Krishna Water: కృష్ణా నీటిపై రెండు రాష్ట్రాల రగడ.. వాటా ఖరారు చేయాలని తెలంగాణ డిమాండ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Krishna Water: కృష్ణాజలాల గురించి చాలా కాలంగా సమస్యలు ఉన్నాయి. నీటి వినియోగానికి సంబంధించి వాస్తవంగా దక్కాల్సిన వాటా తమకు దక్కడం లేదని తెలంగాణ రాష్ట్రం వెల్లడించింది. ఈ క్రమంలోనే ఈ ఏడాదికి సంబంధించి కృష్నా జలాల వాడకం పై కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ముందు పలు డిమాండ్లను ఉంచింది. ఇందులో ఒకటి ఈ ఏడాదికి సంబంధించి ఏపీ, తెలంగాణల కృష్ణా జలాల వినియోగాన్ని లెక్కించింది. కృష్ణా జలాల నీటిని రెండు రాష్ట్రాలు వాస్తవంగా వినియోగాన్ని నిర్ణయించాలని కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డును తెలంగాణ ప్రభుత్వం డిమాండ్ చేసింది.
Read also: Flyovers Shutdown: నేడే మహా శివరాత్రి, షబ్ ఈ మేరజ్.. నగరంలోని ఫ్లై ఓవర్లు బంద్
Also Read
- IAS Krishna Teja: పంచాయతీ నిధుల గోల్మాల్.. వైరల్గా మారిన కమిషనర్ కృష్ణతేజ వార్నింగ్..
- Saikrishna Lockup Death: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ దూకుడు.. మరో ఇద్దరు పోలీసుల కోసం గాలింపు!
- NRI: అంతిమ శ్వాస భారత్లోనే... అమెరికా పౌరసత్వం ఉన్న బాపట్ల వృద్ధురాలి కన్నీటి విజ్ఞప్తి!
- AP Government Schools: ప్రైవేట్ స్కూళ్లకు షాక్.. ప్రభుత్వ పాఠశాలల్లో భారీగా విద్యార్థుల చేరిక
ప్రస్తుత నీటి సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు కృష్ణా నీటి వినియోగాన్ని లెక్కించి రెండు రాష్ట్రాల వాస్తవ నీటి వినియోగాన్ని నిర్ణయించాలని తెలంగాణ ప్రభుత్వం కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కెఆర్ఎంబి)ని కోరింది. శుక్రవారం కేఆర్ఎంబీ త్రిసభ్య కమిటీ ముందు తెలంగాణ ఇంజనీర్ ఇన్ చీఫ్ మురళీధర్ ప్రభుత్వ వాదనలు వినిపించారు. రెండు రాష్ట్రాలు నీటి వినియోగాన్ని లెక్కించడం ద్వారా ప్రతి ఒక్కరు వాస్తవంగా ఎంత నీటిని ఉపయోగించారు, ఎంత ఉపయోగించాల్సి ఉందో తెలుస్తుందని చెప్పారు. నీటి వినియోగంలో తెలంగాణకు సరైన వాటా రావడం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుత సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే తన కోటా కంటే ఎక్కువగా కృష్ణా నీటిని వినియోగించుకుందని ఇరిగేషన్ అధికారి బోర్డు దృష్టికి తీసుకొచ్చారు.
Read also: SR Nagar Robbery: ఎస్ఆర్ నగర్ చోరీ కేసులో ట్విస్ట్.. ఆభరణాల దొంగ అతనే..
తెలంగాణకు ఇంకా 141 టీఎంసీలు వినియోగించుకునే అవకాశం ఉండగా, తెలంగాణ వాదనల అనంతరం ఆంధ్రప్రదేశ్ ఇంజినీర్ ఇన్ చీఫ్ నారాయణరెడ్డి గైర్హాజరు కావడంతో కమిటీ సమావేశాన్ని వాయిదా వేసింది. తదుపరి సమావేశం మార్చిలో జరిగే అవకాశం ఉందని కమిటీ సభ్యులు తెలిపారు. అయితే..కృష్ణా జలాలను ఆంధ్రప్రదేశ్ అధికంగా వాడుకుంటున్న విషయాన్ని తెలంగాణ లేవనెత్తుతోందని.. మరిన్ని కేటాయింపులతో భర్తీ చేయాలని డిమాండ్ చేసింది. తెలంగాణ వాదనలను ఆంధ్రప్రదేశ్ ఖండించింది. కేటాయింపుల్లో మార్పులు చేయాలని డిమాండ్ చేసింది. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య 50:50 శాతం కృష్ణా జలాలను కేటాయించాలని తెలంగాణ డిమాండ్ చేస్తోంది. అదే సమయంలో ఈ నిష్పత్తిని 70:30 శాతానికి సవరించాలని ఏపీ పట్టుబట్టింది. కాగా, మార్చిలో జరిగే కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) సమావేశంలో దీనిపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అయితే.. శ్రీశైలం రిజర్వాయర్ నుంచి విద్యుత్, నీటిని పంచుకునే విషయంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య వాదనలు కొనసాగుతూనే ఉన్నాయి. గతేడాది డిసెంబర్ లో కృష్ణా జలాలపై కేఆర్ఎంబీ ఆలోచనను తెలంగాణ ప్రభుత్వం తిరస్కరించిన సంగతి తెలిసిందే.
Rajanna Temple: రాజన్న ఆలయానికి హెలికాప్టర్ సేవలు.. చెరువు ప్రాంతంలో దిగేందుకు..
తాజావార్తలు
-
Laundry Tips: వర్షాకాలంలో బట్టలు వాసన వస్తున్నాయా? సింపుల్గా ఇలా చేసేయండి!
-
Smartphone Restart Benefits: స్మార్ట్ఫోన్ను రీస్టార్ట్ చేయాలా?.. టెక్ నిపుణులు చెబుతున్న సీక్రెట్స్..
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
IND Vs IRE: వైభవ్ సూర్యవంశీకి బిగ్షాక్.. తుది జట్టులో దక్కని స్థానం.. కారణం ఇదే..
-
Prashant Kishor: తొలిసారి ఎన్నికల బరిలోకి ప్రశాంత్ కిశోర్.. పోటీ ఎక్కడ్నుంచంటే..!
ట్రెండింగ్
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?