Ushashri Charan: మహిళలు దుర్గమ్మ అవతారమెత్తితే.. టీడీపీ నేతల రాజకీయ సంహారం ఖాయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ushashri Charan Fires On Chandrababu Naidu: టీడీపీ, ఆ పార్టీ అధినేత చంద్రబాబుపై మహిళా శిశు సంక్షేమ శాఖా మంత్రి ఉష శ్రీ చరణ్ తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. చంద్రబాబు డ్వాక్రా మహిళలను నిలువునా మోసం చేశారని ఆరోపించారు. చంద్రబాబు దిగిపోయే సమయంలో 80 వేల సంఘాలే ఉండేవని, జగన్ వచ్చాక రెండు లక్షలకు పైగా సంఘాలు వచ్చాయని అన్నారు. డ్వాక్రా మహిళల కష్టాలు చూశాక నాలుగు దఫాలుగా నగదు చెల్లిస్తున్నారని పేర్కొన్నారు. అన్ని సంఘాలు కూడా ప్రగతిబాటలో నడుస్తున్నాయని చెప్పారు. డ్వాక్రా మహిళలను ఎవ్వరు బెదిరించడం లేదని, ఏ పథకం తీసుకున్నా మహిళలకే 50 శాతం వెళ్తున్నాయని స్పష్టం చేశారు. మహిళలు ఎక్కువగా తమ సభలకే వస్తున్నారని ధీమా వ్యక్తం చేశారు.
రాజకీయంగా మహిళలకు మంచి ప్రాధాన్యత ఉందని, మంచి అవకాశాలు వస్తున్నాయని ఉష శ్రీ పేర్కొన్నారు. మహిళల ఖాతాల్లో పథకాల డబ్బులు నేరుగా పడుతున్నాయని, అందుకే సీఎం జగన్ను చూడటానికి మహిళలు సభలకు ఎక్కువగా వస్తున్నారన్నారు. అయితే.. సభలకు వచ్చే మహిళలపై అనవసర రాతలు రాసి, దుష్ప్రచారం చేయటం కరెక్ట్ కాదని హితవు పలికారు. మహిళలపై చంద్రబాబు హయాంలో ఎన్ని దాడులు జరిగాయో అందరూ చూశామని.. రిషితేశ్వరి, వనజాక్షి లాంటి వారిపై ఆకృత్యాలు టీడీపీ హయాంలోనే ఎన్నో వెలుగు చూశాయని అన్నారు. కానీ జగన్ హయాంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందుతున్నాయని.. 30 లక్షల మంది మహిళల పేరు మీద ఇళ్ల స్థలాలు ఇచ్చామని చెప్పారు. మహిళలకు నిజమైన స్వావలంబన జగన్ పాలనలోనే దక్కిందని.. రాజకీయంగా కూడా అనేక పదవులు దక్కాయని వెల్లడించారు.
Also Read
- AP Govt: ఏపీకి పెట్టుబడుల వెల్లువ.. రూ.2 లక్షల కోట్లకు ఎస్ఐపీబీ ఆమోదం.. 39 వేల మందికి ఉద్యోగ అవకాశాలు..
- TTD: టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయాలు.. అభివృద్ధి పనులకు కోట్లు కేటాయింపు!
- MLC Ananthababu: ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్ రద్దుపై తీర్పు రేపటికి వాయిదా!
- Poleramma Jatara 2026: వెదురుపాకలో పోలేరమ్మతల్లి జాతర.. సందడి చేసిన దేవిశ్రీ ప్రసాద్!
ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో.. ఎల్లో మీడియా ఈ 16 నెలలు ఇంకా అధికంగా విషం చిమ్మేలా వార్తలు రాస్తారని ఉష శ్రీ ఆరోపణలు చేశారు. కానీ.. వాటిని జనం నమ్మే పరిస్థితిలో లేరని ఎద్దేవా చేశారు. చంద్రబాబును మహిళలు నమ్మరని, అందుకే ఇలాంటి వార్తలని ఆయన నమ్ముకున్నారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మహిళలందరూ దుర్గమ్మ అవతారం ఎత్తితే.. ఈ టీడీపీ నేతలను రాజకీయ సంహారం చేయటం ఖాయమని హెచ్చరించారు.
తాజావార్తలు
-
NANI : నాని ఫ్యాన్స్కు నిరాశ.. ‘బ్లడీ రోమియో’ వాయిదా.. ‘OG 2’పై సుజీత్ ఫోకస్
-
Mamata Banerjee: మమతా బెనర్జీకి షాక్ మీద షాక్.. ఆ 9 మంది ఎమ్మెల్యేలు ఏమయ్యారు..?
-
Pat Cummins: ఏదో పెద్ద ప్లాన్ వేసినట్లు నటించా.. పంజాబ్ స్టార్ ప్లేయర్ ఈజీగా బుట్టలో పడ్డాడు!
-
Vijay’s Convoy Security Withdrawn: విజయ్ కి షాక్ భద్రత తొలగింపు.. ప్రమాణ స్వీకారంపై ఉత్కంఠ
-
Viral: ఓ వైపు బండ రాళ్ల మధ్య ఇరుక్కున్న బాలుడి తల.. అదే సందులో విషపూరిత పాము.. చివరకు ఏమైందంటే..
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!