ఈనెల 23న జరగాల్సిన గ్రూప్-2 పరీక్షలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC ) హాల్ టికెట్లు విడుదల చేసింది. psc.ap.gov.in. సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని ఏపీపీఎస్సీ తెలిపింది. 23న ఉదయం 10 గంటల నుంచి 12.30 వరకు.. మధ్యాహ్నం 3 గంటల నుంచి 5.30 వరకు పరీక్ష జరగనుంది. కాగా.. పరీక్షా కేంద్రాలకు కేవలం హాల్ టికెట్ మాత్రమే తీసుకురావాలని.. వేరే వస్తువులను ఏమీ తీసుకురావొద్దని ఏపీపీఎస్సీ సూచించింది.