విద్యార్థులకు అన్యాయం అసత్య ప్రచారం-మంత్రి ఆదిమూలపు సురేష్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అనంతపురంలోని SSBN కళాశాలలో చోటు చేసుకున్న ఘటన పై విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మీడియా సమావేశంలో వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… విద్యా ర్థులకు అన్యాయం జరుగుతుందని అసత్య ప్రచారం చేస్తున్నారని.. విద్యార్థి సంఘాలుగా చెప్పుకుంటున్న కొంత మంది విద్యా ర్థులను రెచ్చగొట్టారన్నారు. ఈ క్రమంలో వారు దాడికి పాల్పడ్డారని చెప్పారు.
పోలీసులు వచ్చి పరిస్థితిని అదుపులో పెట్టే ప్రయత్నం చేశారన్నారు మంత్రి సురేష్. ఈ సంఘటనను ప్రాథమిక నివేదికగా తీసుకున్నామన్న ఆయన.. 1991 నుంచి స్కూల్, ఇంటర్, డిగ్రీ కాలేజీలు ఈ ప్రాంగణంలో నడుస్తున్నాయన్నారు. గ్రాంట్ ఇన్ ఎయిడ్ను రద్దు చేసుకుంటున్నట్లు కాలేజీ ప్రభుత్వానికి స్పష్టం చేసిందన్నారు. విద్యా ర్థుల, తల్లిదండ్రులను పక్కదారి పట్టిస్తున్నారని మంత్రి ఆరోపించారు. రాష్ట్రంలో అలజడి సృష్టించాలనే కుట్రతోనే అనంతపురం ఘటనకు తెర లేపారన్నారు. ఒక విద్యార్థినిపై రాళ్లతో దాడి చేసి గాయపరిచారన్నారు. పోలీసులు ఎక్కడా దురుసుగా ప్రవర్తించలేదన్నారు. ఎక్కడి నుంచో రాయి వచ్చి తగిలిందని స్వయంగా గాయపడిన అమ్మాయి వీడియో విడుదల చేసిందని మంత్రి తెలిపారు.
Also Read
- AP Economic Growth: ఏపీకి గుడ్ న్యూస్.. ఎల్నినో ప్రభావం ఉన్నా ఆర్థిక వృద్ధిలో దూకుడు..
- Junior Doctors Strike: ఏపీలో జూడాల సమ్మె సైరన్
- OTR : అసెంబ్లీకి వైసీపీ..? DSC రచ్చ వేళ కూటమి అలర్ట్.. బీసీ బిల్లుపై కీలక నిర్ణయం..!
- Shocking Murder Case: ఆస్తి కోసం సొంత బామ్మర్దినే చంపిన బావ.. 27 రోజుల తర్వాత బయటపడ్డ అసలు నిజం!
అయినా రాజకీయం చేయటానికి లోకేష్, చంద్రబాబు రంగంలో దిగారని వారిపై మంత్రి మండిపడ్డారు. చంద్రబాబు ఎప్పుడైనా ఎయిడెడ్ విద్యా సంస్థల గురించి ఎప్పుడైనా సమీక్ష చేశారా అంటూ ఈ సందర్భంగా ఆయనను మంత్రి ప్రశ్నించారు. మంత్రి మాట్లాడు తుండగానే మంత్రి మీడియా సమావేశం ప్రాంగణంలోకి దూసుకు వచ్చిన విద్యార్థి సంఘాల నేతలు ఘెరావ్ చేశారు. దీంతో మంత్రి మీడియా సమావేశాన్ని మధ్యలోనే ఆపి విద్యార్థి సంఘాల నేతలతో మాట్లాడి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. అనంతపురం జిల్లా SSBN కళాశాలలో విద్యార్థుల పై లాఠీచార్జి ఘటన పై మంత్రి క్షమాపణలు చెప్పాలని విద్యార్థి సంఘాలు TNSF, PDSO డిమాండ్ చేస్తున్నాయి.
తాజావార్తలు
-
AP Economic Growth: ఏపీకి గుడ్ న్యూస్.. ఎల్నినో ప్రభావం ఉన్నా ఆర్థిక వృద్ధిలో దూకుడు..
-
Janhvi Kapoor: జాన్వీ కపూర్ ఓటీటీ ఎంట్రీ.. పా.రంజిత్ షో రన్నర్గా తమిళ సిరీస్!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Rahul Sipligunj : స్నేహితుడు ప్రేమ వ్యవహారంలో రాహుల్ సిప్లిగంజ్పై కేసు.. విశాఖలో FIR నమోదు
-
Delhi Alert: రెడ్ఫోర్ట్ నుంచి మెట్రో స్టేషన్ల వరకు నిఘా.. ఢిల్లీలో భద్రత కట్టుదిట్టం.. 19 మంది ఉగ్రవాదుల పోస్టర్లు విడుదల..
ట్రెండింగ్
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..
-
Beetroot Dosa: ఎప్పుడు మాములు దోసలేనా..? కొత్తగా క్రిస్పీ & హెల్దీ బీట్రూట్ దోస చేసేయండి ఇలా.!
-
890cc V-Twin ఇంజిన్, కొత్త చాసిస్, కొత్త లుక్ తో Ducati Monster V2 లాంచ్.. ధర ఎంతంటే..?
-
64MP కెమెరా, 9.49 మి.మీ. మందం, AI కెమెరా ఫీచర్లతో ఆగస్టు 25న రానున్న Boltt Ace 5G..!