.. నిదానంగా వాహనాలను పంపిస్తున్నారు.
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!