AP Capitals: 3 రాజధానులు.. కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్లో మూడు రాజధానులు ఏర్పాటు చేసి తీరుతామంటూ రాష్ట్ర మంత్రులు స్పష్టంగా చెబుతున్నమాట.. అయితే, మూడు రాజధానుల అంశంపై కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే కీలక వ్యాఖ్యలు చేశారు.. విజయవాడలో ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆయన.. వైఎస్ జగన్ ప్రభుత్వం మూడు చోట్ల రాజధానులు చేస్తామంటోందన్నారు. ఒక రాజధాని అమరావతిలోనే సరిగ్గా అభివృద్ధి జరగడంలేదు.. ఇలాంటి సమయంలో మూడు చోట్ల రాజధానుల ప్రతిపాదన సరైంది కాదన్నారు.. రెండు చోట్ల రాజధానులు పెట్టినా పర్వలేదు అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.. ఇక, మూడు చోట్ల రాజధానులు ఉంటే ప్రజలకు సౌలభ్యంగానే ఉంటుంది.. కానీ, మూడు చోట్ల అభివృద్ధి చేయటం కష్టమని తెలిపారు అథవాలే.
Read Also: RK Roja: కేసీఆర్పై ఫైర్బ్రాండ్ ప్రశంసలు..
Also Read
మరోవైపు, ఏపీకి ప్రత్యేక హోదా కోసం సీఎం వైఎస్ జగన్.. ప్రధాని నరేంద్ర మోడీని కలిసి వివరించాలని సూచించారు అథవాలే… వైఎస్ జగన్కు పాలించే అవకాశం రావటం చంద్రబాబుకు పెద్ద ఎదురుదెబ్బగా అభివర్ణించిన ఆయన.. రాష్ట్ర అభివృద్ధి కోసం బీజేపీతో చేతులను కలపాలని సూచించానన్నారు.. జగన్ పాలన బాగానే చేస్తున్నారని పేర్కొన్న ఆయన.. ఏపీకి కేంద్రం నుంచి ఆర్ధిక సహాయం కోసం నేను ప్రయత్నిస్తానన్నారు.. ఇక, వివాదాస్పందంగా మారిన హిజాబ్ అంశంపై స్పందిస్తూ.. హిజాబ్ అంశం కర్ణాటక ప్రభుత్వ నిర్ణయం అని స్పష్టం చేశారు.. మతం స్కూళ్లల్లో వెళ్లకూడదన్నది నా అభిప్రాయంగా తెలిపిన ఆయన.. స్కూళ్లలో బుర్ఖాలు ధరించాల్సిన అవసరం లేదన్నారు. మరోవైపు. అన్ని మంచి బిల్లులకు వైసీపీ తమకు పార్లమెంట్లో మద్దతు ఇస్తోందని ఈ సందర్భంగా గుర్తుచేశారు అథవాలే.
తాజావార్తలు
-
Preity Zinta-Shreyas Iyer: ఇది ఆటేనా అసలు.. శ్రేయస్ అయ్యర్పై ప్రీతి జింటా ఫైర్!
-
Stock Market Crash: స్టాక్ మార్కెట్ కొంప ముంచిన ట్రంప్ ప్రకటన.. ప్రారంభంలోనే సెన్సెక్స్ 800, నిఫ్టీ 250 పాయింట్లు డౌన్!
-
Tollywood : చదువుకోవడం కోసం సినిమాలకు బ్రేక్ ఇచ్చిన టాలీవుడ్ హీరోయిన్
-
Donald Trump: త్వరగా నిర్ణయం తీసుకోండి, లేకపోతే మీకు ఏమీ మిగలదు.. ఇరాన్ను మళ్లీ హెచ్చరించిన ట్రంప్
-
Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..