Krishna Water: కృష్ణా నీటిపై రెండు రాష్ట్రాల రగడ.. వాటా ఖరారు చేయాలని తెలంగాణ డిమాండ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Krishna Water: కృష్ణాజలాల గురించి చాలా కాలంగా సమస్యలు ఉన్నాయి. నీటి వినియోగానికి సంబంధించి వాస్తవంగా దక్కాల్సిన వాటా తమకు దక్కడం లేదని తెలంగాణ రాష్ట్రం వెల్లడించింది. ఈ క్రమంలోనే ఈ ఏడాదికి సంబంధించి కృష్నా జలాల వాడకం పై కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ముందు పలు డిమాండ్లను ఉంచింది. ఇందులో ఒకటి ఈ ఏడాదికి సంబంధించి ఏపీ, తెలంగాణల కృష్ణా జలాల వినియోగాన్ని లెక్కించింది. కృష్ణా జలాల నీటిని రెండు రాష్ట్రాలు వాస్తవంగా వినియోగాన్ని నిర్ణయించాలని కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డును తెలంగాణ ప్రభుత్వం డిమాండ్ చేసింది.
Read also: Flyovers Shutdown: నేడే మహా శివరాత్రి, షబ్ ఈ మేరజ్.. నగరంలోని ఫ్లై ఓవర్లు బంద్
Also Read
- Chittoor: లిక్కర్ వ్యాన్ బోల్తా.. బాటిళ్ల కోసం ఎగబడ్డ జనం.!
- Parvathipuram Manyam: పామాయిల్, జీడి తోటల్లో ఏనుగుల బీభత్సం.. భయంతో వణికిపోతున్న రైతులు.!
- Vinukonda: అత్యాచారం చేశాడంటూ ఫిర్యాదు.. పోలీస్ స్టేషన్ లో లొంగిపోయిన మాజీ సీఐ చినమల్లయ్య.!
- Pawan Kalyan: జనసేనలో సంస్థాగత పునర్వ్యవస్థీకరణ.. పవన్ కళ్యాణ్ మాస్టర్ ప్లాన్ ఇదే..
ప్రస్తుత నీటి సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు కృష్ణా నీటి వినియోగాన్ని లెక్కించి రెండు రాష్ట్రాల వాస్తవ నీటి వినియోగాన్ని నిర్ణయించాలని తెలంగాణ ప్రభుత్వం కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కెఆర్ఎంబి)ని కోరింది. శుక్రవారం కేఆర్ఎంబీ త్రిసభ్య కమిటీ ముందు తెలంగాణ ఇంజనీర్ ఇన్ చీఫ్ మురళీధర్ ప్రభుత్వ వాదనలు వినిపించారు. రెండు రాష్ట్రాలు నీటి వినియోగాన్ని లెక్కించడం ద్వారా ప్రతి ఒక్కరు వాస్తవంగా ఎంత నీటిని ఉపయోగించారు, ఎంత ఉపయోగించాల్సి ఉందో తెలుస్తుందని చెప్పారు. నీటి వినియోగంలో తెలంగాణకు సరైన వాటా రావడం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుత సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే తన కోటా కంటే ఎక్కువగా కృష్ణా నీటిని వినియోగించుకుందని ఇరిగేషన్ అధికారి బోర్డు దృష్టికి తీసుకొచ్చారు.
Read also: SR Nagar Robbery: ఎస్ఆర్ నగర్ చోరీ కేసులో ట్విస్ట్.. ఆభరణాల దొంగ అతనే..
తెలంగాణకు ఇంకా 141 టీఎంసీలు వినియోగించుకునే అవకాశం ఉండగా, తెలంగాణ వాదనల అనంతరం ఆంధ్రప్రదేశ్ ఇంజినీర్ ఇన్ చీఫ్ నారాయణరెడ్డి గైర్హాజరు కావడంతో కమిటీ సమావేశాన్ని వాయిదా వేసింది. తదుపరి సమావేశం మార్చిలో జరిగే అవకాశం ఉందని కమిటీ సభ్యులు తెలిపారు. అయితే..కృష్ణా జలాలను ఆంధ్రప్రదేశ్ అధికంగా వాడుకుంటున్న విషయాన్ని తెలంగాణ లేవనెత్తుతోందని.. మరిన్ని కేటాయింపులతో భర్తీ చేయాలని డిమాండ్ చేసింది. తెలంగాణ వాదనలను ఆంధ్రప్రదేశ్ ఖండించింది. కేటాయింపుల్లో మార్పులు చేయాలని డిమాండ్ చేసింది. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య 50:50 శాతం కృష్ణా జలాలను కేటాయించాలని తెలంగాణ డిమాండ్ చేస్తోంది. అదే సమయంలో ఈ నిష్పత్తిని 70:30 శాతానికి సవరించాలని ఏపీ పట్టుబట్టింది. కాగా, మార్చిలో జరిగే కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) సమావేశంలో దీనిపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అయితే.. శ్రీశైలం రిజర్వాయర్ నుంచి విద్యుత్, నీటిని పంచుకునే విషయంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య వాదనలు కొనసాగుతూనే ఉన్నాయి. గతేడాది డిసెంబర్ లో కృష్ణా జలాలపై కేఆర్ఎంబీ ఆలోచనను తెలంగాణ ప్రభుత్వం తిరస్కరించిన సంగతి తెలిసిందే.
Rajanna Temple: రాజన్న ఆలయానికి హెలికాప్టర్ సేవలు.. చెరువు ప్రాంతంలో దిగేందుకు..
తాజావార్తలు
-
Malkajgiri: ఎట్టకేలకు చిక్కిన నేపాలీ గ్యాంగ్.. వెలుగులోకి షాకింగ్ నిజాలు..
-
Dream Numbers Lottery: కలలో వచ్చిన నంబర్లలే జీవితాన్ని మార్చేశాయి.. కూరగాయలు అమ్మే మహిళకు రూ.2 కోట్ల లాటరీ!
-
AFG vs IND: లంచ్ బ్రేక్.. ఆచితూచి ఆడుతున్న భారత బ్యాటర్లు.!
-
Tamil Nadu: విత్తనాలు చల్లింది అన్నామలై.. పంట కోసుకున్నది విజయ్.. తమిళ గడ్డపై “సింగం” ఫార్ములా బ్లాక్బస్టర్!!
-
Athiradi OTT Release Date: 65 కోట్ల మలయాళ హిట్ మూవీ ఓటీటీలోకి… తెలుగులోనూ స్ట్రీమింగ్
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!