Chandrababu, Revanth Reddy: రేపు తెలుగు రాష్ట్రాల సీఎంల సమావేశం.. అజెండా ఇదే
- తెలుగు రాష్ట్రాల సీఎంల సమావేశం అజెండా ఖరారు
- పది అంశాల అజెండాను సిద్దం చేసిన తెలుగు రాష్ట్రాలు
- ఏపీ నుంచి సమావేశానికి హాజరు కానున్న మంత్రులు అనగాని.. బీసీ జనార్దన్ రెడ్డి.. కందుల దుర్గేష్
- అధికారుల బృందంలో ఏపీ వైపు నుంచి సీఎస్.. ఆర్దిక శాఖ సహా కీలక విభాగాల కార్యదర్శుల హాజరు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రేపు తెలుగు రాష్ట్రాల సీఎంలు సమావేశం కానున్నారు. సాయంత్రం 6 గంటలకు వీరి మధ్య భేటీ జరగనుంది. అయితే.. ఇద్దరి సీఎల మధ్య చర్చించాల్సిన అంశాలపై అజెండా ఖరారు అయింది. పది అంశాల అజెండాను తెలుగు రాష్ట్రాలు సిద్ధం చేశాయి. కాగా.. ఏపీ నుంచి సమావేశానికి మంత్రులు అనగాని, బీసీ జనార్దన్ రెడ్డి, కందుల దుర్గేష్ హాజరు కానున్నారు. అలాగే.. అధికారుల బృందంలో ఏపీ వైపు నుంచి సీఎస్, ఆర్దిక శాఖ సహా కీలక విభాగాల కార్యదర్శులు హాజరు కానున్నారు. విభజన సమస్యల పరిష్కారం.. నిధులని వెనక్కు తెచ్చుకోవడమే అజెండాగా రేవంత్ తో భేటీ కానున్నారు చంద్రబాబు.
High blood pressure: అధిక రక్తపోటును నిర్లక్ష్యం చేస్తున్నారా.? చాలా ప్రమాదం..
Also Read
- AP Doctors: విధులకు గైర్హాజరైన 43 మoది డాక్టర్ల డిస్మిస్.. మరో 34 మంది రాజీనామా..
- Sai Krishna Incident: సాయికృష్ణ ఘటనపై సీఎం సీరియస్.. ఉన్నతస్థాయి విచారణకు ఆదేశాలు
- Beach Shacks in AP: గోవా తరహాలో ఏపీ బీచ్లలో బార్లు.. మార్గదర్శకాలు జారీ
- Shyamala: శాంతిభద్రతలపై మౌనం.. మేకప్పై స్పందన.. హోంమంత్రి వ్యాఖ్యలకు ఆరే శ్యామల కౌంటర్..
అంతేకాకుండా.. ఏపీ పునర్వవ్యస్థీకరణ చట్టంలోని షెడ్యూలు 9, 10 సంస్థల అస్తుల పంపకాలపై చర్చించుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. షీలా బీడే కమిటీ సిఫార్సులను సమీక్షించనున్నారు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు. తెలంగాణ నుంచి ఏపీకి రావలసిన విద్యుత్ బకాయిలు రూ. 7,200 వేల కోట్లు, ఏపీఎఫ్సీ అంశాల పై చర్చించనున్నారు. అంతేకాకుండా.. ఏపీ-తెలంగాణ మధ్య 15 ఈఏపీ ప్రాజెక్టుల రుణ పంపకాలపై సమీక్ష నిర్వహించనున్నారు. అలాగే.. ఉద్యోగుల పరస్పర బదిలీలు, లేబర్ సెస్ పంపకాలు, ఉమ్మడి సంస్థల ఖర్చుల చెల్లింపులపై చర్చించనున్నారు. మరోవైపు.. హైదరాబాదులోని మూడు భవనాలను ఏపీకి కేటాయించేలా చర్చించనున్నారు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని 9, 10 షెడ్యూల్లోని సంస్థల బ్యాంకు ఖాతాల్లో భారీ ఎత్తున నగదు.. విభజన పూర్తి కానీ సంస్థల బ్యాంకు ఖాతాల్లో రూ 8,000 కోట్లు ఉంది. గత 10 ఏళ్లుగా బ్యాంకుల్లో వేల కోట్ల రూపాయలు ఉన్నాయి.
Hardik Pandya: కొడుకుతో కలిసి సంబరాలు జరుపుకున్న హార్దిక్..కనిపించని నటాషా
ఏపీ, తెలంగాణ మధ్య గత 10 ఏళ్లుగా సంస్థల విభజన పూర్తి కాలేదు. ఈ సంస్థలకు చెందిన రూ. 8,000 కోట్లు రెండు రాష్ట్రాలు వినియోగించుకోలేకున్నాయి. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలు అభివృద్ధికి, సంక్షేమ కార్యక్రమాలకు నిధుల కొరత ఉంది. అలాగే 9వ షెడ్యూల్లో ఉన్న అగ్రస్థాయి సంస్థల్లో ఏపీ జెన్కో విలువ రూ.2,448 కోట్లుగా నిర్ధారణ అయింది. అత్యల్పంగా ఏపీ మార్కెటింగ్ ఫెడరేషన్ మార్క్ ఫెడ్ విలువ ఉంది. 10వ షెడ్యూల్లో ఉన్న సంస్థల్లో రూ.2,994 కోట్ల నిధులు ఉన్నాయి. వీటికి సంబంధించి ఇప్పటికే రూ.1,559 కోట్లను పంచుకున్నాయి. కాగా.. రూ.1,435 కోట్ల రూపాయల విషయంలో ఇంకా పంచాయితీ తేలలేదు. చట్టంలో పేర్కొనని సంస్థల విభజన పైనా కూడా సీఎంలు సమీక్ష చేపట్టనున్నారు.
తాజావార్తలు
-
Chicken Bones : చికెన్ తిన్నాక ఎముకలను పారేస్తున్నారా.? వాటితో ఎన్నో ప్రయోజనాలు.!
-
India-UK: జూలై 15 నుంచి స్వేచ్ఛా వాణిజ్య అమలు.. ఏవేవి తగ్గనున్నాయంటే..!
-
Ghaziabad Jewelry Heist: మందు పార్టీ ఇచ్చి మరీ రూ.4 కోట్లు లేపేశాడు.. ప్రియురాలి కోసం ప్రియుడు వేసిన ‘గోల్డెన్’ స్కెచ్!
-
Akash Deep Wedding: టీమిండియా ఫాస్ట్ బౌలర్ ఇంట పెళ్లి బాజాలు.. పూర్తి షెడ్యూల్ విడుదల
-
Rahul Gandhi: భారత విద్యా వ్యవస్థ పిల్లల్ని అణచివేస్తోంది.. రాహుల్గాంధీ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Hair Care Tips : జుట్టు త్వరగా జిడ్డుగా మారుతోందా? ఈ సింపుల్ టిప్స్తో రోజంతా ఫ్రెష్గా!
-
Cleaning Hacks : బాత్రూమ్ బకెట్లు నల్లగా మారాయా.? ఈ ఒక్క చిట్కాతో కొత్తవాటిలా మెరిపించండి.!
-
Vaibhav Sooryavanshi Controversy: వైభవ్ అవుట్పై వివాదం.. థర్డ్ అంపైర్ నిర్ణయంపై అఫ్గాన్ ప్లేయర్స్ అసంతృప్తి!
-
Ragi Bun Dosa: ఆరోగ్యం, రుచి రెండూ ఒకేచోట.. స్పాంజీ లాంటి ‘రాగి బన్ దోస’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Wedding Expenses: పెళ్లి ముహూర్తాలకు వేళాయే.. తక్కువ టైమ్ ఉండటంతో తెలుగు ఇళ్లల్లో బడ్జెట్ టెన్షన్!!