Tirumala: వైఎస్ జగన్ మేనమామ కేసు
- వైఎస్ జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి పై కేసు..
- శ్రీవారి ఆలయం ముందు రాజకీయ వాఖ్యలు..
- పోలీసులకు ఫిర్యాదు చేసిన టీటీడీ విజిలెన్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tirumala: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపై అక్రమంగా కేసులు పెడుతున్నారని.. ఆ పార్టీ నేతలు ఆరోపణలు గుప్పిస్తున్నారు.. చిన్న విషయానికి కూడా కక్షపూరితంగా కూటమి ప్రభుత్వం కేసులు నమోదు చేసి, అరెస్ట్ చేసి.. ఆనందం పొందుతుందని మండిపడ్డారు.. అయితే, తాజాగా, వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి పై కేసు నమోదు అయ్యింది.. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆయన.. ఆ తర్వాత శ్రీవారి ఆలయం ముందు రాజకీయ వాఖ్యలు చేశారని రవీంద్రనాథ్ రెడ్డి పై పోలీసులకు ఫిర్యాదు చేశారు టీటీటీ విజిలెన్స్ అధికారులు. ఇక, విజిలెన్స్ ఫర్యాదుతో రవీంద్రనాథ్ రెడ్డిపై కేసు నమోదు చేశారు తిరుమల పోలీసులు.
Read Also: Tollywood Bund : ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి దుర్గేష్ తో టాలీవుడ్ నిర్మాతల భేటీ
Also Read
కాగా, ఆదివారం రోజు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తర్వాత మీడియాతో మాట్లాడిన వైసీపీ నేత పల్లె రవీంద్రనాథ్ రెడ్డి.. పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల్లో ప్రజలందరూ వైఎస్ జగన్ వెంటే ఉన్నారనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.. అసలు జగన్ తలచుకుంటే.. గత ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ నామినేషన్ కూడా వేసేవాళ్లు కాదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.. ఇక, పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల్లో కూటమి సర్కార్ అరాచకాలకు పాల్పడుతోందని ఆయన ఆరోపించారు.. ప్రజలను, వైసీపీ కార్యకర్తలను భయబ్రాంతులకు గురిచేస్తున్నారని రవీంద్రనాథ్ రెడ్డి వ్యాఖ్యనించిన విషయం విదితమే..
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!