కిషన్రెడ్డి జన ఆశీర్వాద యాత్ర.. సాగనుంది ఇలా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేంద్ర మంత్రి జి. కిషన్రెడ్డి జన ఆశీర్వాద యాత్రకు సిద్ధం అవుతున్నారు.. యాత్ర ఏర్పాట్లపై భారతీయ జనతా పార్టీ నేతలు సమావేశం నిర్వహించారు… ఈ యాత్రకు స్వాగత కార్యక్రమాలు, చిన్న చిన్న సభలు, బైక్ ర్యాలీలు, కార్యకర్తల సమ్మేళనాలు.. నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నారు… తన యాత్రలో భాగంగా వనజీవి రామయ్య, చింతకింది మల్లేశంలను కలవనున్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. ఇక, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కిషన్రెడ్డి టూర్కు సంబంధించిన షెడ్యూల్ను పరిశీలిస్తే.. తిరుమల శ్రీవారిని, బెజవాడ దుర్గమ్మను దర్శించుకున్న తర్వాత.. తెలంగాణలోని కోదాడ నుంచి ఆయన యాత్ర ప్రారంభం కానుంది.
ఈ నెల 15వ తేదీ రాత్రి తిరుమలకు చేరుకోనున్నారు కిషన్రెడ్డి.. 16న ఉదయం శ్రీవారి దర్శనం.. మధ్యాహ్నం 4.30 గంటలకు విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై అమ్మ వారి దర్శనం చేసుకుంటారు.. ఆ తర్వాత సాయంత్రం 6.30 గంటలకు కోదాడ నుండి యాత్ర ప్రారంభం అవుతుంది.. రాత్రి 8 గంటలకు ఖమ్మం చేరుకుని రాత్రి అక్కడే బస చేయనున్నారు.. 17న ఉదయం 10 గంటలకు మహబూబాబాద్, మధ్యాహ్నం 12 గంటలకు నర్సంపేట, 3 గంటలకు ములుగు, 4 గంటలకు రామప్పలో పర్యటించనున్నారు.. ఇక, అదేరోజు రాత్రికి వరంగల్ భద్రకాళి దర్శనం చేసుకుని వరంగల్లోనే బస చేస్తారు.. మరునాడు 18న ఉదయం 9 గంటలకు జనగామ చేరుకోనున్న ఆయన.. ఉదయం 10.45కి యాదగిరి గుట్ట, మధ్యాహ్నం 12.30 భువనగిరి, 2 గంటలకు ఘట్కేసర్, సాయంత్రం 4.30 గంటలకు ఉప్పల్, రాత్రి 8 గంటలకు బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి చేరుకుంటారు.. 19, 20 తేదీల్లో సికింద్రాబాద్ నియోజక వర్గంలో కిషన్ రెడ్డి జన ఆశీర్వాద యాత్ర సాగనుంది. తాజాగా జరిగిన కేంద్ర కేబినెట్ విస్తరణలో ప్రధాని నరేంద్ర మోడీ కీలకమైన మూడు శాఖల బాధ్యతలను కిషన్రెడ్డికి అప్పగించిన సంగతి తెలిసిందే.. గత కేబినెట్లో సహాయ మంత్రిగా ఎంట్రీ ఇచ్చి.. ఇప్పుడు ఏకంగా మూడు శాఖలు చూస్తున్నారు కిషన్రెడ్డి.
Also Read
- Srisailam Water Release: గుడ్న్యూస్.. శ్రీశైలం నుంచి నీటి విడుదల ప్రారంభం
- YS Jagan: చంద్రబాబు పాలనలో రైతులు రోడ్డున పడ్డారు.. ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారు!
- Aqua Farmers: ఆక్వా రైతులకు ఊరట.. రూ.1.50కే విద్యుత్ సరఫరా!
- YS Jagan: తూర్పు గోదావరిలో వైఎస్ జగన్ పర్యటన.. పొగాకు కొనుగోళ్లపై సమీక్ష, రైతులతో ముఖాముఖి!
తాజావార్తలు
-
UPI Transactions: యూపీఐ సేవలు ఉచితం కాదు.. ఆర్బీఐ గవర్నర్ సంచలన వ్యాఖ్యలు..
-
Operation Sindoor: పాకిస్తాన్ వేడుకున్నా దాడులపై వెనక్కి తగ్గని భారత్..
-
Srisailam Water Release: గుడ్న్యూస్.. శ్రీశైలం నుంచి నీటి విడుదల ప్రారంభం
-
Rahul Gandhi: రాహుల్గాంధీతో కిరణ్ రిజిజు భేటీ.. కీలక ప్రతిపాదనను తిరస్కరించిన ప్రతిపక్ష నేత
-
Box Office Clash: హారర్ vs రొమాన్స్ vs మాస్ vs యాక్షన్.. ఈ శుక్రవారం బాక్సాఫీస్ దద్దరిల్లాల్సిందే..!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!