Amaravati Maha Padayatra: పాదయాత్రలో ఉద్రిక్తత.. 3 రాజధానులు కావాలని వైసీపీ నినాదాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత వారం రోజులుగా అమరావతి రైతుల మహా పాదయాత్ర పశ్చిమగోదావరి జిల్లాలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. టీడీపీ, జనసైనికులు, బీజేపీ, సీపీఐ, సీపీఎం ,దళిత సంఘ నాయకులు..రైతులు వామపక్ష నేతలు పాదయాత్రలో పాల్గొన్నారు. వందలాదిగా తరలివచ్చిన వీరమహిళలు,రైతులు ,అభిమానులు అమరావతి రైతులకు అండగా బ్రహ్మరథం పడుతున్నారు. రంగురంగుల బెలూన్లతో పాదయాత్ర జరిగే రోడ్ల వెంట అమరావతి రైతులు నినాదాలు చేస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లా ఇరగవరం మండలం ఐతంపూడి చేరుకుంది అమరావతి రైతుల మహా పాదయాత్ర. అయితంపూడి గ్రామంలో నిరసన చేసేందుకు వైసీపీ శ్రేణులు సిద్ధం అయ్యాయి. దీంతో అమరావతి మహాపాదయాత్రలో ఉద్రిక్తత చోటుచేసుకుంది.

Also Read
- CM Chandrababu Vizag Tour: రేపు విశాఖకు సీఎం చంద్రబాబు..
- AP NDA: కూటమి భారీ ప్లాన్.. రెండేళ్ల పాలన ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కార్యాచరణ
- NDA Meeting Andhra Pradesh: ఎన్డీఏ భేటీలో రాజ్యసభ స్థానాల పంపకం.. టీడీపీకి 3, జనసేనకు 1..?
- Pawan Kalyan: పాత వీడియో షేర్ చేసిన పవన్ కల్యాణ్.. తెలంగాణపై నా వైఖరి ఇదే..!
పశ్చిమగోదావరి జిల్లాలో రైతుల పాదయాత్రలో టెన్షన్ వాతావరణం ఏర్పడింది. మాజీ మంత్రి పితాని సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, వైసీపీ నేతలు మధ్య తోపులాట జరిగింది. ఒకే రాజధాని అంటూ టీడీపీ నేతలు మూడు రాజధానులు కావాలని వైసీపీ నేతలు పోటాపోటీగా నినాదాలు చేశారు. MLC అంగర రామ్మోహనరావు కాళ్ళు మొక్కి మరీ 3 రాజధానులు కావాలని నిరసన వ్యక్తం చేశాడో వైస్సార్సీపీ కార్యకర్త.
టీడీపీ నేతలతో వాగ్వాదానికి దిగడంతో పాదయాత్ర ప్రాంతంలో ఉద్రిక్తత ఏర్పడింది. ఇదిలా వుంటే.. అమరావతి రైతుల పాదయాత్రకు వ్యతిరేకంగా ఇరగవరం మండలంలో రోడ్డు పొడవునా వైసీపీ(YCP) భారీస్థాయిలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది. రైతుల ముసుగులో ఫేక్ యాత్రికులు గో బ్యాక్ అంటూ తణుకు నియోజకవర్గ వైస్సార్సీపీ నేతలు ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. మహిళలు కూడా నల్ల కండువాలు ధరించి, ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు.
తాజావార్తలు
-
CM Chandrababu Vizag Tour: రేపు విశాఖకు సీఎం చంద్రబాబు..
-
MS Dhoni: ఇన్వెస్టర్లకు అదిరే న్యూస్.. ధోని మద్దతిస్తున్న కంపెనీ ఐపీఓకు రెడీ.. రూ.1500 కోట్లే లక్ష్యంగా..
-
Delimitation Bill: మళ్లీ తెరపైకి డీలిమిటేషన్ బిల్లు.. 2029 ఎన్నికలే లక్ష్యంగా కేంద్రం కసరత్తు?
-
AP NDA: కూటమి భారీ ప్లాన్.. రెండేళ్ల పాలన ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కార్యాచరణ
-
Vaibhav Brand Value: ఐపీఎల్ సంచలనం వైభవ్ సూర్యవంశీ బ్రాండ్ వాల్యూ షురూ.. ఏడాదికి 2 కోట్లు..
ట్రెండింగ్
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!