Vijayasai Reddy: కాంగ్రెస్ పాదయాత్ర.. మృత్యువుకు ముందు తుదిశ్వాస
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vijayasai Reddy Counter On Bharat Jodo Padayatra: రాజకీయంగా బీజేపీ ఆల్రెడీ ఫుల్ దూకుడుమీదున్న సంగతి తెలిసిందే! వివిధ రకాల కార్యక్రమాలు, పాదయాత్రలతో ప్రజల దృష్టిని ఆకర్షించేందుకు ముమ్మర ప్రయత్నాలు కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలోనే బీజేపీ జోరుకి అడ్డుకట్ట వేసి, వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని కాంగ్రెస్ కూడా సరికొత్త వ్యూహాలు పన్నుతోంది. ఇందులో భాగంగానే దేశవ్యాప్తంగా భారత్ జోడో యాత్ర చేపట్టేందుకు సిద్ధమైంది. బీజేపీ విచ్ఛిన్నకర రాజకీయాలు చేస్తోందని, భారత్ను ఐక్యంగా ఉంచాల్సిన అవసరం ఉందని చెబుతూ.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఈ భారత్ జోడో యాత్రకు రెడీ అయ్యారు. కన్యాకుమారి ఉంచి కశ్మీర్ వరకు.. 12 రాష్ట్రాల గుండా మొత్తం 3,500 కి.మీ. మేర ఈ పాదయాత్ర కొనసాగనుంది. సెప్టెంబరు 7వ తేదీ నుంచి ఈ యాత్ర షురూ కానుంది.
ఈ క్రమంలోనే ఈ యాత్రపై వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి స్పందించారు. కాంగ్రెస్ చేపడుతున్న ఈ భారత్ జోడో యాత్ర.. ప్రజల్ని తప్పుదోవ పట్టించేదిగా ఉందని అన్నారు. నెహ్రూ కుటుంబం ఎన్నికల్లో గెలవలేనంత మాత్రాన భారత్ విచ్ఛిన్నమైందని కాదని.. భారత్ ఎప్పుడూ విచ్ఛిన్నం కాలేదు, ఇప్పుడు విచ్ఛిన్నంగా లేదు, ఇకపై కూడా విచ్ఛిన్నం కాబోదని అన్నారు. ‘‘ఈ పాదయాత్ర విషయంలో కాంగ్రెస్ను నేను ఇచ్చే సలహా ఒక్కటే.. భారత్ జోడో యాత్రకి బదులు, ‘మృత్యువుకు ముందు తుదిశ్వాస’ అని ఈ యాత్రకి పేరు మార్చుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం’’ అని విజయసాయి రెడ్డి వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది. అంతకుముందు విజయసాయి రెడ్డి గణేశ్ చతుర్థు సందర్భంగా.. ఏపీ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. అన్ని అడ్డంకుల్ని తొలగించి.. సరైన నిర్ణయాలు తీసుకునేలా జ్ఞానం, తెలివితేటల్ని ఆ విగ్నేశ్వరుడు ప్రసాదించాలని కోరుతూ ట్వీట్ చేశారు.
Also Read
తాజావార్తలు
-
NBK112: బాలయ్య – కొరటాల సినిమా క్యాన్సిలా! కారణం ఇదేనా?
-
CM Revanth Reddy: మీరు కొనుకున్న భూమి ఎక్కడికీ పోదు.. నేనే రిజిస్ట్రేషన్ చేయిస్తా: సీఎం రేవంత్ రెడ్డి
-
Kolkata: కోల్కతా ఆస్పత్రిలో నర్సు మృతదేహం.. ఆర్జీకర్ తరహాలో కలకలం!
-
Bollywood vs South: పాత్ర కోసమా? పాపులారిటీ కోసమా? హీరోయిన్ల బోల్డ్ మేకోవర్పై హాట్ చర్చ!
-
Rahul Gandhi: అమెరికా-ఇరాన్లకు పాక్ మధ్యవర్తి.. మోడీ ఫారిన్ పాలసీపై రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు..
ట్రెండింగ్
-
బ్లాక్ డిజైన్, హైబ్రిడ్ పవర్తో Toyota Hyryder Aero Black Edition వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే..!
-
5,000 నిట్స్ డిస్ప్లే, 50MP కెమెరాలు, 6,500mAh బ్యాటరీతో Vivo X300 FE కొత్త వేరియంట్ లాంచ్..!
-
Airtel Recharge Plans: రూ.299 సహా 4 ప్రీపెయిడ్ ప్లాన్లు తొలగింపు.. ఇకపై కొత్త ఆప్షన్లు ఇవే.!
-
Money Plant Growing Tips: మానీ ప్లాంట్ వేగంగా, గుబురుగా పెరగాలంటే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి.!
-
CSK Head Coach: సీఎస్కే హెడ్ కోచ్గా వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్!