తెలుగుదేశం.. ప్లాన్ బీ అమలుకు సిద్ధమైంది..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుత ప్రభుత్వానికి.. సగం కాలపరిమితి తీరింది. మరో రెండేళ్లైతే.. ఎన్నికల హడావుడి మొదలవుతుంది. ఈ లోపు ప్రజల్లో బలం పెంచుకోవాలి. బలగాన్ని కదిలించాలి. గెలుపే ధ్యేయంగా కార్యకర్తలను కార్యోన్ముఖులను చేయాలి. ఇదే పనిలో ఉంది.. తెలుగుదేశం పార్టీ. ఇప్పటికే.. సమస్య చిన్నదైనా.. పెద్దదైనా.. ఎలాంటిదైనా.. జనాల్లోకి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ నాయకత్వంలో వెళ్లి పోరాడుతోంది.
ఇప్పుడు.. మిగతా వర్గాలనూ.. రంగంలోకి దించేందుకు కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలోనే.. ఈ నెల 13 నుంచి.. అంటే రేపటి నుంచే.. మరో ఆందోళనకు టీడీపీ శ్రీకారం చుట్టింది. లోక్ సభ నియోజకవర్గ కేంద్రాల్లో.. పార్టీ శ్రేణులను పోరాట పథంలోకి తీసుకువెళ్తోంది. రైతు సమస్యలే ప్రాతిపదికగా.. తాజా కార్యక్రమాన్ని రూపొందించింది. ఈ విషయాన్ని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు.. మీడియాకు వెల్లడించారు.
Also Read
- Paraquat Herbicide Ban: హైకోర్టుకు చేరిన గడ్డి మందు వివాదం.. ప్రభుత్వ జీవోపై సవాల్
- President Murmu AP Visit: విశాఖ పర్యటనకు రాష్ట్రపతి.. గిరిజన వర్సిటీ స్నాతకోత్సవానికి ముర్ము..
- Sai Krishna Missing Case: సాయికృష్ణ కేసులో కొత్త ట్విస్ట్.. కృష్ణలంక పీఎస్ సీసీటీవీలపై ఏసీపీ టీమ్ ఫోకస్..
- Sai Krishna Missing Case: సాయి కృష్ణ కుటుంబానికి అండగా ప్రభుత్వం.. సీఎం భరోసాతో సంతృప్తి వ్యక్తం చేసిన తల్లి
మొత్తంగా 5 రోజులపాటు.. 25 నియోజకవర్గాల్లో.. పోరాటాన్ని ప్లాన్ చేశారు. 13న ఉత్తరాంధ్ర, 14న రాయలసీమ, 15న ఉభయ గోదావరి జిల్లాలు, 16న దక్షిణ కోస్తా.. చిత్తూరు జిల్లాలు, 17న సెంట్రల్ ఆంధ్రా పరిధిలోని ప్రాంతాల్లో రైతుల కోసం.. వారి సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పోరాడనున్నట్టు అచ్చెన్న తెలిపారు. ఈ కార్యక్రమానికి.. రైతు కోసం తెలుగుదేశం.. అని పేరు పేట్టినట్టు ఆయన ప్రకటించారు.
ఒక వైపు.. ప్రధాన సమస్యలపై ప్లాన్ ఏ లో భాగంగా లోకేశ్ ను జనాల్లోకి పంపించడం.. మరోవైపు.. ప్లాన్ బి అమలులో భాగంగా ఇలాంటి సమస్యలపై శ్రేణులన్నిటినీ ముందుకు తీసుకువెళ్లడం చూస్తుంటే.. రాను రాను టీడీపీ నాయకత్వం మరింత ప్రభావవంతగా.. ప్రజాపోరాటాలు చేయనుందని స్పష్టమవుతోంది. ఇదే జరిగితే.. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు సైతం.. తగ్గట్టుగానే స్పందించడం ఖాయం.
ఈ లెక్కన.. ముందుందు.. రాజకీయ విమర్శలు, ప్రతివిమర్శల జడివాన ఖాయమని.. విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రాబోయే ఎన్నికలే ఇందుకు ప్రాతిపదిక అని విశ్లేషిస్తున్నారు.
తాజావార్తలు
-
Paraquat Herbicide Ban: హైకోర్టుకు చేరిన గడ్డి మందు వివాదం.. ప్రభుత్వ జీవోపై సవాల్
-
Off The Record: గోదావరి పుష్కరాలపై వేల కోట్ల కన్ను..? ఎమ్మెల్యేల కొత్త స్కెచ్ ఇదేనా..!
-
Kitchen Tips : గ్యాస్ స్టవ్ కడ్డీలపై జిడ్డా.? ఈ 2 చిట్కాలతో కొత్తలా మెరుస్తాయి.!
-
Israel-Hezbollah: ఇజ్రాయెల్-హిజ్బుల్లా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం! అమెరికా సంకేతాలు
-
Kuldeep Yadav: కుల్దీప్ స్థానానికి ముప్పు..? టీమిండియాలో అసలు నిజాలు వెల్లడించిన కోచ్..
ట్రెండింగ్
-
Freezer Cleaning Hacks: ఫ్రీజర్లో ఐస్ పేరుకుపోతోందా.? ఈ ట్రిక్స్తో నిమిషాల్లో క్లీన్.!
-
Food Grade Knives : తుప్పు కత్తులు వాడుతున్నారా.? ఇక భారీ మూల్యం చెల్లించాల్సిందే.!
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై టెన్షన్ అక్కర్లేదు.. మరో నాలుగేళ్లు ఆడుతాడు!
-
Rs 20 Note Viral: స్వామీ మా అత్త త్వరగా చనిపోయేలా చూడు.. దేవుడికి 20 రూపాయల నోటుపై వినతి!
-
T20 World Cup 2026: జోష్ మీదున్న భారత్కు భారీ షాక్.. ప్రపంచ కప్కు మ్యాచ్ విన్నర్ దూరం!