Budameru Floods: పొంగి ప్రవహిస్తున్న బుడమేరు.. విజయవాడ నగరవాసులకు టెన్షన్..!
- విజయవాడ నగరవాసులను మరోసారి బుడమేరు టెన్షన్..
- రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు..
- పలుచోట్ల పొంగి ప్రవహిస్తోన్న బుడమేరు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Budameru Floods: విజయవాడ నగరవాసులను మరోసారి బుడమేరు వరద టెన్షన్ పెడుతుంది.. గత ఏడాది ఇదే సమయంలో నగరాన్ని ముంచెత్తింది బుడమేరు వరద.. భారీ నష్టాన్ని చవిచూడాల్సి వచ్చింది.. అదో పీడకలగా మారిపోయింది.. అయితే, రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో పలుచోట్ల పొంగి ప్రవహిస్తోంది బుడమేరు.. గుణదల ఒకటవ డివిజన్ లోని వంతెనపై నుంచి బుడమేరు ప్రవహిస్తోంది.. దీంతో, వంతెనపై రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.. అయితే, వరద ఉధృతి పెరిగితే బుడమేరు అంచున ఉన్న ఇళ్లలోకి నీరు చేరే అవకాశం ఉంది.. మరోవైపు, ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి వరద ఉధృతి పెరిగితే గత ఏడాది పరిస్థితులు పునరావృతం అవుతాయని బుడమేరు పరివాహ ప్రాంతాల ప్రజల్లో ఆందోళన మొదలైంది.. వరద నీటితో పాటు పాములు, తేళ్లు, విష పురుగులు ఇళ్లలోకి వస్తున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. ఇక, బుడమేరు ప్రవాహానికి అడ్డుగా ఉన్న తూటుకాడను వీఎంసీ సిబ్బంది తొలగిస్తున్నారు.. మరోసారి గత ఏడాది పరిస్థితులు పునరావృతం కాకుండా అధికారులు స్పందించి సహాయక చర్యలు చేపట్టాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు..
Read Also: Donald Trump: పుతిన్ కాస్కో.. యుద్ధం ఆగకపోతే దబిడి దిబిడే.. ట్రంప్ హెచ్చరిక
Also Read
- CM Chandrababu Naidu: యోగాతో హెల్తీ, వెల్తీ ఆంధ్రప్రదేశ్ నిర్మాణం.!
- Sai Krishna Missing Case: సాయికృష్ణ కేసులో కొత్త ట్విస్ట్.. నవీన్రెడ్డి హత్యతో లింకులపై ఫోకస్
- Baba Ramdev Visits Kanaka Durga Temple: బెజవాడ కనకదుర్గమ్మ సేవలో బాబా రాందేవ్
- Sai Krishna Missing Case: సాయి కృష్ణ కుటుంబానికి అండగా ప్రభుత్వం.. సీఎం భరోసాతో సంతృప్తి వ్యక్తం చేసిన తల్లి
మరోవైపు, మైలవరం నియోజకవర్గంలోని ఇబ్రహీంపట్నం కొండపల్లి శాంతి నగర్ వద్ద బుడమేరు వరద పరిస్థితిని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ పరిశీలించారు.. బుడమేరు గండ్లు పరిస్థితిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. గతంలో గండి పడి విజయవాడ మునిగిన నేపథ్యంలో.. అక్కడి పరిస్థితిపై ఆరా తీశారు.. ఎటువంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.. వెలగలేరు రెగ్యులేటర్ వద్ద వచ్చే వరద నీటిని బట్టి ఇతర బ్రాంచ్ కాల్వలకు నీరు మల్లించాలని, దిగువకు సామర్థ్యం మించి విడుదల చేయొద్దని సూచించారు.. ఇక, బుడమేరు వల్ల ఎటువంటి ప్రమాదం రాదని.. విజయవాడ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేదని, సోషల్ మీడియాలో వచ్చే అనవసర సమాచారం సమ్మొద్దని ప్రజలకు సూచించారు అధికారులు..
తాజావార్తలు
-
Saikrishna Lockup Death: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ దూకుడు.. మరో ఇద్దరు పోలీసుల కోసం గాలింపు!
-
Ayodhya: అయోధ్య రామాలయ విరాళాల కుంభకోణంలో కీలక పరిణామం.. ట్రస్ట్ కీలక సభ్యులు రాజీనామా..
-
Women’s World Cup 2026: రన్రేట్ ప్లస్.. కానీ ఆసీస్తో నెక్స్ట్ మ్యాచ్! సెమీఫైనల్ చేరాలంటే భారత్కు ఉన్న అవకాశాలివే..
-
CM Yogi: “ఎవ్వరినీ వదిలి పెట్టను”.. అయోధ్య విరాళాల దుర్వినియోగంపై సీఎం యోగి ఆగ్రహం..
-
Online Shopping: ఒక్క పైసా ఖర్చు చేయకుండా ఆన్లైన్ షాపింగ్… కొరియాలో ఊపందుకుంటున్న కొత్త ట్రెండ్
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!