Traffic Police: వివాదాస్పదంగా మారిన ట్రాఫిక్ పోలీసుల వ్యవహారం..!
- వివాదాస్పదంగా విజయవాడ ట్రాఫిక్ పోలీసుల వ్యవహారం..
- రూల్స్ పాటించని వాహనదారులకు జరిమానాలు..
- సోషల్ మీడియాలో రీల్స్ చేయడంపై వివాదం..
Traffic Police: విజయవాడ నగరంలో ట్రాఫిక్ పోలీసులు నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు నడుపుతున్న వాహన చోదకుల పట్ల వ్యవహరిస్తున్న తీరు విమర్శలకు కారణమవుతోంది.. నగర వ్యాప్తంగా పోలీసులు స్పెషల్ డ్రైవ్ ల పేరుతో హెల్మెట్లు ధరించని, లైసెన్స్ లేని వాహనాలను గుర్తించి.. వారికి జరిమానాలు విధిస్తున్నారు.. జరిమానాలు విధించడంతో పాటుగా వాళ్లకి అవగాహన కూడా కల్పిస్తున్నారు. అయితే, ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ఈ వ్యవహారం అంతా రిల్స్ రూపంలో మార్చి అప్లోడ్ చేస్తున్నారు.. ఇదంతా ప్రజలకు అవగాహన కల్పించడం కోసమే అని పోలీసులు చెబుతున్నారు. ఇక్కడ వరకు వ్యవహారం బానే ఉన్నప్పటికీ ఇటీవల కాలంలో ట్రాఫిక్ పోలీసులు చేస్తున్న అతి.. వాహన దారులకు ఇబ్బంది కలిగిస్తోంది. జరిమానాలు విధిస్తే చెల్లిస్తామని అలా కాకుండా సోషల్ మీడియాలో తమ వీడియోలను పోస్ట్ చేయటంపై మండిపడుతున్నారు వాహన చోదకులు.
Read Also: Manchu Lakshmi : మహేశ్ బాబును ఆ ప్రశ్న అడిగే ధైర్యం ఉందా..
Also Read
- Andhra Pradesh Fuel Crisis: ఏపీలో పెట్రోల్, డీజిల్ కొరత.. బంకుల్లో ‘నో స్టాక్’ బోర్డులు.. వాహనదారుల ఇక్కట్లు..
- V Srinivasa Rao: డీలిమిటేషన్పై చంద్రబాబు తప్పుడు ప్రచారం.. విభజన హామీల ప్రకారం ఇప్పటికే మనకు 225 సీట్లు పెరగాలి..
- YS Jagan Former CPRO Srihari Arrested: వైఎస్ జగన్ మాజీ సీపీఆర్వో శ్రీహరి అరెస్ట్..
- Fire Services Week: అగ్నిమాపక శాఖ వారోత్సవాలకు శ్రీకారం.. నిబంధనలు కఠినంగా అమలు చేయాల్సిందే..
వాహన చోదకులను ఆపి వాళ్ల వీడియోలు తీసి సోషల్ మీడియాలో ట్రాఫిక్ పోలీసులు యూట్యూబ్లో ద్వారా అప్లోడ్ చేయించే వ్యవహారం వివాదాస్పదంగా మారింది.. ఇదే విషయంపై సిపి రాజశేఖర్ బాబు వరకు వ్యవహారం వెళ్లడంతో అవగాహన కల్పించే వరకు వీడియోలను రీల్స్ తీయమని చెబుతున్నామని అంతకుమించి ఇబ్బంది కలిగేలా ఉంటే మాత్రం చర్యలు తీసుకుంటామని కూడా ఆయన స్పష్టం చేశారు. ఇంత జరిగిన తర్వాత కూడా పోలీసుల తీరులో మాత్రం మార్పు రాలేదనేది తాజా ఘటనతో తెలుస్తోంది. BRTS రోడ్డులో 2 రోజుల క్రితం ఇదే విషయంలో ఉద్రిక్తతకు కారణమైంది. ఫుడ్ జంక్షన్ లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు చేస్తూ యూ ట్యూబర్లతో కలిసి రీల్స్ చేస్తున్నారు. యువకులను మందలిస్తున్నట్టు వీడియోలు చేసే క్రమంలో ట్రాఫిక్ ఎస్ఐ బూతులు తిట్టదంతో వివాదం మొదలైంది. దీంతో పోలీసులకు యువకులు వాగ్విదానికి దిగారు. పోలీసుల తీరును తప్పుపట్టారు. దీంతో ట్రాఫిక్ పోలీసులు అదనపు సిబ్బందిని ఘటన స్థలానికి పిలిపించారు. యువకులకు సీఐ స్థాయి అధికారి వచ్చి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. కాలర్ మైక్ పెట్టుకుని విధులు నిర్వర్తిస్తున్న పోలీసుల తీరుపై విమర్శలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో తమను ఏదో తప్పు చేసినట్టు గా పోలీసులు చూపించటం ద్వారా అవమానిస్తున్నారని యువకులు ఆవేదన వ్యక్త చేస్తున్నారు. చాలానాలు చెల్లిస్తామని చెప్పినప్పటికీ ఈ విధంగా రీల్స్ చేస్తూ వాటిని యూట్యూబ్లో పోస్ట్ చేయడం సరికాదని నగరవాసులు అంటున్నారు.. ఇకనైనా సీపీ ఈ వ్యవహారంపై దృష్టి సారించి ట్రాఫిక్ పోలీసుల అతిపై నియంత్రణ చర్యలు చేపట్టాలని కోరుతున్నారు..
తాజావార్తలు
-
రితేష్-జెనీలియా డ్రీమ్ ప్రాజెక్ట్ ‘రాజా శివాజీ’ అడ్వాన్స్ బుకింగ్స్ షురూ!
-
Infosysకు 20 ఎకరాల స్థలం కేటాయింపు.. ఏపీ సర్కార్ ఉత్తర్వులు
-
Telangana Legislative Council: ఎమ్మెల్సీలుగా ప్రమాణస్వీకారం చేసిన అజారుద్దీన్, ప్రో. కోదండరాం
-
Faria Abdullah: అతని కోసమే నేను ఇండస్ట్రీలోకి వచ్చాను..
-
MS. Subbalakshmi : ఎం.ఎస్. సుబ్బలక్ష్మి బయోపిక్ పుకార్లపై క్లారిటీ ఇచ్చిన బన్ని వాస్
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!