Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News What Steps Will The Ap Government Take In The Tirumala Laddu Controversy

Tirumala Laddu controversy: తిరుమల లడ్డూల్లో కల్తీ నెయ్యి..! ఇప్పుడిదే హాట్‌ టాపిక్‌..

Published Date :September 21, 2024 , 8:31 am
By Sudhakar Ravula
  • తిరుమల లడ్డులో కల్తీ నెయ్యి వివాదం..
  • గత ప్రభుత్వ హయాంలోని టీటీడీ బోర్డు ఆమోదించిన టెండర్ వల్ల కల్తీ నెయ్యి..
  • టీటీడీ ఈవో శ్యామల రావు నిర్ధారణ..
  • NDDB ల్యాబ్ నుంచి సర్టిఫికెట్..
  • ప్రభుత్వం ఏం చేస్తుందనే చర్చ..
Tirumala Laddu controversy: తిరుమల లడ్డూల్లో కల్తీ నెయ్యి..! ఇప్పుడిదే హాట్‌ టాపిక్‌..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Tirumala Laddu controversy: తిరుమల లడ్డులో కల్తీ నెయ్యుని వినియోగించారని.. గత ప్రభుత్వ హయాంలోని టీటీడీ బోర్డు ఆమోదించిన టెండర్ వల్ల కల్తీ నెయ్యి వినియోగం జరిగిందనే విషయాన్ని ఈవో శ్యామల రావు నిర్ధారించారు. జాతీయ స్థాయిలో పేరొందిన NDDB ల్యాబ్ నుంచి సర్టిఫికెట్ కూడా వచ్చేసింది. దీనిపై రాజకీయంగా దుమారం రేగుతోంది. అధికార టీడీపీ.. మొన్నటి వరకు అధికారంలో ఉన్న వైసీపీ అపచారం నువ్వు చేశావంటే నువ్వు చేశావని దుమ్మెత్తి పోసుకుంటున్నాయి. ఈ రాజకీయాలు పక్కన పెడితే వెంకన్న భక్తుల మనోభావాలు.. హిందువుల మనోభావాలు దెబ్బతినకుండా.. తిరుమల పవిత్రతను కాపాడే విధంగా ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారనేది ఇప్పుడు చర్చనీయీంశంగా మారింది. కల్తీ నెయ్యిని పక్కన పెట్టేసి.. స్వచ్ఛమైన ఆవు నెయ్యితో లడ్డుల తయారీ చేస్తున్నామని ఈవో స్పష్టం చేశారు. ఇంత వరకు బాగానే ఉంది. కానీ.. జరిగిన అపచారం సంగతేంటనే దాని పైనే ఇప్పుడు చర్చ జరుగుతోంది. దీని పైనే ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. భక్తుల మనోభానాలను.. ఆగ్రహాన్ని దృష్టిలో పెట్టుకుని ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై ప్రభుత్వం సీరియస్సుగానే ఆలోచిస్తోంది. దీనిపై సీఎం చంద్రబాబు ఇప్పటికే కసరత్తు మొదలు పెట్టారు.

Read Also: Gun Fire: కోర్టులోనే జడ్జిని కాల్చి చంపిన పోలీస్ ఇన్‭స్పెక్టర్..

Also Read

  • Tirumala Adulterated Ghee Case: తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారం.. ముగిసిన ఏక సభ్య కమిషన్ విచారణ..
  • TTD: శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఇవాళ్టి నుంచే జులై నెల దర్శన టికెట్ల విడుదల
  • TTD: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సర్వదర్శనం టోకెన్ల సమయంలో మార్పులు..
  • TTD Server Issue: టీటీడీ సర్వర్‌లో సాంకేతిక లోపం.. ఆన్‌లైన్‌ టికెట్ల జారీ రద్దు..

ఈ తరహా ఘటనలు జరిగినప్పుడు ఏం చేయాలనే దానిపై ఆగమ పండితుల నుంచి సలహాలు స్వీకరించనుంది ప్రభుత్వం. అలాగే మఠాధిపతులు.. పీఠాధిపతులతో చర్చించి శుద్ధి కార్యక్రమం జరపాలా..? లేక సంప్రోక్షణ చేయాలా..? లేక ఆగమ శాస్త్రంలో మరే విధానమేదైనా ఉందా అనే కోణంలో ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. ఈ క్రమంలో ఆధ్యాత్మిక వేత్తలతో.. పీఠాధిపతులతో.. మఠాధిపతులతో సీఎం చంద్రబాబు సహా టీటీడీ ఉన్నతాధికారులు, చర్చించే సూచనలు కన్రిస్తున్నాయి. ఆధ్యాత్మిక గురువులతో సలహాలు.. సంప్రదింపులు జరిపిన మీదట తుది నిర్ణయానికు వచ్చే అవకాశం కన్పిస్తోంది. సంప్రోక్షణా..? శుద్దా అనే అంశం పైనా లేక వేరే విధానామా..? అనే అంశంపై వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోనున్నారు. ఇప్పటికే తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. హిందువులు.. హిందూ సంఘాలు వివిధ రాష్ట్రాల్లో ఆందోళన చేపడుతోన్న పరిస్థితి. అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా ఈ అంశంపై సీరియస్సుగా ఉంది. ఇప్పటికే జేపీ నడ్డా సీఎం చంద్రబాబుతో మాట్లాడి వివరాలు తీసుకున్నారు. రాహుల్ గాంధీ లడ్డూ విషయమై స్పందించారు. దీంతో భక్తుల మనోభావాలకు దెబ్బ కలగకుండా.. తిరుమల పవిత్రతని కాపాడేందుకు తీసుకోవాల్సిన చర్యలపై త్వరితగతినే ఓ నిర్ణయానికి రానుంది ఏపీ ప్రభుత్వం.

Read Also: Sankashti Chaturthi: సంకష్టహరచతుర్థి నాడు ఈ స్తోత్ర పారాయణం చేస్తే మనోభీష్టాలు నెరవేరుతాయి

మరోవైపు ఈ అపచారానికి పాల్పడిన వారిని శిక్షించాలని.. ఈ వ్యవహరంపై కేసు నమోదు చేసి విచారణ జరపాలన్న డిమాండ్లూ పెద్ద ఎత్తున వస్తున్నాయి. దీంతో ఈ అపచారానికి పాల్పడి భక్తుల మనోభావాలను దెబ్బతీసిన వారు ఎవరు..? ఎవరిపై కేసులు నమోదు చేయాలి..? దీనికి బాధ్యులు ఎవరనే అంశాన్ని నిగ్గు తేల్చనున్నారు. ఇంతటి ఘోర అపచారం జరిగిన తర్వాత కూడా సంబంధిత వ్యక్తులపై చర్యలు లేకుండా వదివేస్తే.. ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయి. అంతే కాకుండా ప్రభుత్వమే రాజకీయం చేసిందని అప్రతిష్టని మూట గట్టుకోవాల్సి వస్తుంది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని బాధ్యులపై కేసులు నమోదు చేయడమే కాకుండా శిక్ష పడే విధంగా జాగ్రత్త చర్యలు తీసుకోనుంది ప్రభుత్వం. గత ఐదేళ్ల కాలంలో తిరుమల కొండ మీద అపచారాలు జరిగాయని చాలా సార్లు విమర్శలు వచ్చాయి. అయితే ఇప్పుడు గత ప్రభుత్వం గురించి తిరుమల లడ్డూ విషయంలో తీవ్రమైన అపచార చేసిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • AP Government
  • cm chandrababu
  • tirumala
  • Tirumala Laddu Controversy

తాజావార్తలు

  • Toxic : టాక్సిక్ డీల్.. నిర్మాతలకు ముచ్చెమటలు పట్టిస్తున్న OTTలు!

  • Open AI Financial Crisis : ఆర్థిక సంక్షోభంలో చాట్ జీపీటీ.?

  • Viral Wedding: పెళ్లి పీటలపై ఊహించని ట్విస్ట్.. వధువు ముందు వింత షరతు పెట్టిన పెళ్లి కొడుకు.. షాక్‌లో బంధువులు!

  • Vaibhav Sooryavanshi: నా బలం, శక్తికి కారణం అదే.. అందుకే ఈ దూకుడు.. మనసులో మాట చెప్పిన వైభవ్..

  • MI Vs SRH Playing XI: ఊపు మీదున్న SRHకు ముంబై కళ్లెమేస్తుందా.?

ట్రెండింగ్‌

  • 50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్‌తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!

  • 13 అంగుళాల 3.5K PureSight Pro డిస్‌ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?

  • 7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!

  • 10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్‌, 120Hz AMOLED డిస్‌ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions