సీఎస్ల సమావేశంలో 8 అంశాలపైనే ప్రధానంగా చర్చ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అంశాలపై ఢిల్లీ నుండి కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల సీఎస్లతో వీడియో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రధానంగా రాష్ట్ర విభజన అంశాలకు సంబంధించిన వివిధ పెండింగ్ అంశాలపై ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు డా.సమీర్ శర్మ, తెలంగాణ సీఎస్ సోమేష్ కుమార్లతో కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా సమీక్షించారు. ఈ సమావేశంలో ప్రధానంగా 8 అంశాలపైనే చర్చ జరిగింది.
1) TSDISCOM ద్వారా AP GENCOకు విద్యుత్ బకాయిల చెల్లింపు:
Also Read
- Pawan Kalyan Birthday: అమలాపురం గడ్డ పవన్ అభిమానుల అడ్డా.. పవర్ స్టార్ పుట్టినరోజు మాకు పండుగే!
- YS Jagan: 'నాన్నా.. మిమ్మల్ని ఎప్పటికీ మిస్ అవుతూనే ఉంటాను'.. వైఎస్ జగన్ భావోద్వేగ ట్వీట్!
- ACB Raids: టీటీడీ డిప్యూటీ ఈవో ఇంట్లో ఏసీబీ దాడులు.. ఏకకాలంలో 5 చోట్ల సోదాలు.. 15 ఏళ్ల తర్వాత!
- Pawan Kalyan Fan: పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకల్లో పెను విషాదం.. కరెంట్ షాక్తో అభిమాని మృతి!
ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ పవర్ యుటిలిటీస్కు రావాల్సిన మొత్తం బకాయిలు 12 వేల 111 కోట్లు ఉన్నాయి.. కానీ TS GENCO చెల్లించాల్సిన బకాయిలు 3 వేల 442 కోట్లు అని ఆంధ్రప్రదేశ్ వాదిస్తోంది. సీలేరు హైడ్రో పవర్ ప్లాంట్కు సంబంధించి సమస్యను పరిష్కరించడానికి భారత ప్రభుత్వం 2014లో శ్రీమతి నీరజా మాథుర్ అధ్యక్షతన ఒక కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ అనేక సమావేశాలు నిర్వహించినప్పటికీ ఏడున్నరేళ్లు గడిచినా ఇంకా నివేదిక సమర్పించలేదు. మరోవైపు ఏపీ హైకోర్టులో కేసు వేసింది. బకాయిలని తేల్చేందుకు వీలుగా కేసును ఉపసంహరించుకోవాలని తెలంగాణ డిమాండ్ చేసింది.
2) షెడ్యూల్ IX సంస్థలకు సంబంధించిన వివాదం:
డెక్కన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ల్యాండ్ హోల్డింగ్స్ లిమిటెడ్ (DILL)కి కేటాయించిన మొత్తం 5000 ఎకరాల భూమి కేటాయింపు షరతులు ఉల్లంఘించినందున 2015లో తెలంగాణ ప్రభుత్వం తిరిగి తీసుకుంటూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆ జీవోపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రిట్ పిటిషన్ వేసి స్టే ఆర్డర్ పొందింది.
3) ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ (APSFC):
స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ విషయంలో షరతులను ఉల్లంఘించినందుకు స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్కు కేటాయించిన 250 ఎకరాలను తిరిగి తెలంగాణ ప్రభుత్వం తీసుకుంది. దీనిని వ్యతిరేకిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోర్టుకు వెళ్లి స్టే పొందింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాఖలు చేసిన ఈ కోర్టు కేసుల కారణంగా షెడ్యూల్ IX సంస్థల విభజన పెండింగ్లో ఉంది. కోర్టు కేసులను ఉపసంహరించుకుంటే తప్ప, షెడ్యూల్ IX సంస్థల విభజనపై ముందుకు వెళ్లలేమని కేంద్రం స్పష్టం చేసింది.
4) సింగరేణి కొల్లిరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL), దాని అనుబంధ సంస్థ, ఆంధ్రప్రదేశ్ హెవీ మెషినరీ ఇంజినీరింగ్ లిమిటెడ్ (APHMEL):
AP పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014 యొక్క షెడ్యూల్ XII A బొగ్గు (అంశం 1) ప్రకారం, సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) మొత్తం ఈక్విటీలో 51% తెలంగాణ ప్రభుత్వం వద్ద, 49% భారత ప్రభుత్వం వద్ద ఉండాలి. చట్టంలోనే నిర్దిష్టమైన నిబంధన ఉన్నందున, భారత ప్రభుత్వం దీనికి సంబంధించి ఆంధ్ర ప్రదేశ్ లేవనెత్తిన ఏ అభ్యర్థనను అంగీకరించొద్దు. తెలంగాణ వాదనతో కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా ఏకీభవించారు. APHMEL సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్కి అనుబంధంగా ఉన్నందున తెలంగాణకే చెందుతుందన్నారు.
5) షెడ్యూల్ X సంస్థలకు సంబంధించిన వివాదం:
A.P. స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ విషయంలో, సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాలకు అనుగుణంగా 2017లో భారత ప్రభుత్వం ఒక ఉత్తర్వును జారీ చేసింది. ఆ ఆర్డర్ ను షెడ్యూల్ X సంస్థలకు కూడా వర్తించేలా చేయాలి. భారత ప్రభుత్వం జారీ చేసిన ఈ ఉత్తర్వును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రశ్నిస్తూ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది. రిట్ పిటిషన్ను ఉపసంహరించుకోని పక్షంలో షెడ్యూల్-X లో ఉన్న విద్యాసంస్థలకు సంబంధించిన వివాదాలు పరిష్కరించలేమని కేంద్ర హోంశాఖ కార్యదర్శి పేర్కొన్నారు.
6) న్యూఢిల్లీలోని AP భవన్ కేటాయింపుకు సంబంధించిన వివాదం:
న్యూఢిల్లీలోని ఆంధ్రా భవన్ కేటాయింపులు చేపట్టేందుకు రామకృష్ణారావు ఆధ్వర్యంలో తెలంగాణ కమిటీ వేస్తోంది. ఆంధ్రప్రదేశ్లోని వారి కౌంటర్ పార్ట్లతో కమిటీ ఏర్పాటు చేసుకోవచ్చని.. ఆ కమిటీ ఆంధ్ర భవన్ విభజనకు ఉన్న మార్గాలను సూచిస్తూ రిపోర్ట్ ఇస్తుందని తెలంగాణ ప్రభుత్వం వాదించింది. తెలంగాణ ప్రతిపాదనతో కేంద్ర హోంశాఖ కార్యదర్శి ఏకీభవించి కమిటీ గడువులోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.
7) పన్ను బకాయిలు, చెల్లింపు లు -ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లోని సెక్షన్ 50, 51 & 56 చట్టంలో ఎక్కడా లిస్ట్ చేయబడని సంస్థల విభజన:
ఏడున్నర సంవత్సరాల తర్వాత ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014లో సవరణ చేయాల్సిన అవసరం లేదని తెలంగాణ అభిప్రాయపడింది. అలా చేస్తే ఎన్నో సమస్యలు వస్తాయంది. పరిష్కరించబడిన విషయాలు కూడా మొదటికి వస్తాయని తెలిపింది. సవరణ సాధ్యం కాని పక్షంలో ప్రత్యామ్నాయంగా కేంద్ర ప్రభుత్వం నష్టాన్ని భర్తీ చేయాలని ఏపీ ప్రభుత్వం కోరింది.
8) నగదు నిల్వ , బ్యాంకు డిపాజిట్ల విభజన:
ఆంధ్రప్రదేశ్ నుంచి రావాల్సిన సొమ్మును వెంటనే చెల్లించాలని తెలంగాణ ప్రభుత్వం డిమాండ్ చేసింది. సెంట్రల్ సెక్టార్ స్కీమ్ల విషయంలో495 కోట్ల మొత్తం 7 సంవత్సరాలకు పైగా బకాయి ఉంది. హైకోర్టు, రాజ్ భవన్ మొదలైన ఉమ్మడి సంస్థలపై రూ.315 కోట్ల వరకు ఖర్చు చేసిన సొమ్ముపై ఆంధ్రప్రదేశ్ చెల్లించాల్సిన బకాయిలు ఉన్నాయి. నిర్మాణంలో ఉన్న భవనాల వాటా, 456 కోట్ల సంక్షేమ నిధి, 208 కోట్ల నికర క్రెడిట్ ఫార్వార్డ్ను పునఃప్రారంభించడం వంటి అంగీకరించిన డబ్బులు కూడా ఏపీ చెల్లించలేదు. నగదు నిల్వల విభజనను పరిశీలించేందుకు ఇద్దరు నోడల్ అధికారులను నియమించాలని కేంద్ర హోంశాఖ కార్యదర్శి సూచించారు. తెలంగాణ నుండి రామ కృష్ణారావు , ఆంధ్రప్రదేశ్ నుండి రావత్లను నోడల్ అధికారులుగా నియమించారు.
తాజావార్తలు
-
Toxic: సొంత గడ్డపైనే యశ్కు షాక్.. ‘టాక్సిక్’ వసూళ్లు చూసి ట్రేడ్ వర్గాలు అవాక్కు!
-
Sonu Sood: నేపాల్ విధ్వంసం చూసి చలించిపోయిన సోనూ సూద్.. బాధితులకు అండగా నిలవాలని విజ్ఞప్తి
-
Pawan Kalyan Birthday: అమలాపురం గడ్డ పవన్ అభిమానుల అడ్డా.. పవర్ స్టార్ పుట్టినరోజు మాకు పండుగే!
-
Emmy Awards 2026: ఈ నెలలోనే 78వ ఎమ్మీ అవార్డ్స్ .. ఎక్కువ నామినేషన్లు అందుకున్న షోలు ఇవే!
-
Congress 1000 Days: కాంగ్రెస్ 1000 రోజుల పాలనపై బీఆర్ఎస్ ఛార్జ్షీట్..!
ట్రెండింగ్
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!
-
8,050mAh బ్యాటరీ, 185Hz AMOLED డిస్ప్లే, 200MP కెమెరాతో ఫ్లాగ్షిప్ ఫోన్ POCO F9 Ultra లాంచ్.!
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!