Tungabhadra Dam: తెగిపోయిన తుంగభద్ర డ్యాం గేటు.. పోటెత్తిన వరద నీరు..
- కర్ణాటక: తెగిన తుంగభద్ర డ్యాం 19వ గేట్ చైన్ లింక్..
- రాత్రి 11 గంటల నుంచి కనిపించని హోస్పెట్ డ్యాం 19వ గేట్..
- గేట్లు మూసేందుకు ప్రయత్నించిన అధికారులు.. తెగిపోయిన గేట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tungabhadra Dam: కర్ణాటక రాష్ట్రంలోని హోస్పేట్లో ఉన్న తుంగభద్ర డ్యాం 19వ గేటు ఊడిపోవడంతో భారీగా నీరు బయటికి వెళ్లిపోతుంది. డ్యాంకు ఇన్ఫ్లో తగ్గడంతో శనివారం (ఆగస్టు10) అర్ధరాత్రి 11 గంటల సమయంలో డ్యామ్ గేట్లు మూసేందుకు అధికారులు ట్రై చేశారు. చీకటి కావడంతో గేటు కొట్టుకుపోయిందా లేక అక్కడే పడిపోయిందా తెలుసుకోలేకపోయిన అధికారులు.. చైన్ లింక్ తెగిపోవడంతో పాటు గేటు కనిపించకపోవడాన్ని దృవీకరించారు. దీంతో తుంగభద్ర డ్యామ్ నుంచి ప్రస్తుత ఔట్ ఫ్లో 75 వేల క్యూసెక్కులుగా ఉంది.
Read Also: Bangladesh : మళ్లీ అధికారంలోకి షేక్ హసీనా ? బంగ్లాదేశ్ వీధుల్లోకి అవామీ లీగ్ మద్దతుదారులు
Also Read
- OTR : అసెంబ్లీకి వైసీపీ..? DSC రచ్చ వేళ కూటమి అలర్ట్.. బీసీ బిల్లుపై కీలక నిర్ణయం..!
- Shocking Murder Case: ఆస్తి కోసం సొంత బామ్మర్దినే చంపిన బావ.. 27 రోజుల తర్వాత బయటపడ్డ అసలు నిజం!
- Nara Lokesh: బాధిత కుటుంబాలకు భరోసా.. ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం: మంత్రి నారా లోకేష్
- CGST Superintendent: రూ.50 వేలు లంచం.. రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డ సీజీఎస్టీ (CGST) సూపరింటెండెంట్..
ఇక, తుంగభద్ర ప్రాజెక్టు నుంచి 60 టీఎంసీల నీళ్లు బయటికి వదిలిన తర్వాతే గేటు పునరుద్ధరణ పనులు చేపడతామని అధికారులు పేర్కొన్నారు. ఇవాళ (ఆదివారం) ఉదయాన్నే డ్యామ్ను కొప్పాల్ జిల్లా ఇంఛార్జ్ మంత్రి శివరాజ్ సందర్శించారు. ప్రస్తుతం తుంగభద్ర డ్యామ్ 33 గేట్ల నుంచి నీరు బయటికి వదులుతున్నారు. ప్రాజెక్టు నుంచి లక్ష వేల క్యూసెక్కుల నీరు బయటికి వెళ్లిపోతుంది. డ్యామ్ భద్రతకు సంబంధించి ఇంత పెద్ద ఘటన జరగడం 70 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి కావడం గమనార్హం.
Read Also: Devara: తారక్ ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోండి.. దేవర -2 దాదాపు లేనట్టే..?
అలాగే, కృష్ణానది వరద ఉధృతి కొనసాగుతుంది. తుంగభద్ర డ్యామ్ చైన్ లింక్ తెగిపోవడంతో గేట్ కొట్టుకుపోయింది. ప్రాజెక్ట్ నుంచి విడుదల అవుతున్న నీటితో కర్నూలు జిల్లా కౌతాలం, కోసిగి, మంత్రాలయం, నందవరం మండలాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ పేర్కొన్నారు. అత్యవసర సహాయంకోసం టోల్ ఫ్రీ 1070,112, 18004250101 సంప్రదించండి అని చెప్పుకొచ్చారు. కృష్ణానది పరివాహక ప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.. కాలువలు వాగులు దాటే ప్రయత్నం చేయరాదు అని వెల్లడించారు.
తాజావార్తలు
-
Colombia Earthquake : కొలంబియాలో భారీ భూకంపం.. 47 మంది మృతి, కూలిన భవనాలు.!
-
OTR : అసెంబ్లీకి వైసీపీ..? DSC రచ్చ వేళ కూటమి అలర్ట్.. బీసీ బిల్లుపై కీలక నిర్ణయం..!
-
Chairmans Desk : దేశంలో వ్యవస్థలు ఎటు పోతున్నాయి..? పాలన కంటే రాజకీయమేముఖ్యమైపోయిందా..?
-
OTR: రెడ్ ఐ ఎవరి మీద..?
-
Chit Fund Scam: రూ.2,000 కోట్ల చిట్ఫండ్ స్కామ్.. వెల్ఫేర్ గ్రూప్పై ఈడీ దాడులు..
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!