TTD: టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయాలు..
- టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయాలు..
- 23న శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ..
- 24 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు..
- 10 రోజుల పాటు సిఫార్సు లేఖల స్వీకరణ రద్దు..
TTD: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలకమండలి కీలక నిర్ణయాలు తీసుకుంది.. 24వ తేదీ నుంచి ప్రారంభం కానున్న బ్రహ్మోత్సవాలు సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు.. 23వ తేదీన బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరగనుండగా.. ఈ నెల 24వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తామని.. 24న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ర్ట ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పిస్తారని వెల్లడించారు..
Read Also: శబాష్ Smriti Mandhana.. ICC వన్డే ర్యాంకింగ్లో వరల్డ్ నంబర్.1 గా!
Also Read
- Tirumala Adulterated Ghee Case: తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారం.. ముగిసిన ఏక సభ్య కమిషన్ విచారణ..
- TTD: శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఇవాళ్టి నుంచే జులై నెల దర్శన టికెట్ల విడుదల
- TTD: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సర్వదర్శనం టోకెన్ల సమయంలో మార్పులు..
- TTD Server Issue: టీటీడీ సర్వర్లో సాంకేతిక లోపం.. ఆన్లైన్ టికెట్ల జారీ రద్దు..
ఇక, ఇస్రో సహకారంతో క్రౌడ్ మేనేజ్మెంట్ మానిటరింగ్ చేస్తాం.. బ్రహ్మోత్సవాల సమయంలో 10 రోజుల పాటు సిఫార్సు లేఖల స్వీకరణ రద్దు చేశాం.. భక్తుల సౌకర్యార్థం అదనంగా 8 లక్షల లడ్డూలు తయారు చేస్తున్నామని తెలిపారు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు.. కర్నాటక రాష్ర్టం బెల్గాంలో ఏడు ఏకరాల స్థలంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి ఆమోదం లభించింది.. గుంటూరు జిల్లా తుల్లురు మండలం అనంతవరం గ్రామంలో ఆలయ అభివృద్ధి పనులకు 7.2 కోట్ల రూపాయలు కేటాయించింది టీటీడీ.. గుంటూరు జిల్లా ఖాజా గ్రామంలో దాతలు ఇచ్చిన 89 లక్షల విలువైన స్థలం స్వీకరణకు ఆమోదం తెలిపింది పాలకమండలి.. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు దళితవాడలో వెయ్యి ఆలయాల నిర్మాణం చేపట్టనున్నట్టు పేర్కొన్నారు..
Read Also: RRC SR Recruitment 2025: రైల్వేలో స్పోర్ట్స్ కోటాలో జాబ్స్.. అర్హులు వీరే.. మంచి జీతం
మరోవైపు, టీటీడీపై అసత్య ప్రచారం చేసే వారిపై క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరించారు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు.. ఇక, శ్రీవారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై సమీక్షలు నిరంతరాయంగా జరుగుతున్నాయన్నారు టీటీడీ ఈవో సింఘాల్.. 19వ తేదీన జిల్లా యంత్రాంగంతో కలసి సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నాం అన్నారు అనిల్ కుమార్ సింఘాల్.. అయితే, టీటీడీ ఈవోగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన అనిల్ కుమార్ సింఘాల్ కు టీటీడీ పాలక మండలి చైర్మన్ బీ.ఆర్.నాయుడు, పాలకమండలి సభ్యులు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈవోగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటి సారి బోర్డు సమావేశానికి హాజరైన సింఘాల్ను చైర్మన్, సభ్యులు స్వాగతించి, అన్ని విధాల సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. గతంలో ఈవోగా పనిచేసిన అనిల్ కుమార్ సింఘాల్ కు ఉన్న అనుభవం భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించడంలో, టీటీడీని అభివృద్ధి దిశగా నడిపించడంలో ఉపయోగపడుతుందని పాలకమండలి సభ్యులు ఆకాంక్షించారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy : ఐఏఎస్ల బదిలీల్లో రేవంత్ రెడ్డి క్యారెట్ అండ్ స్టిక్ పాలసీ
-
House Sales Down: భారీగా పడిపోయిన ఇళ్ల అమ్మకాలు.. ప్రధాన కారణం ఇదే..
-
Software Jobs Opening: లేఆఫ్స్ మధ్య భారీ ఊరట.. నియామకాలు స్టార్ట్ చేసిన ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ..
-
Success Story: ఊరి నుంచి రూ.12 అప్పు చేసి వచ్చాడు.. నేడు రూ. 15 వేల కోట్లకు అధిపతి..
-
Angkrish Raghuvanshi: రేర్ డిస్మిసల్.. అంగ్క్రిష్ రఘువంశీ ఆబ్స్ట్రక్టింగ్ ది ఫీల్డ్ కు ఔట్.. కేకేఆర్ ఆగ్రహం
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!