Cyclone Montha: విజయవాడకు మొంథా తుఫాన్ ముప్పు.. రోడ్లపైకి రావద్దు..! నగరవాసులకు వీఎంసీ వార్నింగ్
- విజయవాడపై మొంథా తుఫాన్ ఎఫెక్ట్..
- రేపు 16.2 సెం.మీ వర్షపాతం నమోదయ్యే అవకాశం..
- వాతావరణ శాఖ హెచ్చరికలతో అప్రమత్తమయ్యారు అధికారులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cyclone Montha: తీరం వైపు దూసుకొస్తున్న మొంథా తుఫాన్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాలను టెన్షన్ పెడుతోంది.. మొంథా తుఫాన్ ప్రభావంతో రేపు విజయవాడలో 162 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలతో అప్రమత్తమయ్యారు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ (వీఎంసీ) అధికారులు.. రేపు అత్యవసరమైతే తప్పా ప్రజలకు ఇళ్ల నుంచి బయటకు రావద్దని సూచిస్తున్న అధికారులు.. తీవ్రత ఎక్కువ ఉంటే దుకాణాలు, వాణిజ్య సంస్థలు మూసివేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు అధికారులు.. మెడికల్ షాపులు, కూరగాయలు, పాలు విక్రయ దుకాణాలు తెరుచుకోవచ్చని సూచిస్తున్నారు.. రోడ్లపై రాకపోకలు తగ్గించుకోవాలని వార్నింగ్ ఇచ్చారు వీఎంసీ అధికారులు.. చివరకు వాకింగ్ కి వెళ్లొద్దని సూచించారు.. మరోవైపు, ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్, వీఎంసీ ప్రధాన కార్యాలయంలో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు.. అత్యవసర పరిస్థితుల్లో ఎన్టీఆర్ జిల్లా కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్: 9154970454, వీఎంసీ కంట్రోల్ రూమ్: 0866 2424172, 0866 2422515, 0866 2427485 ఫోన్ నెంబర్లకు సంప్రదించాలని అధికారులు సూచిస్తున్నారు..
Read Also: Flights Cancelled: మొంథా తుఫాన్ ఎఫెక్ట్.. పలు విమానాలు రద్దు..
Also Read
- Vijayawada: భక్తులకు సువర్ణావకాశం.. ఇంద్రకీలాద్రిపై రేపటి నుంచి ఉచిత యోగా శిక్షణ
- Left Parties Protest: పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలపై వామపక్షాల పోరాటం.. ఉద్యమ కార్యాచరణ ప్రకటన..
- Vijayawada Municipal Corporation: బెజవాడ కార్పొరేషన్లో డివిజన్ల పెంపు.. 64 నుంచి 86కు విస్తరణ.. నోటిఫికేషన్ విడుదల
- Fake Liquor Case: నకిలీ మద్యం కేసులో భారీ చార్జ్షీట్ దాఖలు.. 25 మందిపై అభియోగాలు
మొత్తంగా మొంథా తుపాన్ నేపథ్యంలో అప్రమత్తమయ్యారు విజయవాడ నగర పాలక సంస్థ అధికారులు.. నగరంలోని లోతట్టు ప్రాంతాలకు వరద, ముంపు సమస్య ఉంటుందని అధికారుల అంచనా వేస్తున్నారు.. కొండ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.. రేపు భారీ వర్షం, ఈదురు గాలుల ప్రభావంతో కొండ చెరియలు విరిగిపడే అవకాశం ఉన్నందున ఆయా ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు అధికారులు.. ఇప్పటికే వీఎంసీ పరిధిలోని 64 డివిజన్లలో 40 వరకు పునరావాస కేంద్రాలను సిద్ధం చేశారు. లోతట్టు ప్రాంతాల్లో ముంపు సమస్య లేకుండా నీటిని తోడేందుకు ట్యాంకర్లు, జేసీబీలను సిద్ధంగా ఉంచారు విజయవాడ నగర పాలక సంస్థ అధికారులు.
తాజావార్తలు
-
Nithya Menen: మెగాఫోన్ పట్టనున్న నిత్యా మీనన్?
-
Netanyahu vs Erdogan: ఇజ్రాయెల్-టర్కీ మధ్య మాటల యుద్ధం.. మధ్యప్రాచ్యంలో కొత్త టెన్షన్!
-
Soya Manchurian: పిల్లలు లొట్టలేసుకుంటూ తినే ‘మిల్ మేకర్ మంచూరియా’.. టేస్టీగా, హెల్తీగా ఇంట్లోనే ఇలా ఈజీగా చేసేయండి!
-
Krrish 4 : ‘క్రిష్ 4’ ఆలస్యానికి కారణం అదే?
-
LGBT – A Legal Battle: ‘ఎల్జీబీటీ’ల ఆక్రందనలపై సినిమా.. జూన్ 19న విడుదల!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!