Budameru Floods: పొంగి ప్రవహిస్తున్న బుడమేరు.. విజయవాడ నగరవాసులకు టెన్షన్..!
- విజయవాడ నగరవాసులను మరోసారి బుడమేరు టెన్షన్..
- రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు..
- పలుచోట్ల పొంగి ప్రవహిస్తోన్న బుడమేరు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Budameru Floods: విజయవాడ నగరవాసులను మరోసారి బుడమేరు వరద టెన్షన్ పెడుతుంది.. గత ఏడాది ఇదే సమయంలో నగరాన్ని ముంచెత్తింది బుడమేరు వరద.. భారీ నష్టాన్ని చవిచూడాల్సి వచ్చింది.. అదో పీడకలగా మారిపోయింది.. అయితే, రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో పలుచోట్ల పొంగి ప్రవహిస్తోంది బుడమేరు.. గుణదల ఒకటవ డివిజన్ లోని వంతెనపై నుంచి బుడమేరు ప్రవహిస్తోంది.. దీంతో, వంతెనపై రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.. అయితే, వరద ఉధృతి పెరిగితే బుడమేరు అంచున ఉన్న ఇళ్లలోకి నీరు చేరే అవకాశం ఉంది.. మరోవైపు, ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి వరద ఉధృతి పెరిగితే గత ఏడాది పరిస్థితులు పునరావృతం అవుతాయని బుడమేరు పరివాహ ప్రాంతాల ప్రజల్లో ఆందోళన మొదలైంది.. వరద నీటితో పాటు పాములు, తేళ్లు, విష పురుగులు ఇళ్లలోకి వస్తున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. ఇక, బుడమేరు ప్రవాహానికి అడ్డుగా ఉన్న తూటుకాడను వీఎంసీ సిబ్బంది తొలగిస్తున్నారు.. మరోసారి గత ఏడాది పరిస్థితులు పునరావృతం కాకుండా అధికారులు స్పందించి సహాయక చర్యలు చేపట్టాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు..
Read Also: Donald Trump: పుతిన్ కాస్కో.. యుద్ధం ఆగకపోతే దబిడి దిబిడే.. ట్రంప్ హెచ్చరిక
Also Read
- Vijayawada Crime: స్నాప్లో పరిచయం.. చనిపోతానంటూ బెదిరింపులు.. యువతి నుంచి రూ.1.38 కోట్లు వసూలు
- VMC Contractors Strike: వీఎంసీ కాంట్రాక్టర్లతో మంత్రి నారాయణ చర్చలు సఫలం.. సమ్మె విరమణ
- Nara Lokesh: యువత ఇతర రాష్ట్రాలకు వెళ్లొద్దు.. మన అమరావతి, విశాఖ, కర్నూలులోనే ఉద్యోగాలు..
- Sai Krishna Death Case: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో మరో కీలక అరెస్ట్
మరోవైపు, మైలవరం నియోజకవర్గంలోని ఇబ్రహీంపట్నం కొండపల్లి శాంతి నగర్ వద్ద బుడమేరు వరద పరిస్థితిని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ పరిశీలించారు.. బుడమేరు గండ్లు పరిస్థితిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. గతంలో గండి పడి విజయవాడ మునిగిన నేపథ్యంలో.. అక్కడి పరిస్థితిపై ఆరా తీశారు.. ఎటువంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.. వెలగలేరు రెగ్యులేటర్ వద్ద వచ్చే వరద నీటిని బట్టి ఇతర బ్రాంచ్ కాల్వలకు నీరు మల్లించాలని, దిగువకు సామర్థ్యం మించి విడుదల చేయొద్దని సూచించారు.. ఇక, బుడమేరు వల్ల ఎటువంటి ప్రమాదం రాదని.. విజయవాడ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేదని, సోషల్ మీడియాలో వచ్చే అనవసర సమాచారం సమ్మొద్దని ప్రజలకు సూచించారు అధికారులు..
తాజావార్తలు
-
Veligonda Project: నేడే సీఎం చంద్రబాబు చేతులమీదుగా వెలిగొండ ప్రాజెక్టు ఫేజ్-1 ప్రారంభం.!
-
Rahul Gandhi: రాహుల్ గాంధీపై ఎఫ్ఐఆర్.. హల్ద్వానీ ‘శుద్ధీకరణ’ వివాదంలో కేసు నమోదు
-
Viswanath & Sons: 16 రోజులైనా తగ్గని జోరు.. రూ.240 కోట్ల క్లబ్లోకి సూర్య సినిమా
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Shamli Encounter: అంకిత్ బలియాన్ హత్య కేసులో కీలక మలుపు.. పోలీసుల ఎన్కౌంటర్లో ఇద్దరు నిందితులు హతం
ట్రెండింగ్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!