TTD Hundi Collection New Record: టీటీడీ కొత్త చరిత్ర.. 21 రోజులకే రూ.100 కోట్లు దాటి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తిరుమల తిరుపతి దేవస్థానం హుండీ ఆదాయంలో కొత్త రికార్డు సృష్టించింది.. జులై మాసంలో కోనేటిరాయుడికీ కాసుల వర్షం కురుస్తోంది.. ఈ నెలలో కేవలం 21 రోజుల్లోనే రూ.100 కోట్ల మార్క్ను క్రాస్ చేసింది శ్రీవారి హుండీ ఆదాయం.. జులై 1వ తేదీ నుంచి 21వ తేదీ వరకు శ్రీవారికీ హుండీ ద్వారా తిరుమల తిరుపతి దేవస్థానానికి రూ. 100 కోట్ల 75 లక్షల రూపాయల ఆదాయంగా వచ్చింది.. జులై మాసంలో స్వామివారికి ఇంత మొత్తంలో హుండీ ఆదాయం లభించడం ఇదే తొలిసారి.. ఇక, టీటీడీ చరిత్రలోకే అత్యధిక స్థాయిలో ఆదాయం జులై మాసంలో లభించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు అధికారులు.. ఇప్పటి వరకు గత మే మాసంలో లభించిన 130 కోట్ల రూపాయలే అత్యధిక హుండీ ఆదాయం కాగా.. ఈ నెల 31వ తేదీ వరకు మరింత ఆదాయం వస్తుంది కాబట్టి.. మొట్ట మొదటి సారి హుండీ ద్వారా ఒకే మాసంలో 140 కోట్ల రూపాయలు ఆదాయం శ్రీవారికి లభించే అవకాశం ఉందంటున్నారు.
Read Also: CJI Justice NV Ramana: మీడియా కంగారు కోర్టులను నడిపిస్తోంది.. సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ ఫైర్
Also Read
- New Excise Policy: 2026-27 ఎక్సైజ్ పాలసీ.. ఏడాది పాటు లైసెన్సులు రెన్యువల్..
- AP Employees: ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపు.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం.
- Amaravati: అమరావతి రైతులకు ప్లాట్ల కేటాయింపు.. ప్రొవిజనల్ సర్టిఫికెట్లు అందజేసిన అధికారులు..
- Andhra Pradesh: గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్.. మంత్రి కీలక వ్యాఖ్యలు..
కరోనా మహమ్మారవి విజృంభణ తర్వాత చాలా కాలం శ్రీవారికి దూరం అయ్యారు సామాన్య భక్తులు.. దాదాపు రెండేళ్ల తర్వాత తిరుమల గిరులు భక్తులతో కిటకిటలాడుతున్నాయి.. మరోవైపు హుండీలో కాసుల వర్షం కురుస్తోంది.. గత ఐదు నెలలుగా రూ.100 కోట్ల మార్క్ను దాటేసి కొత్త రికార్డులు సృష్టిస్తూ వస్తుంది టీటీడీ.. మార్చి నెలలో శ్రీవారికి రూ.128 కోట్ల ఆదాయం, ఏప్రిల్ రూ.127.5 కోట్లు, మే మాసంలో రికార్డు స్థాయిలో 130.05 కోట్ల , జూన్ మాసంలో రూ.123 కోట్ల ఆదాయం రాగా.. జులై మాసంలో భక్తుల రద్దీ సాధారణంగా ఉన్నప్పటికీ.. స్వామి వారి హుండీ ఆదాయం రికార్డులు సృష్టిస్తోంది.. ఈ నెలలోనే 4వ తేదీ టీటీడీ చరిత్రలోనే అత్యధికంగా రూ.6.18 కోట్ల ఆదాయం లభించింది.. దీంతో మరో పది రోజుల హుండీ ఆదాయం సరాసరి లెక్కించినా.. జులై మాసంలో టీటీడీ ఆదాయం కొత్త చరిత్ర లిఖిస్తుందని అంచనా వేస్తున్నారు.. ఐదు నెలల కాలంలోనే శ్రీవారి హుండీ ఆదాయం 650 కోట్ల రూపాయాలను క్రాస్ చేయగా.. ఈ ఏడాది మొత్తం ఆదయాం రూ. 15 వందల కోట్లును కూడా దాటేసే అవకాశం ఉన్నట్టు అంచనా వేస్తున్నారు అధికారులు.
తాజావార్తలు
-
Devasish Sharma: IAS పదవికి రాజీనామా.. 8 రోజుల్లోనే బీజేపీ ఎంపీ టికెట్.. దేవాశిష్ శర్మ ఎవరు?
-
Bada Ganesh : ఖైరతాబాద్ బడా గణేష్ దర్శనానికి వెళ్తున్నారా? ఈ ట్రాఫిక్ రూట్లు మర్చిపోకండి
-
Sergio Gor: మణిపూర్లో సెర్గియో గోర్ పర్యటన.. గవర్నర్, సీఎంతో భేటీ!
-
Rain Alert: బ్రిక్స్ సదస్సు వేళ ఢిల్లీకి భారీ వర్ష సూచన
-
Nani: నా కెరీర్లోనే అత్యంత కష్టమైన సినిమా ఇదే.. జడల బరువుపై నాని సంచలన వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?