Tirumala: శ్రీవారి భక్తులకు శుభవార్త.. అన్నప్రసాదం మెనూలో అదనంగా చేరిన గారె..
- శ్రీవారి భక్తులకు మరో శుభవార్త చెప్పిన టీటీడీ..
- అన్నప్రసాదంలో మసాలా వడను చేర్చిన టీటీడీ..
- ప్రారంభించిన టీటీడీ చైర్మన్, ఈవో, అదనపు ఈవో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tirumala: శ్రీవారి దర్శనానికి తిరుమలకు వెళ్లే భక్తులు అన్నప్రసాదాన్ని మహా ప్రసాదంగా స్వీకరిస్తారు.. ఇప్పుడు శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) మరో శుభవార్త చెప్పింది.. తిరుమలలో భక్తులకు ఉచితంగా అందించే అన్నప్రసాదంలో మసాలా వడను చేర్చింది. తిరుమలలోని తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలో ఈ రోజు భక్తులకు వడ ప్రసాదం అందించే కార్యక్రమాన్ని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, టీటీడీ ఈవో శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరిలతో కలిసి అధికారికంగా ప్రారంభించారు. కాగా, ఇప్పటికే శ్రీవారి అన్నప్రసాద మెనులో మసాలా వడను చేర్చింది టీటీడీ.. అవి ఇప్పటి వరకు కొంతమందికే అందుతుండగా.. ఈ రోజు నుంచి పూర్తిస్థాయిలో అమల్లోకి తెచ్చారు..
Read Also: HYDRA: ఖాజాగూడలో చెరువులను పరిశీలించిన రంగనాథ్.. అధికారులకు కీలక సూచనలు..
Also Read
ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు మాట్లాడుతూ.. తాను టీటీడీ చైర్మన్గా పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత, అన్నప్రసాద మెనూలో భక్తులకు అదనపు వస్తువును వడ్డించే ఆలోచనను ముందుకు తెచ్చాను అన్నారు.. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లినప్పుడు, ఆయన ఆ ఆలోచనకు అంగీకరించి ఆమోదించారని గుర్తుచేసుకున్నారు.. ఆలయ నిర్వహణలో ఇప్పటికే అధిక నాణ్యత గల పదార్థాలతో భక్తులకు అన్నప్రసాదాలను అందిస్తున్నట్లు తెలియజేశారు. భక్తులకు వడ్డించే వడల తయారీలో పప్పు, పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా మరియు సోంపులను ఉపయోగిస్తారని వెల్లడించారు.. అన్న ప్రసాద కేంద్రంలో ప్రతిరోజూ ఉదయం 10.30 నుండి సాయంత్రం 4 గంటల వరకు సుమారు 35,000 వడలను భక్తులకు వడ్డిస్తారని.. భవిష్యత్తులో ఈ సంఖ్యను మరింత పెంచుతామని పేర్కొన్నారు..
Read Also: CPI Narayana: ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అయ్యాక భారతీయులకు రక్షణ లేదు..
ఇక, ఇదే విషయాన్ని సోషల్ మీడియా వేదికగా కొన్ని ఫోటోలను షేర్ చేస్తూ వెల్లడించారు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు.. తాను టీటీడీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించాక అన్నప్రసాదం మెనూలో అదనంగా ఒక పదార్థం పెట్టాలని ఆలోచన నాకు కలిగింది.. నా ఆలోచనను సీఎం దృష్టికి తీసుకెళ్లాను, ఆయన అంగీకారంతో.. గారెలను ఇవాళ ప్రవేశపెట్టాం.. నాణ్యమైన దినుసులతో భక్తులకు రుచికరమైన అన్నప్రసాదాలను మా అధికారులు వడ్డిస్తున్నారు.. ప్రతీ రోజు ఉదయం 10:30 నుండి సా 4 గంటల వరకు ప్రతిరోజు 35 వేల గారెలను భక్తులకు వడ్డిస్తాం.. భవిష్యత్తులో ఈ సంఖ్యను మరింతగా పెంచి, భక్తులకు రుచికరమైన భోజనం అందిస్తామని ఎక్స్ (ట్విట్టర్)లో పేర్కొన్నారు.
చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించాక అన్నప్రసాదం మెనూ లో అదనంగా ఒక పదార్థం పెట్టాలని ఆలోచన నాకు కలిగింది
నా ఆలోచనను సీఎం దృష్టికి తీసుకెళ్లాను, ఆయన అంగీకారంతో …గారెలనుఇవాళ ప్రవేశపెట్టాం
నాణ్యమైన దినుసులతో భక్తులకు రుచికరమైన అన్నప్రసాదాలను మా అధికారులు వడ్డిస్తున్నారు
ఉ 10:30… pic.twitter.com/Mli9yayyoR
— B R Naidu (@BollineniRNaidu) March 6, 2025
తాజావార్తలు
-
Supreme Court: రెబల్ ఎంపీలపై పోరాటం.. సుప్రీంకోర్టులో పిటిషన్ వేయనున్న టీఎంసీ
-
India-Nepal Border Dispute: భారత్తో సరిహద్దు వివాదం.. ఒప్పంద పత్రాలు పోగొట్టుకున్న నేపాల్..
-
Kangana Ranaut: హరియాలీ తీజ్ వేడుకల్లో కంగనా రనౌత్తో కలిసి డ్యాన్స్ చేసిన ముఖ్యమంత్రి
-
Prashanth Neel: ‘డ్రాగన్’ షూటింగ్కు బ్రేక్.. ప్రభాస్తో ‘సలార్-2’ మొదలుపెట్టనున్న ప్రశాంత్ నీల్?
-
CM Revanth reddy: హిందూ, ముస్లింలు నా రెండు కళ్లు.. కేవలం మాటల్లో కాదు చేతల్లో చూపించామన్న సీఎం రేవంత్..
ట్రెండింగ్
-
బ్లాక్ డిజైన్, హైబ్రిడ్ పవర్తో Toyota Hyryder Aero Black Edition వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే..!
-
5,000 నిట్స్ డిస్ప్లే, 50MP కెమెరాలు, 6,500mAh బ్యాటరీతో Vivo X300 FE కొత్త వేరియంట్ లాంచ్..!
-
Airtel Recharge Plans: రూ.299 సహా 4 ప్రీపెయిడ్ ప్లాన్లు తొలగింపు.. ఇకపై కొత్త ఆప్షన్లు ఇవే.!
-
Money Plant Growing Tips: మానీ ప్లాంట్ వేగంగా, గుబురుగా పెరగాలంటే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి.!
-
CSK Head Coach: సీఎస్కే హెడ్ కోచ్గా వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్!