Twitter War: అయ్యన్న తూటాలు.. విజయసాయి కౌంటర్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు రోజురోజుకి ఎలా వేడెక్కుతున్నాయో అందరూ చూస్తూనే ఉన్నారు. అధికార, ప్రతిపక్ష నేతలు ఒకరిపై మరొకరు తీవ్రస్థాయిలో విమర్శలు చేసుకుంటున్నారు. ఇప్పుడు మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు, ఎంపీ విజయసాయి రెడ్డి మధ్య ట్విటర్ వార్ మొదలైంది.
తొలుత తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అయ్యన్నపాత్రుడు.. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. దుర్మార్గ, రాక్షస పరిపాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడాలని తాను దేవుణ్ణి ప్రార్థించానన్నారు. తమని రక్షించడంతో పాటు ‘నిన్ను నువ్వు కూడా కాపాడుకో’ అని తాను శ్రీవారిని వేడుకున్నానన్నారు. ఎందుకంటే.. ఆలయంతో ట్రస్టు పేరిట నిలువుదోపిడీ జరుగుతోందని ఆయన ఆరోపించారు. ఒక్కొక్కరికి శ్రీవారి టికెట్ రూ. 10,500 కాగా.. తాను రూ. 75,000 కట్టానన్నారు. అందులో శ్రీవారికి వెళ్ళింది రూ. 3,500 మాత్రమేనని, మిగతాదంతా శ్రీవాణి ట్రస్టుకేనని తెలిపారు. ఏమాత్రం అకౌంట్ లేని శ్రీవాణి ట్రస్ట్ పేరుతో వైసీపీ సర్కార్ దోచుకుంటోందన్నారు.
Also Read
- CM Chandrababu: ‘నిజం గెలిచింది’.. ప్రజల కోసం నిలబడితే ప్రజలే మన వెంట నిలబడతారు..
- CM Chandrababu: సీఎం చంద్రబాబు అధ్యక్షతన కలెక్టర్ల సదస్సు.. రేపటి నుంచి రెండు రోజుల పాటు..
- AP Weather Update: ఈదురు గాలులతో వర్షాలు.. ఈ జిల్లాల్లో కీలక హెచ్చరికలు జారీ..
- Tirumala Tirupati: తిరుమలలో ఎల్నినో ఎఫెక్ట్.. మరో 120 రోజులకు మాత్రమే నీళ్లు..
శ్రీవాణి ట్రస్టుకి ఆడిటింగ్ ఉందా…? అని ప్రశ్నించిన అయ్యన్న.. స్వామీజీలు ధర్మప్రచారాన్ని మరచి, రాజకీయ భజన చేస్తున్నారని ఆరోపించారు. పీఠాధిపతులు రాజకీయాలను వదిలి… ధర్మ ప్రచారాన్ని విశ్వవ్యాప్తం చేసేందుకు కృషి చెయ్యాలని కోరారు. ఈ వ్యాఖ్యలకు విజయసాయి రెడ్డి ట్విటర్ మాధ్యమంగా కౌంటర్ ఇచ్చారు. ‘‘కనకపు సింహాసనం మీద అయినా, కలియుగ వైకుంఠంలో అయినా కుక్కది ఒకటే బుద్ధి.. వీడు తిరుమలలోను అదేలా కాలెత్తి పోశాడు’’ ఘాటుగా బదులిచ్చారు. దీంతో.. ఏపీలో పాలిటిక్స్ మరోసారి అగ్గిరాజుకున్నట్టయ్యింది.
కనకపు సింహాసనం మీద అయినా, కలియుగ వైకుంఠంలో అయినా కుక్కది ఒకటే బుద్ధి…వీడు తిరుమలలోను అదేలా కాలెత్తి పోశాడు. pic.twitter.com/DUBM3ULOea
— Vijayasai Reddy V (@VSReddy_MP) June 1, 2022
తాజావార్తలు
-
Petrol-Diesel Price: హార్ముజ్లో భారీ దాడులు.. వాహనదారులకు ధరలు షాకిచ్చే ఛాన్స్!
-
CM Chandrababu: ‘నిజం గెలిచింది’.. ప్రజల కోసం నిలబడితే ప్రజలే మన వెంట నిలబడతారు..
-
India-Sri Lanka: భారత్కు వ్యతిరేకంగా ఆ పని ఎప్పటికీ చేయబోం.. స్పష్టం చేసిన శ్రీలంక అధ్యక్షుడు!
-
Former OSD Sumanth : మాజీ OSD సుమంత్కు బిగ్ రిలీఫ్.. ముందస్తు బెయిల్.!
-
TG SAFE : కూకట్పల్లిలో ఫుడ్ సేఫ్టీ రైడ్స్.. 5 లైసెన్సులు సస్పెండ్..!
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!