Tirumala: శ్రీవారి భక్తులకు శుభవార్త.. అన్నప్రసాదం మెనూలో అదనంగా చేరిన గారె..
- శ్రీవారి భక్తులకు మరో శుభవార్త చెప్పిన టీటీడీ..
- అన్నప్రసాదంలో మసాలా వడను చేర్చిన టీటీడీ..
- ప్రారంభించిన టీటీడీ చైర్మన్, ఈవో, అదనపు ఈవో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tirumala: శ్రీవారి దర్శనానికి తిరుమలకు వెళ్లే భక్తులు అన్నప్రసాదాన్ని మహా ప్రసాదంగా స్వీకరిస్తారు.. ఇప్పుడు శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) మరో శుభవార్త చెప్పింది.. తిరుమలలో భక్తులకు ఉచితంగా అందించే అన్నప్రసాదంలో మసాలా వడను చేర్చింది. తిరుమలలోని తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలో ఈ రోజు భక్తులకు వడ ప్రసాదం అందించే కార్యక్రమాన్ని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, టీటీడీ ఈవో శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరిలతో కలిసి అధికారికంగా ప్రారంభించారు. కాగా, ఇప్పటికే శ్రీవారి అన్నప్రసాద మెనులో మసాలా వడను చేర్చింది టీటీడీ.. అవి ఇప్పటి వరకు కొంతమందికే అందుతుండగా.. ఈ రోజు నుంచి పూర్తిస్థాయిలో అమల్లోకి తెచ్చారు..
Read Also: HYDRA: ఖాజాగూడలో చెరువులను పరిశీలించిన రంగనాథ్.. అధికారులకు కీలక సూచనలు..
Also Read
ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు మాట్లాడుతూ.. తాను టీటీడీ చైర్మన్గా పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత, అన్నప్రసాద మెనూలో భక్తులకు అదనపు వస్తువును వడ్డించే ఆలోచనను ముందుకు తెచ్చాను అన్నారు.. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లినప్పుడు, ఆయన ఆ ఆలోచనకు అంగీకరించి ఆమోదించారని గుర్తుచేసుకున్నారు.. ఆలయ నిర్వహణలో ఇప్పటికే అధిక నాణ్యత గల పదార్థాలతో భక్తులకు అన్నప్రసాదాలను అందిస్తున్నట్లు తెలియజేశారు. భక్తులకు వడ్డించే వడల తయారీలో పప్పు, పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా మరియు సోంపులను ఉపయోగిస్తారని వెల్లడించారు.. అన్న ప్రసాద కేంద్రంలో ప్రతిరోజూ ఉదయం 10.30 నుండి సాయంత్రం 4 గంటల వరకు సుమారు 35,000 వడలను భక్తులకు వడ్డిస్తారని.. భవిష్యత్తులో ఈ సంఖ్యను మరింత పెంచుతామని పేర్కొన్నారు..
Read Also: CPI Narayana: ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అయ్యాక భారతీయులకు రక్షణ లేదు..
ఇక, ఇదే విషయాన్ని సోషల్ మీడియా వేదికగా కొన్ని ఫోటోలను షేర్ చేస్తూ వెల్లడించారు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు.. తాను టీటీడీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించాక అన్నప్రసాదం మెనూలో అదనంగా ఒక పదార్థం పెట్టాలని ఆలోచన నాకు కలిగింది.. నా ఆలోచనను సీఎం దృష్టికి తీసుకెళ్లాను, ఆయన అంగీకారంతో.. గారెలను ఇవాళ ప్రవేశపెట్టాం.. నాణ్యమైన దినుసులతో భక్తులకు రుచికరమైన అన్నప్రసాదాలను మా అధికారులు వడ్డిస్తున్నారు.. ప్రతీ రోజు ఉదయం 10:30 నుండి సా 4 గంటల వరకు ప్రతిరోజు 35 వేల గారెలను భక్తులకు వడ్డిస్తాం.. భవిష్యత్తులో ఈ సంఖ్యను మరింతగా పెంచి, భక్తులకు రుచికరమైన భోజనం అందిస్తామని ఎక్స్ (ట్విట్టర్)లో పేర్కొన్నారు.
చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించాక అన్నప్రసాదం మెనూ లో అదనంగా ఒక పదార్థం పెట్టాలని ఆలోచన నాకు కలిగింది
నా ఆలోచనను సీఎం దృష్టికి తీసుకెళ్లాను, ఆయన అంగీకారంతో …గారెలనుఇవాళ ప్రవేశపెట్టాం
నాణ్యమైన దినుసులతో భక్తులకు రుచికరమైన అన్నప్రసాదాలను మా అధికారులు వడ్డిస్తున్నారు
ఉ 10:30… pic.twitter.com/Mli9yayyoR
— B R Naidu (@BollineniRNaidu) March 6, 2025
తాజావార్తలు
-
C Kalyan : ఒక్క సినిమా తీసిన నిర్మాతకు సైతం మెడిక్లైమ్ కార్డులు అందేలా చూస్తా
-
Ravi Teja: రవితేజకు ‘ఇరుముడి’ ఏం నేర్పింది? మాస్ మహారాజాలో ఈ మార్పు ఎప్పుడూ చూడలేదు!
-
Konda Surekha: కాంగ్రెస్ హైకమాండ్ కీలక నిర్ణయం.. మంత్రి కొండా సురేఖ బర్తరఫ్కు రంగం సిద్ధం?
-
Suriya – Karthi : సూర్య బ్యాక్ టు బ్యాక్ హిట్స్.. ఇప్పుడు కార్తీ వంతు
-
Polavaram Rehabilitation: తాడువాయిలోనే ఇళ్లు కావాలి.. పోలవరం నిర్వాసితుల భారీ ధర్నా!
ట్రెండింగ్
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!