Chandrababu, Revanth Reddy: రేపు తెలుగు రాష్ట్రాల సీఎంల సమావేశం.. అజెండా ఇదే
- తెలుగు రాష్ట్రాల సీఎంల సమావేశం అజెండా ఖరారు
- పది అంశాల అజెండాను సిద్దం చేసిన తెలుగు రాష్ట్రాలు
- ఏపీ నుంచి సమావేశానికి హాజరు కానున్న మంత్రులు అనగాని.. బీసీ జనార్దన్ రెడ్డి.. కందుల దుర్గేష్
- అధికారుల బృందంలో ఏపీ వైపు నుంచి సీఎస్.. ఆర్దిక శాఖ సహా కీలక విభాగాల కార్యదర్శుల హాజరు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రేపు తెలుగు రాష్ట్రాల సీఎంలు సమావేశం కానున్నారు. సాయంత్రం 6 గంటలకు వీరి మధ్య భేటీ జరగనుంది. అయితే.. ఇద్దరి సీఎల మధ్య చర్చించాల్సిన అంశాలపై అజెండా ఖరారు అయింది. పది అంశాల అజెండాను తెలుగు రాష్ట్రాలు సిద్ధం చేశాయి. కాగా.. ఏపీ నుంచి సమావేశానికి మంత్రులు అనగాని, బీసీ జనార్దన్ రెడ్డి, కందుల దుర్గేష్ హాజరు కానున్నారు. అలాగే.. అధికారుల బృందంలో ఏపీ వైపు నుంచి సీఎస్, ఆర్దిక శాఖ సహా కీలక విభాగాల కార్యదర్శులు హాజరు కానున్నారు. విభజన సమస్యల పరిష్కారం.. నిధులని వెనక్కు తెచ్చుకోవడమే అజెండాగా రేవంత్ తో భేటీ కానున్నారు చంద్రబాబు.
High blood pressure: అధిక రక్తపోటును నిర్లక్ష్యం చేస్తున్నారా.? చాలా ప్రమాదం..
Also Read
- AP Government: ముగ్గురు పిల్లలున్న కుటుంబాలకు రూ.5 వేలు.. ప్రోత్సాహకాలు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం..
- OTR : ప్రజా సమస్యలపై వామపక్షాలతో కలిసి వైసీపీ పోరాటం..?
- AP Govt: భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఇక నుంచి 250 సరుకులు.. రూ.5 తక్కువకే..
- OTR : గంటాకు క్లీన్ చిట్ మిషన్.. కలెక్టర్కు లేఖ వెనుక అసలు కథ.!
అంతేకాకుండా.. ఏపీ పునర్వవ్యస్థీకరణ చట్టంలోని షెడ్యూలు 9, 10 సంస్థల అస్తుల పంపకాలపై చర్చించుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. షీలా బీడే కమిటీ సిఫార్సులను సమీక్షించనున్నారు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు. తెలంగాణ నుంచి ఏపీకి రావలసిన విద్యుత్ బకాయిలు రూ. 7,200 వేల కోట్లు, ఏపీఎఫ్సీ అంశాల పై చర్చించనున్నారు. అంతేకాకుండా.. ఏపీ-తెలంగాణ మధ్య 15 ఈఏపీ ప్రాజెక్టుల రుణ పంపకాలపై సమీక్ష నిర్వహించనున్నారు. అలాగే.. ఉద్యోగుల పరస్పర బదిలీలు, లేబర్ సెస్ పంపకాలు, ఉమ్మడి సంస్థల ఖర్చుల చెల్లింపులపై చర్చించనున్నారు. మరోవైపు.. హైదరాబాదులోని మూడు భవనాలను ఏపీకి కేటాయించేలా చర్చించనున్నారు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని 9, 10 షెడ్యూల్లోని సంస్థల బ్యాంకు ఖాతాల్లో భారీ ఎత్తున నగదు.. విభజన పూర్తి కానీ సంస్థల బ్యాంకు ఖాతాల్లో రూ 8,000 కోట్లు ఉంది. గత 10 ఏళ్లుగా బ్యాంకుల్లో వేల కోట్ల రూపాయలు ఉన్నాయి.
Hardik Pandya: కొడుకుతో కలిసి సంబరాలు జరుపుకున్న హార్దిక్..కనిపించని నటాషా
ఏపీ, తెలంగాణ మధ్య గత 10 ఏళ్లుగా సంస్థల విభజన పూర్తి కాలేదు. ఈ సంస్థలకు చెందిన రూ. 8,000 కోట్లు రెండు రాష్ట్రాలు వినియోగించుకోలేకున్నాయి. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలు అభివృద్ధికి, సంక్షేమ కార్యక్రమాలకు నిధుల కొరత ఉంది. అలాగే 9వ షెడ్యూల్లో ఉన్న అగ్రస్థాయి సంస్థల్లో ఏపీ జెన్కో విలువ రూ.2,448 కోట్లుగా నిర్ధారణ అయింది. అత్యల్పంగా ఏపీ మార్కెటింగ్ ఫెడరేషన్ మార్క్ ఫెడ్ విలువ ఉంది. 10వ షెడ్యూల్లో ఉన్న సంస్థల్లో రూ.2,994 కోట్ల నిధులు ఉన్నాయి. వీటికి సంబంధించి ఇప్పటికే రూ.1,559 కోట్లను పంచుకున్నాయి. కాగా.. రూ.1,435 కోట్ల రూపాయల విషయంలో ఇంకా పంచాయితీ తేలలేదు. చట్టంలో పేర్కొనని సంస్థల విభజన పైనా కూడా సీఎంలు సమీక్ష చేపట్టనున్నారు.
తాజావార్తలు
-
Telangana : ఇకపై ఫస్టియర్, సెకండియర్ విద్యార్థులకు వేర్వేరుగా ప్రాక్టికల్స్.!
-
Vaibhav Sooryavanshi: ‘వైభవ్ కేవలం ట్రైలర్ మాత్రమే చూపించాడు.. ముందుంది సినిమా’..
-
OTR : బీఆర్ఎస్ కు మల్లారెడ్డి దూరమైనట్టేనా..?
-
AP Government: ముగ్గురు పిల్లలున్న కుటుంబాలకు రూ.5 వేలు.. ప్రోత్సాహకాలు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం..
-
Chairman’s Desk : సీఎం స్పీడుని మంత్రులు అందుకోవడం లేదా..? ప్రతిపక్షాల గళం పదునెక్కుతోందా..?
ట్రెండింగ్
-
Chanakya Neeti : చాణక్య హెచ్చరిక.. ఇలాంటి వారిని పెళ్లి చేసుకోకండి.!
-
Gardening Tips : మీ గులాబీ మొక్కలు వాడిపోతున్నాయా? మీరు చేసే ఈ 4 తప్పులే దానికి కారణం!
-
Rainy Season Tips : వర్షాకాలంలో వచ్చే రోగాలకు బై..బై.. 5 అద్భుతమైన ఇంటి చిట్కాలు.!
-
IND Playing XI vs ENG: మూడో టీ20లో ఈ ముగ్గురు ఔట్.. టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే!
-
Ellyse Perry: లార్డ్స్లో ఇంగ్లండ్ను ఓడించాం.. ఆ మజానే వేరప్ప.. ఆస్ట్రేలియా అందం ఆనందం!