Amaravati Padayatra: నిడదవోలులో ఉద్రిక్తత.. జేఏసీ వర్సెస్ రైతులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమరావతి రైతుల మహా పాదయాత్ర తూర్పుగోదావరి జిల్లాలో కొనసాగుతోంది. నిడదవోలు ఓవర్ బ్రిడ్జి వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. అమరావతి రైతులకు వ్యతిరేకంగా జేఏసీ నేతల నినాదాలతో హోరెత్తింది. మూడు రాజధానులు ముద్దు, ఫేక్ యాత్రికులు గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు జేఏసీ నేతలు. అక్కడికి భారీగా చేరుకున్న వైసీపీ నేతలు, నల్ల బెలూన్లతో నిరసన తెలిపారు. అమరావతి రైతు యాత్ర ఇక్కడికి చేరుకోవడంతో భారీగా మోహరించిన పోలీసులు, పరిస్థితిని అదుపులోకి తేవడానికి ప్రయత్నిస్తున్నారు. నిడదవోలులో రైతుల పాదయాత్ర పైకి దూసుకు వచ్చేందుకు ప్రయత్నించారు జేఏసీ, వైసీపీ నేతలు. వెంటనే అదుపు చేశారు పోలీసులు, రైతులు మద్దతు దారులు, జేఏసీ నాయకులు పోటా పోటీ నినాదాలతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
ఇదిలా వుంటే.. అయిదేళ్లు చంద్రబాబు పాలనలో అమరావతిలో షెడ్లు కూడా నిర్మించలేకపోయారన్నారు. విజయవాడలో ఆఫీస్ లు పెట్టి అమరావతిలో పెట్టామని చెప్పుకున్నారు..అమరావతి రైతుల యాత్రను చంద్రబాబే నడుపుతున్నాడు..వెనుకబడిన ఉత్తరాంధ్ర లో రాజధాని ఉండాలి…అటవీప్రాంతం వంటి అమరావతి ఎప్పటికీ అభివృద్ధి చెందదు.. చంద్రబాబు అమరావతి రాజధాని నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలన్నారు డిప్యూటీ స్పీకర్, కోలగట్ల వీరభద్రస్వామి.
Also Read
లక్ష మందితో విశాఖ గర్జన ర్యాలీ వుంటుందన్నారు విశాఖ సీపీ శ్రీకాంత్. 3.7కి.మీ. దూరం జేఏసీ పాదయాత్ర.. ..పవన్ కళ్యాణ్ పర్యటన, టీడీపీ మీటింగ్, గర్జన ఒకే రోజు ఉండటంతో 1000 మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటుచేశామన్నారు. పవన్ కళ్యాణ్ టూర్ మధ్యాహ్నం ఉంటుందన్నారు. .ట్రాఫిక్ ఆంక్షలు అమలులోకి రావడంతో గర్జన జరిగే సమయంలో ప్రజలు సహకరించాలని ఆయన కోరారు. పవన్ కళ్యాణ్ టూర్ సందర్భంగా ర్యాలీ కోసం జనసేన ఎటువంటి అనుమతి కోరలేదన్నారు విశాఖ సీపీ శ్రీకాంత్.
Read Also: Assam CM: అస్సాం ముఖ్యమంత్రికి ‘జెడ్ ప్లస్’ సెక్యూరిటీ.. అందుకేనా?
విశాఖ గర్జన కార్యక్రమం ఫెయిల్ చేయాలనే పవన్ కళ్యాణ్ 15 న జనవాణి కార్యక్రమం ప్రకటించారని మండిపడ్డారు మంత్రి అమర్నాథ్.. పవన్ కళ్యాణ్ మాకు చీరలు ఇస్తా అంటున్నారు…వైసీపీ నాయకులకు చీరలు ఇచ్చే బదులు, భార్యాభర్తలుగా కలిసి తిరుగుతున్న మనోహర్ కి ఆ చీర ఇవ్వాలని ఎద్దేవా చేశారు. రేపు నాన్ పొలిటికల్ జేఏసీ ఇచ్చిన విశాఖ గర్జనకు వైసీపీ పూర్తి మద్దతు వుంటుందన్నారు. విశాఖ గర్జన ర్యాలీలో లక్షలాది మంది పాల్గొంటారని ఇంటలిజెన్స్ రిపోర్ట్ ఉందన్నారు.. వెనుకబడిన ఉత్తరాంధ్రకు రాజధాని కావాలన్నారు మంత్రి గుడివాడ అమర్నాథ్.
Read ALso: Smriti Irani: ఆమె చేసిన ఏకైక నేరం.. నరేంద్ర మోడీకి జన్మనివ్వడమేనా..
తాజావార్తలు
-
Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
-
Shreyas Iyer: చరిత్రను లిఖించనున్న శ్రేయస్ అయ్యర్.. 2028 వరకు కెప్టెన్గా సర్పంచ్ సాబ్..
-
Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
-
NTR Viral Tweet: కుకీలు పంపమన్న అభిమాని.. ఎన్టీఆర్ క్రేజీ రిప్లై ట్వీట్ వైరల్!
-
Natural gas: భారత్కు జాక్పాట్.. అండమాన్లో గ్యాస్ నిల్వలు..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!