Andhra Cricket Association: ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక
- ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక..
- ఏసీఏ అధ్యక్షుడిగా కేశినేని శివనాథ్ (కేశినేని చిన్ని)..
- ఏసీఏ కార్యదర్శిగా సానా సతీష్తో సహా 34 మందితో నూతన కమిటీ ఎన్నిక..
- మూడేళ్ల కాలపరిమితితో పనిచేయనున్న నూతన కమిటీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Andhra Cricket Association: ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) నూతన కమిటీ ఏకగ్రీవంగా ఎన్నికైంది.. ఏసీఏ అధ్యక్షుడిగా కేశినేని శివనాథ్ (కేశినేని చిన్ని), కార్యదర్శిగా సానా సతీష్తో సహా 34 మందితో నూతన కమిటీ ఏకగ్రీవంగా ఎన్నిక కాగా.. మూడేళ్ల కాలపరిమితితో ఆంధ్రప్రదేశ్లో క్రికెట్ అభివృద్ధికి కృషి చేయనుంది నూతన కమిటీ.. ఈ ఎన్నికలకు అధికారిగా వ్యవహరించారు నిమ్మగడ్డ రమేష్ కుమార్.. ఈ సందర్భంగా ఏసీఏ అధ్యక్షుడు, ఎంపీ కేశినేని చిన్ని మాట్లాడుతూ.. ఏసీఏ నూతన కార్యవర్గం ఎన్నికైంది.. మూడేళ్లల్లో రాష్ట్రంలో క్రికెట్ అభివృద్ధికి కృషి చేస్తాం అన్నారు.. మౌలిక సదుపాయాలు కల్పించి జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులుగా తీర్చిదిద్దుతాం.. ఎక్కువ మంది క్రీడాకారులను తయారు చేస్తాం.. ఐపీఎల్ తరహాలో ఏపీఎల్ నిర్వహిస్తామని వెల్లడించారు.. అసోసియేషన్ ప్రతిష్ట పెంచేలా మేం పనిచేస్తామని తెలిపారు ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) అధ్యక్షుడు, విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని..
Read Also: Trump-Zelenskyy: సోమవారం అమెరికాకు జెలెన్స్కీ పయనం.. ట్రంప్తో కీలక భేటీ
Also Read
- Perni Nani: డీఎస్సీ నియామకాలపై కొత్త వివాదం.. బహిరంగ చర్చకు రావాలన్న పేర్ని నాని
- Sai Krishna Custodial Death Case: సాయికృష్ణ కేసులో కీలక మలుపు.. హత్య కేసు కొట్టేయాలంటూ హైకోర్టుకు సీఐ నాగరాజు
- Sai Krishna Custodial Death Case: సాయి కృష్ణ కేసు కొత్త మలుపు.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
- Home Minister Anitha: ‘ఫ్యూచర్ రెడీ ఏపీ పోలీస్’ వర్క్షాప్.. పోలీసు వ్యవస్థపై హోంమంత్రి కీలక వ్యాఖ్యలు
మరోవైపు ఏసీఏ కార్యదర్శి సానా సతీష్ మాట్లాడుతూ.. 2025-28 కాల పరిమితికి ఏసీఏ ఎన్నిక జరిగింది.. ఒక్క వైస్ ప్రెసిడెంట్ మినహా అందరూ ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యారని వెల్లడించారు.. గత 11 నెలలుగా ఎఫెక్స్ కమిటీ సహకారంతో బాగా పని చేశారు.. విశాఖ స్టేడియం అభివృద్ధి, ఏపీఎల్ టోర్నీల నిర్వహణ సమర్థవంతంగా సాగింది.. ఇరవై లక్షల నుంచి నలభై లక్షలకు జిల్లా అసోసియేషన్లు పెంచాం.. కొంతమంది క్రీడాకారులను ఇంగ్లాండ్ పంపామని వెల్లడించారు.. రెడ్ బాల్, వైట్ బాల్ ఆట వల్ల క్రీడాకారులు కొంత గందరగోళంలో ఉన్నారు.. ఇది గుర్తించి వేర్వేరుగా క్రీడాకారులకు శిక్షణ ఇస్తున్నాం అన్నారు..
Read Also: Nagarjuna 100 Film: పుట్టినరోజున మైల్స్టోన్ మూవీ అనౌన్స్మెంట్.. నాగ్ లుక్ కూడా సిద్ధం?
ఇక, విష్ణు కుమార్ రాజు స్వయంగా ఎఫెక్స్ కమిటీ నుంచి తప్పుకున్నారు.. ఆయన కేవలం విశాఖలో అభివృద్ధి కోసం పని చేస్తా అన్నారని వివరించారు సానా సతీష్.. అయితే, చివరి నిమిషంలో వైస్ ప్రెసిడెంట్ గా నామినేషన్ వేయడంతో డిస్ క్వాలిఫై అయ్యింది.. సెప్టెంబర్లో జరిగే సమావేశంలో వైస్ ప్రెసిడెంట్ ఎన్నిక జరుగుతుందన్నారు.. వివాదాలు అన్నీ పరిష్కరించుకుని మేము ముందుకు వెళుతున్నాం.. వివాదరహిత అసోసియేషన్ గా మేం క్రికెట్ అభివృద్ధిపై దృష్టి పెట్టాం.. మూడేళ్లల్లో తప్పకుండా ఏసీఏ మంచి పని తీరుతో అన్ని సమస్యలు పరిష్కరిస్తాం.. క్రీడాకారులు కోసం ప్రత్యేకంగా అదనపు కోచ్ లను నియమిస్తాం.. MSK ప్రసాద్ ఏపీకి ఆడారు.. అంతర్జాతీయ క్రికెట్ లో రాణించారు.. ఆయన సేవలను ప్రభుత్వం గుర్తించి అకాడమీకి స్థలం కేటాయించి గౌరవించిందని వెల్లడించారు ఏసీఏ కార్యదర్శి సానా సతీష్.
తాజావార్తలు
-
Rainy Season Tips : వర్షాకాలంలో వానపాముల బెడదా..? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా చెక్ పెట్టండి.!
-
New Railway Line: రైల్వే ప్రయాణికులకు అదిరే న్యూస్.. 17 కి.మీ మేర కొత్త రైల్వే లైన్కు గ్రీన్ సిగ్నల్..
-
Minister Kolusu Parthasarathy: అభివృద్ధికి అడ్డంకిగా వ్యవహరిస్తున్నారు.. యువతను రౌడీయిజం వైపు ప్రోత్సహిస్తున్నారు..!
-
Bankipur Results: బీజేపీ కంచుకోటలో సంచలనం.. భారీ ఆధిక్యంలో దూసుకెళ్తున్న ప్రశాంత్ కిషోర్
-
7050mAh భారీ బ్యాటరీ, 6.83 అంగుళాల కర్వ్డ్ OLED డిస్ప్లే, 50MP Sony కెమెరాతో రానున్న vivo S2.!
ట్రెండింగ్
-
Mushroom Onion Pakoda: ఈజీ స్నాక్ రెసిపీ..10 నిమిషాల్లో కరకరలాడే ‘మష్రూమ్ ఆనియన్ పకోడీ’.! చేసేయండి ఇలా..
-
Mumbai Indians Captain: ముగ్గురు దిగ్గజాల సపోర్ట్.. తెలుగు ఆటగాడికి ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ!
-
ప్రీమియం ఫీచర్లు బడ్జెట్ ధరలో.. 50MP OIS కెమెరా, సూపర్ AMOLED డిస్ప్లేతో Samsung Galaxy F70 Pro 5G లాంచ్..!
-
Best Cricketing Brain: ఎంఎస్ ధోనీ కాదు, అతడే బెస్ట్ క్రికెటింగ్ బ్రెయిన్.. ఆ టీమిండియా మాజీ స్టార్ ఎవరంటే?
-
Tata దూకుడు మాములుగా లేదుగా.. Nexon నుంచి ప్రీమియం Avinya X వరకు భారీ ప్లాన్..!